సినిమా రంగంలో సక్సెస్ రేట్ ఎప్పుడూ తక్కువే. ఏడాది మొత్తం రిలీజయ్యే సినిమాలు.. వాటి ఫలితాలను లెక్కగట్టి చూస్తే విజయవంతమైన చిత్రాలు పది శాతానికి మించవు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాలు లేక, రిలీజైన వాటిలో కూడా ఆడినవి తక్కువ కావడంతో తొలి ఆరు నెలలు నిరాశాజనకంగా గడిచాయి.
‘హనుమాన్’, ‘డీజే టిల్లు’ మినహాయిస్తే థియేటర్లను కళకళలాడించిన సినిమాలు లేవు. ద్వితీయార్దంలో ‘కల్కి’ మూవీ గొప్ప ఉపశమనాన్ని అందించింది. దాని తర్వాత తరచుగా ఓ చిన్న సినిమా థియేటర్లలో సందడిని తీసుకొస్తోంది. ఆగస్టు 9న వచ్చిన ‘కమిటీ కుర్రాళ్ళు’ మంచి ఫలితాన్నందుకుంది. ఆగస్టు 15న విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ నిరాశ పరిచినా.. అదే వీకెండ్లో రిలీజైన ‘ఆయ్’ మూవీ సూపర్ హిట్ అయింది.
ఇక ఆగస్టు నెలాఖర్లో నాని మూవీ ‘సరిపోదా శనివారం’ వర్షాల దెబ్బను కూడా తట్టుకుని మంచి వసూళ్లు రాబట్టింది. తర్వాతి వారం ఓ మంచి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే.. 35: చిన్న కథ కాదు. దీని స్థాయిలో ఇది థియేటర్లలో బాగానే ఆడింది.
ఆ తర్వాతి వారానికి ‘మత్తు వదలరా-2’ బాక్సాఫీస్ను ఆదుకుంది. కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమాలో సత్య కామెడీ బాగా వర్కవుట్ కావడంతో మంచి వసూళ్లు వచ్చాయి. రెండో వీకెండ్లో కూడా ఈ సినిమా అదరగొట్టింది.
మధ్యలో చిన్న గ్యాప్ తర్వాత సెప్టెంబరు నెలాఖర్లో ‘దేవర’ హంగామా మొదలైంది. ట్రైలర్ చూసి ఈ సినిమా ఫలితం మీద సందేహాలు వ్యక్తం చేశారు కానీ.. ఆ నెగెటివిటీని సినిమా బాగానే తట్టుకుంది. టాక్ అంత గొప్పగా లేకపోయినా మంచి వసూళ్లు రాబట్టింది తొలి వారంలో.
ఇప్పుడు దసరా సెలవుల అడ్వాంటేజీతో రన్ను కొసాగిస్తోంది. ఈ వారం రాబోతున్న ‘శ్వాగ్’ ఆశాజనకంగా కనిపిస్తోంది. తర్వాత దసరా సినిమాల సందడి మొదలవుతుంది. మొత్తంగా ప్రస్తుతం సినిమాల సక్సెస్ రేట్ పెరిగి నిలకడగా హిట్లు పడుతుండడంతో థియేటర్ల పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది.
This post was last modified on October 2, 2024 4:23 pm
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…