కొత్త చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీల్లోకి వచ్చేస్తున్న ఈ టైంలో దేశవ్యాప్తంగా ఒక సినిమా కోసం ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆ చిత్రమే.. లక్ష్మీబాంబ్. బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రాఘవ లారెన్స్ తెరకెక్కించిన చిత్రమిది. సౌత్ ఇండియన్ బ్లాక్బస్టర్ ‘కాంఛన’కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర హక్కులను కొన్ని నెలల కిందటే హాట్ స్టార్ సొంతం చేసుకుంది. దీపావళికి ‘లక్ష్మీబాంబ్’ పేలబోతోందని ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం ఐపీఎల్ హవా నడుస్తున్న నేపథ్యంలో ఆ టోర్నీ ముగింపు సమయంలో ‘లక్ష్మీబాంబ్’ను రిలీజ్ చేయనున్నారు. నవంబరు 9న ప్రిమియర్స్ పడనున్నాయి. అదే రోజు ఈ చిత్రం థియేటర్లలో కూడా రిలీజ్ కాబోతోంది.
ఐతే థియేటర్లు అప్పటికి తెరుచుకుంటాయా.. ఓటీటీ రిలీజ్కు రెడీ అయిన సినిమాను థియేటర్లలో అదే రోజు రిలీజ్ చేయడమేంటి అని సందేహాలు కలగడం సహజం. కానీ ఆ చిత్రం థియేటర్లలో రిలీజయ్యేది ఇండియాలో కాదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మరికొన్ని దేశాల్లో. అక్కడ కొన్ని నెలల ముందే థియేటర్లు తెరుచుకున్నాయి. మామూలుగా నడుస్తున్నాయి. ఇప్పటికే అక్కడ హిందీ సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ‘హాట్ స్టార్’తో ఒప్పందం జరిగే సమయంలోనే థియేటర్లు అందుబాటులో ఉన్న కొన్ని దేశాల్లో సినిమాను రిలీజ్ చేసుకునేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. ఇండియా కాకుండా బాలీవుడ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న అమెరికా, మరికొన్ని దేశాల్లో మాత్రం నిర్ణీత గడువులోపు థియేటర్లలో రిలీజ్ చేయకూడదని హాట్ స్టార్ హామీ తీసుకుంది. బహుశా థియేట్రికల్ రిలీజ్ ఉన్న దేశాల్లో హాట్స్టార్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండకపోవచ్చు.
This post was last modified on September 30, 2020 7:46 pm
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…