శాండల్ వుడ్ లో మంచి గుర్తింపు ఉన్న హీరో ధృవ సర్జ. స్వయానా యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు. ఆ మధ్య పొగరు అనే డబ్బింగ్ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న వెంట పడుతూ అల్లరి చేసే భారీకాయం గుర్తుందా. ఆ కుర్రాడు ఇతనే. పదకొండు భాషల్లో తీసుకొస్తున్న ప్యాన్ ఇండియా మూవీ మార్టిన్ వచ్చే వారం అక్టోబర్ 11 దసరా సందర్భంగా విడుదల కాబోతోంది. ప్రతి ఈవెంట్ లో ధృవ వెంటే ఉంటూ అర్జున్ ప్రమోషన్ల బాధ్యతను తీసుకున్నాడు. నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి మార్టిన్గ్ బాగోకపోతే, నా టాలెంట్ నచ్చకపోతే ఇకపై ప్రోత్సహించకండి అంటూ ధృవ చెప్పడం ఆకట్టుకుంది.
ఇదంతా ఓకే కానీ అర్జున్ మేనల్లుడికి మార్కెట్ లో చాలా పెద్ద సవాల్ ముందుంది. ఒక రోజు ముందు అక్టోబర్ 10 సూపర్ స్టార్ రజనీకాంత్ వేట్టయన్ భారీ ఎత్తున రిలీజ్ కానుంది. దీనికి ధృవ స్వంత రాష్ట్రం కర్ణాటకలోనూ డిమాండ్ ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు బయట మార్కెట్ల గురించి చెప్పాలా. ఇక తెలుగులో వేట్టయన్ పాటు ఇంకో నాలుగు సినిమాలు నువ్వా నేనాని కవ్విస్తున్నాయి. గోపీచంద్ విశ్వంకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండదండలు పుష్కలంగా ఉపయోగపడతాయి. సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరోని యువి క్రియేషన్స్ దగ్గరుండి మరీ పబ్లిసిటీ పరంగా శ్రద్ధ తీసుకుంటోంది.
అలియా భట్ జిగ్రాని సురేష్ ఏషియన్ పంపిణి చేయడం వల్ల చెప్పుకోదగ్గ స్క్రీన్లు దొరుకుతాయి. ఇవి కాకుండా 12న సుహాస్ జనక అయితే గనకతో వస్తున్నాడు. దిల్ రాజు సంస్థ కాబట్టి ప్లానింగ్ ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. వీటి మధ్య మార్టిన్ నెగ్గుకురావడం అంత సులభం కాదు. పాకిస్థాన్ వెళ్లిన ఒక భారతీయ యోధుడు చేసే అరాచకం మీద అర్జున్ స్వయంగా ఈ కథ రాశారు. అల్లుడి కోసం కాబట్టి కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. తెలుగులో పొగరు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ధృవ సర్జ ఆశలన్నీ మార్టిన్ మీదే ఉన్నాయి. మరి ఈ కండల వీరుడు పోటీని తట్టుకుని ఎలా నిలుస్తాడో చూడాలి.
This post was last modified on October 5, 2024 11:15 am
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…