సూపర్ స్టార్ రజినీకాంత్కు సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్తో మంచి అనుబంధం ఉంది. వీరి కలయికలో రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. అవే.. ముత్తు, నరసింహా. ఈ రెండు సినిమాలు రజినీ కెరీర్లో ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే అలాంటి దర్శకుడితోనే ‘లింగ’ లాంటి డిజాస్టర్ మూవీ కూడా ఇచ్చాడు రజినీ.
ఐతే ఈ సినిమా ఫెయిల్యూర్కు ఎడిటింగ్లో రజినీ చేసిన తప్పిదాలు కారణమంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవికుమార్ చెప్పడం చర్చనీయాంశం అవుతోంది. రజినీ పుట్టిన రోజైన డిసెంబరు 12న సినిమాను రిలీజ్ చేయాలన్న ఆతృతలో తాము అనుకున్న విధంగా సినిమాను తీర్చిదిద్దలేకపోయారని.. రజినీ చేసిన మార్పులు చేర్పుల వల్ల సినిమా పాడైపోయిందని.. అందుకే ఆశించిన ఫలితం రాలేదని రవికుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
‘లింగ’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ వరకు అంతా బాగానే అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ మాత్రం సిల్లీగా అనిపిస్తుంది. హడావుడిగా సినిమాను ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. బెలూన్ ఫైట్ అయితే ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయింది. ఇదంతా రజనీ వల్లే అన్నట్లు మాట్లాడాడు రవికుమార్. క్లైమాక్స్లో సీజీ షాట్స్తో భారీ సెటప్ పెట్టుకున్నామని.. కానీ రజినీ పుట్టిన రోజుకు సినిమా రిలీజ్ చేయాలని పట్టుబడడంతో ఆ వర్క్ పూర్తి కాలేదని రవికుమార్ చెప్పాడు.
క్లైమాక్స్ ముంగిట అనుష్క మీద మంచి పాట కూడా అనుకున్నామని.. కానీ అది రజినీనే తీయించేశాడని చెప్పాడు రవికుమార్. ఇంకో కీలకమైన ట్విస్ట్ ఉండే సీన్ కూడా తీసేశారని.. త్వరగా సినిమా పూర్తి కావాలన్న ఉద్దేశంతో బెలూన్ ఫైట్ పెట్టించారని.. మొత్తంగా సెకండాఫ్ను రజినీ గందరగోళంగా మార్చేశారని రవికుమార్ అన్నాడు. ఐతే రవికుమార్ సున్నితమైన టోన్లోనే ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ రజినీ అభిమానులకు ఈ కామెంట్స్ నచ్చక ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు.
This post was last modified on October 7, 2024 6:18 pm
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…