ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల లిస్టు తీస్తే.. అందులో మలయాళ చిత్రం ‘దృశ్యం’ అగ్ర భాగాన ఉంటుంది. భాషా భేదం లేకుండా అందరూ ఈ కథను ఆదరించారు.
మలయాళంలో బ్లాక్ బస్టర్ అయ్యాక తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే అన్ని చోట్లా ఘనవిజయం సాధించింది. చైనీస్, సింహళీస్ లాంటి విదేశీ భాషల్లో సైతం ఈ చిత్రం రీమేక్ అయి మంచి ఫలితాన్ని అందుకోవడం విశేషం.
‘దృశ్యం’కు కొనసాగింపుగా మోహన్ లాల్-జీతు జోసెఫ్ జోడీ ‘దృశ్యం-2’ తీస్తే అది కూడా అద్భుత స్పందన తెచ్చుకుంది. కరోనా టైంలో నేరుగా ఓటీటీలో రిలీజై ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. దీనికి కొనసాగింపుగా ‘దృశ్యం-3’ కూడా ఉంటుందనే సంగతి ముందే ఖరారైంది. ఇప్పుడీ సినిమాను అధికారికంగానే ప్రకటించారు. వచ్చే ఏడాది చివర్లో దృశ్యం-3’ ప్రేక్షకుల ముందుకు రానుందట.
మలయాళ ఫిలిం మేకర్స్, నటులు పెద్దగా టైం తీసుకోకుండా చకచకా సినిమాలు లాగించేస్తుంటారు. ప్రస్తుతం మోహన్ లాల్, జీతు జోసెఫ్ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను ఈ జోడీ సెట్స్ మీదికి తీసుకెళ్తుందట. క్రిస్మస్కు దృశ్యం-3ని రిలీజ్ చేస్తారట.
ఐతే ఈసారి ప్రత్యేకత ఏంటంటే.. ‘దృశ్యం’ కథను ఇంతటితో ముగించేయబోతున్నారు. ఇంకో పార్ట్ అంటే సాగతీతగా అనిపిస్తుందని.. కాబట్టి మూడో పార్ట్తో సినిమాను ముగించేయాలని లాల్, జీతు ఫిక్సయ్యారట.
ముగిసిందనుకున్న మర్డర్ కేసును రీ ఓపెన్ చేసి మళ్లీ తనను, తన కుటుంబాన్ని ఇరుకున పెట్టాలని చూసిన పోలీసులను తన మాస్టర్ ప్లాన్తో హీరో ఎలా బోల్తా కొట్టించాడో ‘దృశ్యం-2’లో అద్భుతంగా చూపించాడు జీతు. మరి ఈసారి కేసును పోలీసులు ఎలా ముందుకు తీసుకెళ్తారు.. దానికి హీరో కౌంటర్ ఎటాక్ ఎలా ఉంటుందని.. ఈ కథకు ముగింపు ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరం.
This post was last modified on October 8, 2024 10:29 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…