జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతను ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నడు. ఎంతోమంది దిగ్గజాలు తన నటనను కొనియాడారు. ఐతే దేశంలోనే మేటి నటుల్లో ఒకడిగా పేరున్న ప్రకాష్ రాజ్ లాంటి దిగ్గజం తారక్ నటనను కొనియాడితే.. తెలుగులో తనకు అత్యంత నచ్చిన నటుడు తారకే అని చెబితే అభిమానులు మహదానందానికి గురవుతారనడంలో సందేహం లేదు.
దేవర సక్సెస్ మీట్లో ప్రకాష్ రాజ్ ఇదే మాట చెప్పాడు. ఈ సందర్భఃగా తారక్ మీద తనకున్న ప్రేమ గురించి ఎవరికీ తెలియదన్నాడు చివరికి తారక్కు కూడా ఆ విషయం చెప్పలేదన్నాడు.
తారక్ మీద నాకెంత ప్రేమంటే.. అది ఎవరికీ చెప్పలేదు. తారక్తో కూడా చెప్పుకోలేదు. ఆ మధ్య ఆస్కార్ అవార్డుల వేడుక కోసం వెళ్లినపుడు అక్కడ అంతమంది గొప్ప గొప్ప నటుల ముందు నిలుచుని తారక్ మాట్లాడుతుంటే.. ఇంట్లో కూర్చుని వీడియో చూశాను. అప్పుడు నేనెంత గర్వించానో మాటల్లో చెప్పలేను.
తెలుగులో నాకు చాలామంది హీరోలు ఇష్టం. కానీ ఆ హీరోల్లో అత్యుత్తమ నటుడు ఎవరు అంటే తారకే. అలాంటి ఎనర్జిటిక్ నటుడు.. కొరటాల శివ కోసం అండగా నిలబడి దేవర లాంటి సినిమా తీయడాడనికి అన్ని రకాలుగా తోడ్పాటు అందించడం గొప్ప విషయం అని ప్రకాష్ రాజ్ అన్నారు.
ఇదే ఈవెంట్లో పాల్గొన్న సీనియర్ నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన కెరీర్లో ఉన్న ఒక అసంతృప్తిని బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తీర్చారని చెప్పాడు. తాను ఎంతోమంది లెజెండరీ నటులు, సీనియర్లతో కలిసి సినిమాలు చేశానని.. కానీ పెద్ద ఎన్టీఆర్తో నటించలేదనే అసంతృప్తి మాత్రం ఉండిపోయిందని.. ఐతే అఖండలో బాలయ్యతో, ఇప్పుడు దేవరలో తారక్తో నటించడంతో ఆ బాధ తీరిపోయిందని శ్రీకాంత్ చెప్పాడు.
తాను తారక్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని.. తన జర్నీ అంతా తనకు తెలుసని.. ఎంతో కష్టపడడం వల్లే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఇంత గుర్తింపు తెచ్చుకున్నాడని.. భవిష్యత్తులో అతను ఇంకా పెద్ద స్థాయికి వెళ్తాడని శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
This post was last modified on October 5, 2024 11:20 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…