మొన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ రేపిన వివాదం ఎంత దూరం వెళ్లిందో చూస్తున్నాం. నాగార్జున ముందు క్షమాపణ కోరడంతో ఆగుదామని ఆలోచించినా ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉండటమే కాదు అక్కినేని ఫ్యామిలీ ఇమేజ్ ని ఇరకాటంలో పెట్టేలా ఉండటంతో పరువు నష్టం దావా వేస్తూ నాంపల్లి కోర్టుకు వెళ్లారు. నిజానికి ఇలా ఆధికార పార్టీ మినిస్టర్ మీద ప్రత్యక్ష యుద్ధానికి తలపడాల్సిన పరిస్థితి గతంలో ఎప్పుడూ రాలేదనే చెప్పాలి. టాలీవుడ్ ముక్తకంఠంతో ఏకతాటిపైకొచ్చి ఈ సంఘటనను ఖండించగా అభిమానుల నుంచి నిరసన స్వరాలు తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి.
కోర్టుకు వెళ్లడం ద్వారా నాగార్జున ఏ స్థాయి న్యాయం దక్కించుకుంటారనేది తర్వాత తేలుతుంది కానీ ఇది మాత్రం సాహసోపేత నిర్ణయమే. తమ కుటుంబం దీన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో నాగ చైతన్య, అఖిల్ లు ట్వీట్ల రూపంలో వ్యక్తం చేస్తుండగా అమల సైతం సున్నిత పదాలు కాకుండా ఎండగట్టే రీతిలో ప్రశ్నించడం అభిమానుల నుంచి భారీ మద్దతు దక్కించుకుంది. చిరంజీవితో మొదలుపెట్టి విశ్వక్ సేన్ దాకా అందరూ నిరసనలో భాగం కావడమే కాక తమ గళాన్ని గట్టిగా విప్పుతున్నారు. ఇక్కడితో వివాదం ముగిద్దామని కాంగ్రెస్ పెద్దలు కోరినా అప్పటికే వ్యవహారం న్యాయస్థానం మెట్లు ఎక్కేసింది.
ఒకరకంగా ఇదీ మంచిదే. రాబోయే రోజుల్లో ఇష్టం వచ్చినట్టు సినిమా స్టార్ల మీద నోరు పారేసుకుని ముందు తగిన ఆధారాలు ఉన్నాయో లేదో రాజకీయ నాయకులు చెక్ చేసుకుంటారు. వాళ్లకు కోర్టులు, వాయిదాలు కొత్త కాకపోవచ్చు. తీర్పులు ఎన్నో చూసి ఉండొచ్చు. కానీ ఫాలోయింగ్ ఉన్న హీరోలతో తలపడితే వాళ్ళ అభిమానుల దృష్టి చులకన కావడమనేది భవిష్యత్ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అందుకే ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని, హెచ్చరికను ఈ ఉదంతం ఇచ్చింది. మరి వాద ప్రతివాదాలు, జడ్జిల ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.
This post was last modified on October 4, 2024 10:21 am
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…