Movie News

ధృవ విలన్ వెనుక హెల్త్ ట్రాజెడీ

నిన్నటి తరం ప్రేక్షకులకు అరవింద్ స్వామి అంటే రోజా, బొంబాయి లాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించిన అందమైన హీరోగా పరిచయం. ఈ జనరేషన్ కు తను బాగా రిజిస్టరయ్యింది రామ్ చరణ్ ధృవతోనే. కూల్ విలనీని అతను పండించిన తీరు ఆ సినిమా గొప్ప విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. అక్కడి నుంచి అతను వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. వరసగా అవకాశాలు క్యూ కట్టాయి. టైం లేక కొన్ని క్రేజీ ప్రాజెక్టులు సైతం వదులుకోవాల్సి వచ్చింది. ఇటీవలే సత్యం సుందరంలో కార్తీతో తెరను పంచుకున్న అరవింద్ స్వామికి మరో గొప్ప క్లాసిక్ ఖాతాలో పడింది.

ఇదంతా బాగానే ఉంది కానీ రోజా పువ్వు కింద ముళ్ళు ఉన్నట్టు అరవింద్ స్వామి జీవితంలోనూ ఒక బ్లాక్ పీరియడ్ ఉండిపోయింది. అదేంటంటే సినిమాలు తగ్గుతున్న టైంలో తనకు వెన్నెముకకు కలిగిన గాయం రెండేళ్ల పాటు మంచానికి పరిమితం చేసింది. ఆ నొప్పి మాములు నరకం చూపించలేదు.

సరిగ్గా అప్పుడే కాలికి తాత్కాలిక పక్షవాతం రావడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఒకటి రెండు కాదు ఏకంగా పదమూడు సంవత్సరాల పాటు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యం ముఖ్యమనుకుని ఇంటివద్దే ఉండిపోయాడు. తనకు లైఫ్ ఇచ్చిన మణిరత్నమే కడలి కోసం పిలిచే దాకా మేకప్ వేసుకోలేదు.

ఆ మూవీ డిజాస్టర్ అయినా అరవింద్ స్వామి మళ్ళీ వచ్చాడనే సందేశం దర్శక నిర్మాతలకు తీసుకెళ్లింది. వాటిలో భాగంగా వచ్చిందే తని ఒరువన్. తెలుగులో రీమేక్ అనుకున్నప్పుడు విలన్ పాత్రని డాక్టర్ రాజశేఖర్ ఏరికోరి చేయాలనుకుంటే ఒరిజినల్ వెర్షన్ ఫీల్ మిస్సవుతుందని భావించి రామ్ చరణ్ తో తలపడేందుకు అరవింద్ స్వామినే ఒప్పించి తీసుకొచ్చారు. ఆ మధ్య నాగ చైతన్య కస్టడీలో నటించాడు కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఇప్పుడు సత్యం సుందరం మళ్ళీ ఇంకో బ్రేక్ ఇచ్చింది. టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ కోలీవుడ్ డిమాండ్ వల్ల ఇక్కడ సినిమాలు చేయలేకపోతున్నాడు.

This post was last modified on October 3, 2024 7:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శంకర్‌కు నష్టం.. నిర్మాతకు లాభం

ఇప్పుడు కరోనా ఊసే లేదు. జనం థియేటర్లకు రాని పరిస్థితులు లేవు. ఇలాంటి టైంలో కమల్ హాసన్, శంకర్‌ల క్రేజీ…

3 hours ago

నా భ‌వ‌నాలైనా కూల్చేయండి: రేవంత్‌కు కేపీవీ ఆఫ‌ర్‌

కేవీపీ రామ‌చంద్ర‌రావు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు. ఒక‌ప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వాన్ని దాదాపు…

6 hours ago

ప్రభాస్ పుట్టినరోజుకి ఏం ఇవ్వబోతున్నారు

ఇంకో పంతొమ్మిది రోజుల్లో అక్టోబర్ 23 డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఎలాంటి కానుకలు ఉంటాయనే దాని…

7 hours ago

నందిగం సురేష్‌కు బెయిల్‌.. ఎన్ని ష‌ర‌తులంటే!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, బాప‌ట్ల‌ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్ర‌స్తుతం గుంటూరు జైల్లో…

7 hours ago

తగ్గిపోతున్న OTT జోరు దేనికి సంకేతం

కరోనా టైంలో ఓటిటి విప్లవం జనాన్ని ఏ స్థాయిలో తన వైపు తిప్పుకుందో చూస్తున్నాం. వందల కోట్ల రూపాయలను మంచి…

9 hours ago

జ‌న‌సేన రైటిస్టు పార్టీగా మారిందా?: ష‌ర్మిల

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

9 hours ago