ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల లిస్టు తీస్తే.. అందులో మలయాళ చిత్రం ‘దృశ్యం’ అగ్ర భాగాన ఉంటుంది. భాషా భేదం లేకుండా అందరూ ఈ కథను ఆదరించారు.
మలయాళంలో బ్లాక్ బస్టర్ అయ్యాక తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే అన్ని చోట్లా ఘనవిజయం సాధించింది. చైనీస్, సింహళీస్ లాంటి విదేశీ భాషల్లో సైతం ఈ చిత్రం రీమేక్ అయి మంచి ఫలితాన్ని అందుకోవడం విశేషం.
‘దృశ్యం’కు కొనసాగింపుగా మోహన్ లాల్-జీతు జోసెఫ్ జోడీ ‘దృశ్యం-2’ తీస్తే అది కూడా అద్భుత స్పందన తెచ్చుకుంది. కరోనా టైంలో నేరుగా ఓటీటీలో రిలీజై ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. దీనికి కొనసాగింపుగా ‘దృశ్యం-3’ కూడా ఉంటుందనే సంగతి ముందే ఖరారైంది. ఇప్పుడీ సినిమాను అధికారికంగానే ప్రకటించారు. వచ్చే ఏడాది చివర్లో దృశ్యం-3’ ప్రేక్షకుల ముందుకు రానుందట.
మలయాళ ఫిలిం మేకర్స్, నటులు పెద్దగా టైం తీసుకోకుండా చకచకా సినిమాలు లాగించేస్తుంటారు. ప్రస్తుతం మోహన్ లాల్, జీతు జోసెఫ్ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను ఈ జోడీ సెట్స్ మీదికి తీసుకెళ్తుందట. క్రిస్మస్కు దృశ్యం-3ని రిలీజ్ చేస్తారట.
ఐతే ఈసారి ప్రత్యేకత ఏంటంటే.. ‘దృశ్యం’ కథను ఇంతటితో ముగించేయబోతున్నారు. ఇంకో పార్ట్ అంటే సాగతీతగా అనిపిస్తుందని.. కాబట్టి మూడో పార్ట్తో సినిమాను ముగించేయాలని లాల్, జీతు ఫిక్సయ్యారట.
ముగిసిందనుకున్న మర్డర్ కేసును రీ ఓపెన్ చేసి మళ్లీ తనను, తన కుటుంబాన్ని ఇరుకున పెట్టాలని చూసిన పోలీసులను తన మాస్టర్ ప్లాన్తో హీరో ఎలా బోల్తా కొట్టించాడో ‘దృశ్యం-2’లో అద్భుతంగా చూపించాడు జీతు. మరి ఈసారి కేసును పోలీసులు ఎలా ముందుకు తీసుకెళ్తారు.. దానికి హీరో కౌంటర్ ఎటాక్ ఎలా ఉంటుందని.. ఈ కథకు ముగింపు ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరం.
This post was last modified on October 8, 2024 10:29 am
మొత్తానికి ఒడుదొడుకులను దాటి ‘దేవర’ సినిమా సక్సెస్ అనిపించుకున్నట్లే కనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ చూసినపుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు…
https://www.youtube.com/watch?v=RYBzWxQOnMM రుద్రమదేవి లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా తీసి మంచి ఫలితాన్నే అందుకున్నాడు సీనియర్ దర్శకుడు గుణశేఖర్. కానీ…
‘అందాల రాక్షసి’తో మొదలుపెట్టి నటుడిగా చాలానే సినిమాలు చేసిన రాహుల్ రవీంద్రన్.. దర్శకుడిగా మారి తీసిన ‘చి ల సౌ’…
కొన్ని కొన్ని ఘటనలకు కార్యాకారణ సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలకు.. అక్కడి తెలుగు దేశం పార్టీ పుంజుకోవడానికి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం సాయంత్రం 5 గంటల…
ఈ మధ్య వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు, దివ్వెల మాధురి అనే వివాహితకు మధ్య సంబంధం గురించి ఎంత రచ్చ…