మొన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ రేపిన వివాదం ఎంత దూరం వెళ్లిందో చూస్తున్నాం. నాగార్జున ముందు క్షమాపణ కోరడంతో ఆగుదామని ఆలోచించినా ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉండటమే కాదు అక్కినేని ఫ్యామిలీ ఇమేజ్ ని ఇరకాటంలో పెట్టేలా ఉండటంతో పరువు నష్టం దావా వేస్తూ నాంపల్లి కోర్టుకు వెళ్లారు. నిజానికి ఇలా ఆధికార పార్టీ మినిస్టర్ మీద ప్రత్యక్ష యుద్ధానికి తలపడాల్సిన పరిస్థితి గతంలో ఎప్పుడూ రాలేదనే చెప్పాలి. టాలీవుడ్ ముక్తకంఠంతో ఏకతాటిపైకొచ్చి ఈ సంఘటనను ఖండించగా అభిమానుల నుంచి నిరసన స్వరాలు తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి.
కోర్టుకు వెళ్లడం ద్వారా నాగార్జున ఏ స్థాయి న్యాయం దక్కించుకుంటారనేది తర్వాత తేలుతుంది కానీ ఇది మాత్రం సాహసోపేత నిర్ణయమే. తమ కుటుంబం దీన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో నాగ చైతన్య, అఖిల్ లు ట్వీట్ల రూపంలో వ్యక్తం చేస్తుండగా అమల సైతం సున్నిత పదాలు కాకుండా ఎండగట్టే రీతిలో ప్రశ్నించడం అభిమానుల నుంచి భారీ మద్దతు దక్కించుకుంది. చిరంజీవితో మొదలుపెట్టి విశ్వక్ సేన్ దాకా అందరూ నిరసనలో భాగం కావడమే కాక తమ గళాన్ని గట్టిగా విప్పుతున్నారు. ఇక్కడితో వివాదం ముగిద్దామని కాంగ్రెస్ పెద్దలు కోరినా అప్పటికే వ్యవహారం న్యాయస్థానం మెట్లు ఎక్కేసింది.
ఒకరకంగా ఇదీ మంచిదే. రాబోయే రోజుల్లో ఇష్టం వచ్చినట్టు సినిమా స్టార్ల మీద నోరు పారేసుకుని ముందు తగిన ఆధారాలు ఉన్నాయో లేదో రాజకీయ నాయకులు చెక్ చేసుకుంటారు. వాళ్లకు కోర్టులు, వాయిదాలు కొత్త కాకపోవచ్చు. తీర్పులు ఎన్నో చూసి ఉండొచ్చు. కానీ ఫాలోయింగ్ ఉన్న హీరోలతో తలపడితే వాళ్ళ అభిమానుల దృష్టి చులకన కావడమనేది భవిష్యత్ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అందుకే ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని, హెచ్చరికను ఈ ఉదంతం ఇచ్చింది. మరి వాద ప్రతివాదాలు, జడ్జిల ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.
This post was last modified on October 4, 2024 10:21 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…