Movie News

రాక రాక వ‌చ్చిన స‌మంత‌.. ఏం మాట్లాడింది?

ఒక‌ప్ప‌టి టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత హైద‌రాబాద్‌లో ఓ సినిమా స్టేజ్ మీద మాట్లాడి చాలా కాల‌మే అయిపోయింది. ఖుషి మూవీ త‌ర్వాత తెలుగులో ఆమె సినిమానే చేయ‌లేదు. వేరే సినిమాల ఈవెంట్ల‌లోనూ మాట్లాడ‌లేదు. ఇటీవ‌ల కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో సామ్ పేరు అన‌వ‌స‌రంగా మీడియాలో నానింది.

ఈ నేప‌థ్యంలో స‌మంత పాల్గొన్న ఓ సినిమా ఈవెంట్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఆ చిత్ర‌మే.. జిగ్రా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భ‌ట్ లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. ఇది తెలుగులో రానా స‌మ‌ర్ప‌ణ‌లో ద‌స‌రా కానుక‌గా రిలీజ‌వుతున్న నేప‌థ్యంలో నిర్వ‌హించిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు సామ్ హాజ‌రైంది. అగ్ర ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సైతం ఈ వేడుక‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స‌మంత ప్ర‌సంగం ఆస‌క్తి రేకెత్తించింది.

ఐతే ఇటీవ‌లి వివాదం జోలికి వెళ్ల‌కుండా సింపుల్‌గా త‌న స్పీచ్‌ను ముగించింది స‌మంత‌. త‌న‌ను క‌లిసే అమ్మాయిలంద‌రికీ మీ క‌థ‌లో మీరే హీరోలు అని చెప్పాల‌ని అనుకుంటాన‌ని.. జిగ్రా లాంటి సినిమాలు అవే సందేశాన్ని ఇస్తాయ‌ని సామ్ పేర్కొంది. గ‌త నెల‌లో 35 లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీని అందించిన రానా.. ఇప్పుడు జిగ్రాను తెలుగులో రిలీజ్ చేస్తుండ‌డం మంచి విష‌య‌మ‌ని ఆమె అంది. రానా త‌న‌కుసోద‌రుడు అని.. ప్ర‌తి అమ్మాయికీ రానా లాంటి బ్ర‌ద‌ర్ ఉండాల‌ని స‌మంత చెప్పింది.

రానాకు పెళ్ల‌యిపోయింది కాబ‌ట్టి అమ్మాయిలంద‌రికీ అత‌ను బ్ర‌ద‌రే అని సామ్ స‌ర‌దాగా వ్యాఖ్యానించింది. ఈ వేడుక‌కు వ‌చ్చిన వాళ్లంద‌రూ త‌న‌కు జిగ్రాలే అని చెప్పిన సామ్.. రాహుల్ ర‌వీంద్ర‌న్ త‌న‌కు 15 ఏళ్లుగా మంచి ఫ్రెండ్ అని, త‌న జీవితంలో అత‌డిది ముఖ్య పాత్ర అని పేర్కొంది. త్రివిక్ర‌మ్‌తో తాను మూడు సినిమాలు చేశాన‌ని అవి త‌న కెరీర్ ఎదుగుద‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని అంది. రానా నిర్మాణంలో ఓ బేబీ చేశాన‌ని, అది త‌న కెరీర్లో బిగ్గెస్ట్ ఫిలిం అని చెప్పింది. తెలుగు ప్రేక్ష‌కుల ప్రేమ గురించి అంద‌రికీ తెలిసిందే అన్న సామ్.. వాళ్ల వ‌ల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానంది.

This post was last modified on October 9, 2024 12:27 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago