శాండల్ వుడ్ లో మంచి గుర్తింపు ఉన్న హీరో ధృవ సర్జ. స్వయానా యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు. ఆ మధ్య పొగరు అనే డబ్బింగ్ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న వెంట పడుతూ అల్లరి చేసే భారీకాయం గుర్తుందా. ఆ కుర్రాడు ఇతనే. పదకొండు భాషల్లో తీసుకొస్తున్న ప్యాన్ ఇండియా మూవీ మార్టిన్ వచ్చే వారం అక్టోబర్ 11 దసరా సందర్భంగా విడుదల కాబోతోంది. ప్రతి ఈవెంట్ లో ధృవ వెంటే ఉంటూ అర్జున్ ప్రమోషన్ల బాధ్యతను తీసుకున్నాడు. నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి మార్టిన్గ్ బాగోకపోతే, నా టాలెంట్ నచ్చకపోతే ఇకపై ప్రోత్సహించకండి అంటూ ధృవ చెప్పడం ఆకట్టుకుంది.
ఇదంతా ఓకే కానీ అర్జున్ మేనల్లుడికి మార్కెట్ లో చాలా పెద్ద సవాల్ ముందుంది. ఒక రోజు ముందు అక్టోబర్ 10 సూపర్ స్టార్ రజనీకాంత్ వేట్టయన్ భారీ ఎత్తున రిలీజ్ కానుంది. దీనికి ధృవ స్వంత రాష్ట్రం కర్ణాటకలోనూ డిమాండ్ ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు బయట మార్కెట్ల గురించి చెప్పాలా. ఇక తెలుగులో వేట్టయన్ పాటు ఇంకో నాలుగు సినిమాలు నువ్వా నేనాని కవ్విస్తున్నాయి. గోపీచంద్ విశ్వంకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండదండలు పుష్కలంగా ఉపయోగపడతాయి. సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరోని యువి క్రియేషన్స్ దగ్గరుండి మరీ పబ్లిసిటీ పరంగా శ్రద్ధ తీసుకుంటోంది.
అలియా భట్ జిగ్రాని సురేష్ ఏషియన్ పంపిణి చేయడం వల్ల చెప్పుకోదగ్గ స్క్రీన్లు దొరుకుతాయి. ఇవి కాకుండా 12న సుహాస్ జనక అయితే గనకతో వస్తున్నాడు. దిల్ రాజు సంస్థ కాబట్టి ప్లానింగ్ ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. వీటి మధ్య మార్టిన్ నెగ్గుకురావడం అంత సులభం కాదు. పాకిస్థాన్ వెళ్లిన ఒక భారతీయ యోధుడు చేసే అరాచకం మీద అర్జున్ స్వయంగా ఈ కథ రాశారు. అల్లుడి కోసం కాబట్టి కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. తెలుగులో పొగరు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ధృవ సర్జ ఆశలన్నీ మార్టిన్ మీదే ఉన్నాయి. మరి ఈ కండల వీరుడు పోటీని తట్టుకుని ఎలా నిలుస్తాడో చూడాలి.
This post was last modified on October 5, 2024 11:15 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…