శాండల్ వుడ్ లో మంచి గుర్తింపు ఉన్న హీరో ధృవ సర్జ. స్వయానా యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు. ఆ మధ్య పొగరు అనే డబ్బింగ్ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న వెంట పడుతూ అల్లరి చేసే భారీకాయం గుర్తుందా. ఆ కుర్రాడు ఇతనే. పదకొండు భాషల్లో తీసుకొస్తున్న ప్యాన్ ఇండియా మూవీ మార్టిన్ వచ్చే వారం అక్టోబర్ 11 దసరా సందర్భంగా విడుదల కాబోతోంది. ప్రతి ఈవెంట్ లో ధృవ వెంటే ఉంటూ అర్జున్ ప్రమోషన్ల బాధ్యతను తీసుకున్నాడు. నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి మార్టిన్గ్ బాగోకపోతే, నా టాలెంట్ నచ్చకపోతే ఇకపై ప్రోత్సహించకండి అంటూ ధృవ చెప్పడం ఆకట్టుకుంది.
ఇదంతా ఓకే కానీ అర్జున్ మేనల్లుడికి మార్కెట్ లో చాలా పెద్ద సవాల్ ముందుంది. ఒక రోజు ముందు అక్టోబర్ 10 సూపర్ స్టార్ రజనీకాంత్ వేట్టయన్ భారీ ఎత్తున రిలీజ్ కానుంది. దీనికి ధృవ స్వంత రాష్ట్రం కర్ణాటకలోనూ డిమాండ్ ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు బయట మార్కెట్ల గురించి చెప్పాలా. ఇక తెలుగులో వేట్టయన్ పాటు ఇంకో నాలుగు సినిమాలు నువ్వా నేనాని కవ్విస్తున్నాయి. గోపీచంద్ విశ్వంకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండదండలు పుష్కలంగా ఉపయోగపడతాయి. సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరోని యువి క్రియేషన్స్ దగ్గరుండి మరీ పబ్లిసిటీ పరంగా శ్రద్ధ తీసుకుంటోంది.
అలియా భట్ జిగ్రాని సురేష్ ఏషియన్ పంపిణి చేయడం వల్ల చెప్పుకోదగ్గ స్క్రీన్లు దొరుకుతాయి. ఇవి కాకుండా 12న సుహాస్ జనక అయితే గనకతో వస్తున్నాడు. దిల్ రాజు సంస్థ కాబట్టి ప్లానింగ్ ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. వీటి మధ్య మార్టిన్ నెగ్గుకురావడం అంత సులభం కాదు. పాకిస్థాన్ వెళ్లిన ఒక భారతీయ యోధుడు చేసే అరాచకం మీద అర్జున్ స్వయంగా ఈ కథ రాశారు. అల్లుడి కోసం కాబట్టి కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. తెలుగులో పొగరు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ధృవ సర్జ ఆశలన్నీ మార్టిన్ మీదే ఉన్నాయి. మరి ఈ కండల వీరుడు పోటీని తట్టుకుని ఎలా నిలుస్తాడో చూడాలి.
This post was last modified on October 5, 2024 11:15 am
చాలా చిన్న వయసులో నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి కన్నుమూయడం ఇండస్ట్రీ వర్గాలను, అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. కేవలం…
గతంలో కడప జిల్లాను వైఎస్సార్ జిల్లాగా మారుస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు…
నిన్న విడుదలైన స్వాగ్ యువతకు బాగానే కనెక్ట్ అయ్యిందని సోషల్ మీడియా రెస్పాన్స్ చెబుతోంది. సాధారణ ప్రేక్షకులకు ఏ మేరకు…
జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతను ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నడు. ఎంతోమంది…
రాష్ట్రంలో రెడ్ బుక్కుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు ఇది టీడీపీ యువ నాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్కు…
అయాన్ ముఖర్జీ.. ‘వేకప్ సిద్’ అనే క్లాస్ మూవీతో పరిచయమైన బాలీవుడ్ దర్శకుడు. ఈ చిత్రం ఓ మోస్తరు ఫలితాన్ని…