మొత్తానికి ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న దాని కంటే మెరుగైన ఫలితం దిశగా దూసుకెళ్తోంది. కొంచెం మిక్స్డ్ రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ.. తట్టుకుని తొలి వీకెండ్లో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఆ తర్వాత కొంచెం డల్ అయినట్లు కనిపించింది. కానీ గాంధీ జయంతి రోజు సినిమా హౌస్ ఫుల్స్తో నడిచింది. తర్వాతి రోజు కొంచెం వసూళ్లు తగ్గినా.. పరిస్థితి నిరాశాజనకంగా అయితే లేదు.
దసరా సెలవులను బాగా ఉపయోగించుకుంటూ ప్రతి రోజూ చెప్పుకోదగ్గ షేరే రాబడుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ సెంచరీ కొట్టేయడం విశేషం. ఏపీ, తెలంగాణల్లో కలిపి ‘దేవర’ షేర్ రూ.100 కోట్ల మార్కును ఆల్రెడీ దాటేసింది. బుధవారం నాటికే ఈ సినిమా ఈ మార్కును అందుకుంది.
ఆరు రోజుల వ్యవధిలో ‘దేవర’ తెలుగు రాష్ట్రాల షేర్ రూ.110 కోట్లకు చేరువైంది. నైజాంలో రూ.42 కోట్ల మేర షేర్ రావడం విశేషం. సీడెడ్లో ఈ చిత్రం రూ.22 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. వైజాగ్లో రూ.11 కోట్లకు కాస్త ఎక్కువగా షేర్ వచ్చింది. ఏపీలోని మిగతా ఏరియాలన్నీ కలిపితే రూ.28 కోట్ల మేర షేర్ వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ లెక్కలు చూస్తే ‘దేవర’ షేర్ రూ.200 కోట్లకు చేరువగా ఉండొచ్చు. గ్రాస్ వసూళ్లు రూ.300 కోట్లను దాటిపోయాయి. రెండో వీకెండ్లో కూడా సినిమా బాగా ఆడేలా కనిపిస్తోంది.
ఇటీవలే ‘దావూది రే’ పాటను యాడ్ చేశారు. దీని కోసం తారక్ ఫ్యాన్స్ మళ్లీ థియేటర్లకు వస్తారనడంలో సందేహం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను బాగానే చూస్తున్నారు. రెండో వీకెండ్లో సినిమా హౌస్ ఫుల్స్తో రన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. దసరా సినిమాలు వచ్చే వరకు ‘దేవర’కు ఢోకా లేనట్లే.
ఇప్పుడు కరోనా ఊసే లేదు. జనం థియేటర్లకు రాని పరిస్థితులు లేవు. ఇలాంటి టైంలో కమల్ హాసన్, శంకర్ల క్రేజీ…
కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని దాదాపు…
ఇంకో పంతొమ్మిది రోజుల్లో అక్టోబర్ 23 డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఎలాంటి కానుకలు ఉంటాయనే దాని…
వైసీపీ కీలక నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం గుంటూరు జైల్లో…
కరోనా టైంలో ఓటిటి విప్లవం జనాన్ని ఏ స్థాయిలో తన వైపు తిప్పుకుందో చూస్తున్నాం. వందల కోట్ల రూపాయలను మంచి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు…