సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా వేట్టయన్ అక్టోబర్ 10 దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతోంది. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు. సూర్యతో జై భీం లాంటి క్లాసిక్ మూవీ ఇచ్చిన టీజె జ్ఞానవేల్ దీనికి దర్శకుడు. ఇవాళ ట్రైలర్ వచ్చేసింది. అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో తమిళంలో ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. తెలుగులోనూ మెల్లగా బజ్ పెరుగుతోంది. టైటిల్ మార్చకుండా యధాతథంగా దాన్నే ఉంచేయడం పట్ల బాషా ప్రేమికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక అసలు విషయానికి వస్తే వేట్టయన్ కథ గుట్టు విప్పేశారు.
అమాయకులైన ఆడపిల్ల హత్య జరిగితే దానికి కారణమైన నిందితులు దొరక్కుండా తప్పించుకుంటారు. ఎలాగైనా పట్టుకోవాలనే ఒత్తిడి ప్రభుత్వం పోలీస్ డిపార్ట్ మెంట్ మీదకు తీసుకొస్తుంది. దొరికితే ఊచలు లెక్కబెట్టించడం కాదు ఏకంగా ప్రాణాలే తీయాలనే సిద్ధాంతం వేట్టయన్ ది. దీంతో నేరస్థుల అంతు చూసేందుకు సిద్ధమవుతాడు. అయితే వాడిని పట్టుకుంటే చాలనే నిబంధనలు, కమిటీలు ఎన్ని అడ్డం వచ్చినా సరే ఆ దుర్మార్గుడి చివరి శ్వాస తీసేందుకు కంకణం కట్టుకుంటాడు. మధ్యలో వచ్చే అడ్డంకులు, ఊహించని పాత్రలు, మలుపులు వెరసి వేట్టయన్ స్టోరీగా చెబుతున్నారు.
ఇదంతా చూస్తుంటే 2019 హైదరాబాద్ లో జరిగిన దిశా సంఘటన గుర్తుకు వస్తోంది. ఒక డాక్టర్ యువతిని జాతీయ రహదారిపై అటకాయించి దారుణంగా అత్యాచారం చేయడమే కాక ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో అంతమొందించడం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. రోజుల వ్యవధిలో నగర శివార్లలో నిందితులను పట్టుకుని ఎన్కౌంటర్ చేయడం గొప్ప సెన్సేషన్. ఈ ఆపరేషన్ కి నేతృత్వం వహించిన సజ్జనార్ జనం దృష్టిలో హీరో అయిపోయారు. ఆ తర్వాత మానవ హక్కుల విచారణ, ఇన్వెస్టిగేషన్ ఇదంతా వేరే కథ. వేట్టయన్ లో ఈ దారుణానికి సంబంధించిన పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
This post was last modified on October 2, 2024 10:47 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…