ఐదుకు ఐదు సినిమాలతోనూ సక్సెస్లు కొట్టి చాలా తక్కువ సమయంలోనే టాప్ డైరెక్టర్ల లీగ్లోకి చేరాడు అనిల్ రావిపూడి. ఐదో సినిమాకే అతను సూపర్ స్టార్ మహేష్ బాబుతో జట్టు కట్టాడు. అంచనాలకు తగ్గని రీతిలో బ్లాక్ బస్టర్ అందించాడు. మహేష్తో సినిమా చేశాక అంతకంటే ఎక్కడానికి ఏం మెట్లు ఉంటాయి అనుకుంటాం?
కానీ ప్రస్తుతం మహేష్ మార్కెట్లో మూడో వంతు కూడా లేని నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలన్న ఆశతో అనిల్ ఉండటం విశేషం. సరిలేరు.. రిలీజ్ టైంలో ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను సినిమా చేయాలనుకునే హీరోల్లో బాలయ్య ఒకడని.. ఆయనతో సినిమా చేయడానికి ఇంతకుముందు చేసిన ప్రయత్నాలు కొన్ని కారణాల వల్ల ఫలించలేదని.. భవిష్యత్తులో కచ్చితంగా సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు అనిల్.
ఐతే ఇంతకుముందు అనిల్ తనతో రామారావు అనే సినిమా చేయడానికి ప్రయత్నిస్తే బాలయ్య ఓకే చేయలేదు. అతడికి అవకాశమివ్వలేదు. కానీ ఇప్పుడు బాలయ్య ఆలోచన మారిందని.. అనిల్తో పని చేయడానికి తనే రాయబారం పంపాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా షూటింగుకి బ్రేక్ పడింది. మళ్లీ పని మొదలైతే ఇంకో మూడు నెలల్లో సినిమా పూర్తి కావచ్చు. ఆ తర్వాత ఏ సినిమా చేయాలనే విషయంలో బాలయ్యకు క్లారిటీ లేదు. పూరి జగన్నాథ్తో సినిమా అంటున్నారు కానీ.. పక్కా ఏమీ కాదు.
ఐతే ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా దూరమైపోయిన నేపథ్యంలో అనిల్తో ఓ ఎంటర్టైనర్ చేస్తే బాగుంటుందని బాలయ్య భావిస్తున్నాడని.. ఇద్దరి మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని.. ఎఫ్-3 తర్వాత అనిల్ బాలయ్యతోనే సినిమా చేయొచ్చని అంటున్నారు.
This post was last modified on April 28, 2020 12:13 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…