సూపర్ స్టార్ రజినీకాంత్కు సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్తో మంచి అనుబంధం ఉంది. వీరి కలయికలో రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. అవే.. ముత్తు, నరసింహా. ఈ రెండు సినిమాలు రజినీ కెరీర్లో ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే అలాంటి దర్శకుడితోనే ‘లింగ’ లాంటి డిజాస్టర్ మూవీ కూడా ఇచ్చాడు రజినీ.
ఐతే ఈ సినిమా ఫెయిల్యూర్కు ఎడిటింగ్లో రజినీ చేసిన తప్పిదాలు కారణమంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవికుమార్ చెప్పడం చర్చనీయాంశం అవుతోంది. రజినీ పుట్టిన రోజైన డిసెంబరు 12న సినిమాను రిలీజ్ చేయాలన్న ఆతృతలో తాము అనుకున్న విధంగా సినిమాను తీర్చిదిద్దలేకపోయారని.. రజినీ చేసిన మార్పులు చేర్పుల వల్ల సినిమా పాడైపోయిందని.. అందుకే ఆశించిన ఫలితం రాలేదని రవికుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
‘లింగ’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ వరకు అంతా బాగానే అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ మాత్రం సిల్లీగా అనిపిస్తుంది. హడావుడిగా సినిమాను ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. బెలూన్ ఫైట్ అయితే ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయింది. ఇదంతా రజనీ వల్లే అన్నట్లు మాట్లాడాడు రవికుమార్. క్లైమాక్స్లో సీజీ షాట్స్తో భారీ సెటప్ పెట్టుకున్నామని.. కానీ రజినీ పుట్టిన రోజుకు సినిమా రిలీజ్ చేయాలని పట్టుబడడంతో ఆ వర్క్ పూర్తి కాలేదని రవికుమార్ చెప్పాడు.
క్లైమాక్స్ ముంగిట అనుష్క మీద మంచి పాట కూడా అనుకున్నామని.. కానీ అది రజినీనే తీయించేశాడని చెప్పాడు రవికుమార్. ఇంకో కీలకమైన ట్విస్ట్ ఉండే సీన్ కూడా తీసేశారని.. త్వరగా సినిమా పూర్తి కావాలన్న ఉద్దేశంతో బెలూన్ ఫైట్ పెట్టించారని.. మొత్తంగా సెకండాఫ్ను రజినీ గందరగోళంగా మార్చేశారని రవికుమార్ అన్నాడు. ఐతే రవికుమార్ సున్నితమైన టోన్లోనే ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ రజినీ అభిమానులకు ఈ కామెంట్స్ నచ్చక ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు.
This post was last modified on October 7, 2024 6:18 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…