దర్శకుడు శంకర్ కెరీర్ లోనే అతి పెద్ద మచ్చగా నిలిచిపోయిన ఆల్ టైం డిజాస్టర్ ఇండియన్ 2 తర్వాత దాని సీక్వెల్ కోసం ఎవరూ ఎదురు చూడటం లేదన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ లో విపరీతంగా నష్టపోయిన లైకా సంస్థ ఈ కారణంగానే వేట్టయన్ ని డిమాండ్ కన్నా తక్కువ రేట్ కి ఇచ్చుకోవాల్సి వచ్చిందట. 1996లో రిలీజైన మొదటి భాగం ఎంత బ్లాక్ బస్టర్ అయినా దాని మీద ఇప్పటి జనరేషన్ కి ఎంత మాత్రం ఆసక్తి లేదని ఓపెనింగ్స్ లోనే అర్థమైపోయింది. అనవసరంగా రిస్క్ చేసి వందల కోట్ల బడ్జెట్ పెట్టడంతో పాటు నాసిరకం కథాకథనాలు భారతీయుడు బ్రాండ్ ని దెబ్బ తీశాయి.
తాజాగా వినిపిస్తున్న షాక్ ఏంటంటే ఇండియన్ 3ని నేరుగా ఓటిటిలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే దిశగా లైకా మేకర్స్ ఆలోచన చేస్తున్నట్టు చెన్నై టాక్. అధికారికంగా చెప్పలేదు కానీ ఈ వార్త కోలీవుడ్ మీడియాలో జోరుగా తిరుగుతోంది.
ఎందుకంటే కమల్ హాసన్ మణిరత్నంతో చేసిన తగ్ లైఫ్ 2025 వేసవిలో రిలీజ్ చేయబోతున్నారు. దానికన్నా ముందు ఇండియన్ 3 వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ తర్వాత ప్లాన్ చేద్దామా అంటే బడ్జెట్ మీద వడ్డీలు పెరిగిపోవడంతో పాటు ఓటిటితో చేసుకున్న ఒప్పందం ఇబ్బంది పెడుతుంది. అందుకే ఈ గోలంతా ఎందుకు లెమ్మని డైరెక్ట్ డిజిటల్ అనుకుని ఉండొచ్చు.
గేమ్ ఛేంజర్ ఎంత హిట్టయినా దాని ప్రభావం భారతీయుడు 3 మీద సానుకూలంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ట్రోలింగ్ కంటెంట్ గా మారిన సెకండ్ పార్ట్ మాములు నెగటివిటీ తీసుకురాలేదు. క్లైమాక్స్ విజువల్స్, కాజల్ అగర్వాల్ పాత్ర, సేనాపతి తండ్రిగా కమల్ మూడో పాత్ర, భారీ నిర్మాణం వగైరాలు థర్డ్ పార్ట్ కి సంబంధించి ఆసక్తికరంగా అనిపించాయి.
కానీ సగటు ప్రేక్షకులు మాత్రం ఇక చాలు అనుకునేలా రెండో భాగం విసుగు తెప్పించింది. అఫీషియల్ గా ప్రకటన వచ్చేదాకా ఖరారుగా చెప్పలేం కానీ ఒకవేళ నిజమైతే మాత్రం సంచలనమే అవుతుంది. ఎందుకంటే కమల్ ఇప్పటిదాకా డైరెక్ట్ ఓటిటిలో సినిమా చేయలేదు.
This post was last modified on October 3, 2024 7:22 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…