కొత్త హీరోతో సినిమా చేసినప్పుడు దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టం. అందులోనూ బలమైన బ్యాక్ గ్రౌండ్ లేకపోతే పబ్లిక్ దాకా చేరడం పెద్ద సవాల్. టీవీ స్టార్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా పరిచయమవుతున్న రాంనగర్ బన్నీ ఎల్లుండి విడుదల కాబోతోంది. మొదటి నుంచి తనను తాను యాటిట్యూడ్ స్టార్ గా ప్రమోట్ చేసుకుంటున్న చంద్రహాస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాడు కానీ సగటు ప్రేక్షకుల దాకా చేరలేకపోతున్నాడు. టీవీ సీరియల్స్ విపరీతంగా చూసే మహిళలు కొత్త సినిమాల గురించి అంత ఎక్కువ పట్టించుకోరు. ఈ అంశం సన్నాఫ్ ప్రభాకర్ మీద ప్రభావం చూపిస్తోంది.
అందుకే వీలైనంత హైలైట్ అయ్యేందుకు ఏం చేయాలో అంతా చేస్తున్నాడు చంద్రహాస్. ప్రీ రిలీజ్ ఈవెంట్ కొచ్చిన రామ్ గోపాల్ వర్మ ముందు తన యాటిట్యూడ్ ని ప్రదర్శించాడు. పలు ఇంటర్వ్యూలలో పెద్ద హీరోల అభిమానులను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా ఎవరికైనా సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వాపస్ చేస్తానని, ఇన్స్ టాలో టికెట్ కొన్నట్టు ఆధారం, థియేటర్ ఫోటో పెడితే గూగుల్ పే చేస్తానని శపథం చేశాడు. గతంలో ఇలాంటి హామీలు బోలెడంత మంది ఇచ్చారు కానీ నిజంగా అమలు చేసిన వాళ్ళు లేరు. చంద్రహాస్ ఏం చేస్తాడో.
ఇవన్నీ ఎలా ఉన్నా చివరిగా మాట్లాడాల్సింది కంటెంట్. దేవర సునామి రెండో వారంలోనూ కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీవిష్ణు స్వాగ్ లాంటి క్రేజీ పోటీని తట్టుకుని నిలవడం రాంనగర్ బన్నీకి అంత సులభం కాదు. ఏదో అల్లు అర్జున్ పేరుని టైటిల్ గా వాడుకున్నంత మాత్రాన జనాలు వచ్చేయరు. ఒకప్పుడు పెద్ద సినిమాలకు పని చేసిన రచయిత వెలిగొండ శ్రీనివాస్ ఇప్పుడు శ్రీనివాస్ మహత్ గా పేరు మార్చుకుని రాంనగర్ బన్నీతో దర్శకుడిగా మరోసారి లక్కును పరీక్షించుకుంటున్నాడు. డైరెక్టర్ గా గతంలో చేసినవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. మరి చంద్రహాస్ డెబ్యూతో ఋజువు చేసుకుంటాడేమో చూడాలి.
This post was last modified on October 2, 2024 10:36 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…