ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ చూసి, కాలానుగుణంగా మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తమను తాము మౌల్డ్ చేసుకోలేక త్వరగా రిటైర్ అవుతున్న దర్శకుల జాబితా పెద్దదే ఉంది. భీమినేని శ్రీనివాస నుంచి వివి వినాయక్ దాకా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దది. కృష్ణవంశీ అడపాదడపా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ మధ్య తీసిన రంగమార్తాండ ఓవర్ డ్రామా సెంటిమెంట్ తో ఫలితాలు అందుకోలేకపోయింది. చూడాలని ఉంది, ఒక్కడు లాంటి మర్చిపోలేని ఆల్ టైం క్లాసిక్స్ ఇచ్చిన గుణశేఖర్ త్వరలో యుఫోరియాతో రాబోతున్నారు. నిన్న టీజర్ లాంచ్ చేసి కాన్సెప్ట్ పరిచయం చేశారు.
టేకింగ్ చూస్తుంటేనే గుణశేఖర్ ఎంతగా ట్రెండ్ ని ఔపసోన పట్టారో అర్థం చేసుకోవచ్చు. కాలేజీ యువత, డ్రగ్స్ వాడకం, లైంగిక వేధింపులు, రేపులు ఇలా నిత్యం సమాజంలో జరుగుతున్న సంఘటనలనే హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్నారు. విజువల్స్ ఫ్రెష్ గా ఉన్నాయి. ప్రెస్ మీట్ లో గుణశేఖర్ చెప్పినట్టు ఇప్పుడు తెలుగు పేర్లు పెడితే అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని, ముందు ఉద్వేగం టైటిల్ అనుకుని స్వంత వాళ్లే వద్దని చెబితే యూఫోరియాగా మార్చనని అన్నారు. సో ఇప్పటి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో దాన్నే ఇచ్చే ప్రయత్నం చేసినట్టు స్పష్టం అర్థం అవుతోంది.
శాకుంతలం నేర్పించిన పాఠం గుణశేఖర్ త్వరగా వంటబట్టించుకున్నారు. కేవలం గ్రాండియర్లతో పనవ్వదని, బలమైన కంటెంట్ ఉంటే బడ్జెట్ తక్కువైనా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ మధ్య చాలా చిన్న సినిమాలు రుజువు చేయడంతో ఆయన రూటు మార్చుకున్నారు. ఒకవేళ ఇది కనక పాజిటివ్ రిజల్ట్ ఇస్తే ఇదే పంధా కొనసాగించవచ్చు. భూమిక హీరోయిన్ గా ఉన్న టైంలో ఆమె కెరీర్ లోనే అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచిన ఒక్కడు తర్వాత ఇన్నేళ్లకు ఆమెకు మరో కీలక పాత్ర ఇచ్చారు గుణశేఖర్. విడుదల తేదీ ఇంకా ఖరారు చేయని యుఫోరియాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలని గుణశేఖర్ ఆలోచన.
This post was last modified on October 8, 2024 6:40 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…