Movie News

‘ఆగడు’ విషయంలో తప్పెక్కడ జరిగింది?

మహేష్ బాబు కెరీర్లో భారీ అంచనాల మధ్య విడుదలైన దారుణమైన ఫలితాన్ని అందుకున్న చిత్రాల్లో ‘ఆగడు’ ఒకటి. ‘దూకుడు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీను వైట్లతో మహేష్ బాబు చేసిన సినిమా కావడంతో దీనికి మామూలు హైప్ రాలేదు. కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది.

మహేష్‌కు ‘దూకుడు’ లాంటి మెమొరబుల్ మూవీ ఇచ్చిన ఇచ్చిన దర్శకుడే ‘ఆగడు’ లాంటి మరిచిపోదగ్గ సినిమాను ఇవ్వడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఈ సినిమా దగ్గర్నుంచే శ్రీను వైట్ల కెరీర్ కూడా తిరగబడింది.

‘ఆగడు’ సినిమా చేయడం మిస్టేక్ అని మహేష్ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. ఐతే ఇప్పుడు వైట్ల కూడా ఆ సినిమా విషయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తన కొత్త చిత్రం ‘విశ్వం’ దసరా కానుకగా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ‘ఆగడు’ను అతి పెద్ద ‘రిగ్రెట్’గా భావిస్తానని వైట్ల చెప్పాడు.

‘ఆగడు’కు సంబంధించి ప్రతి నిర్ణయం తాను తీసుకుందే అని.. అందుకే ఈ సినిమా విషయం లో తాను చాలా పశ్చాత్తాపం చెందుతానని వైట్ల తెలిపాడు. నిజానికి ఆ టైంలో మహేష్ బాబుతో చేయాలనుకున్న కథ వేరని.. కానీ దాన్ని పక్కన పెట్టి ‘ఆగడు’ చేశామని వైట్ల వెల్డడించాడు.

ఇందుకు కారణాలను కూడా ఆయన వివరించాడు. ‘‘మహేష్ బాబుతో దూకుడు తర్వాత మళ్లీ చేసే సినిమా అంటే చాలా పెద్ద స్థాయిలో ఉండాలనుకున్నాను. అందుకే ఓ పెద్ద స్పాన్ ఉన్న కథను తయారు చేశాను. అది మహేష్‌కు వినిపిస్తే చాలా ఎగ్జైట్ అయ్యాడు.

ఐతే ఆ సమయానికి ‘ఆగడు’ నిర్మాతలైన నా స్నేహితుల పరిస్థితి అంత బాగా లేదు. వాళ్లు ఆ సినిమాకు అంత భారీ ఖర్చు పెట్టే స్థితిలో లేరు. దీంతో నేనే అంత పెద్ద కథ వద్దనుకుని విలేజ్ సెటప్‌లో తక్కువ బడ్జెట్లో అయ్యే సినిమా చేద్దామనుకుని ‘ఆగడు’ ట్రై చేశాం.

కానీ అది తేడా కొట్టింది. ప్రొడక్షన్, బడ్జెట్ గురించి ఆలోచించకుండా ముందు అనుకున్న కథే చేయాల్సిందనిపించింది. ఇది నేను ‘ఆగడు’ నుంచి నేర్చుకున్న పాఠం. ఐతే మహేష్‌తో అప్పుడు తీద్దామనుకుని పక్కన పెట్టిన కథ ఇప్పుడు చేయడం కుదరదు. అది అప్పుడే చేసి ఉండాల్సిన కథ’’ అని వైట్ల తెలిపాడు.

This post was last modified on October 2, 2024 12:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

3 minutes ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

4 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

6 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

11 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

12 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

12 hours ago