తమిళ కథానాయకుల మీద తెలుగు ప్రేక్షకులు చూపించే అభిమానం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిన్నటితరం లెజెండ్స్ రజినీకాంత్, కమల్ హాసన్లను తెలుగు టాప్ స్టార్లతో సమానంగా ట్రీట్ చేశారు. వారి చిత్రాలకు అద్భుతమైన ఫలితాలను అందించారు. వారి తర్వాత సూర్య, కార్తి, ధనుష్, విజయ్.. ఇలా చాలామంది తమిళ స్టార్లను తెలుగు ప్రేక్షకులను నెత్తిన పెట్టుకున్నారు. వీళ్లందరిలో కార్తి చాలా ప్రత్యేకం అని చెప్పాలి.
సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ఏ రోజూ అన్న ఛాయల్లో ఉండకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఆవారా’ సినిమాతో అతడికి తెలుగులో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ‘యుగానికి ఒక్కడు’ కూడా అప్పట్లో తెలుగులో చాలా బాగా ఆడింది.
ఐతే అనుకోకుండా వచ్చిన ఫాలోయింగ్ను మరింత పెంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడానికి కార్తి పెట్టిన ఎఫర్ట్ అభినందనీయం. కొత్త తరం హీరోల్లో కార్తి అంత బాగా తెలుగులో ఇంకెవ్వరూ మాట్లాడలేరు. ఈ విషయంలో సూర్య కూడా వెనుకబడిపోయాడు.
తెలుగు మీద బాగా పట్టు సాధించి తన ప్రతి చిత్రానికీ అతను తెలుగులోనే డబ్బింగ్ చెబుతున్నాడు. గతంలో కొంత తమిళ వాసన గుప్పుమనేది కానీ.. ఈ మధ్య తన తెలుగు స్పష్టంగా ఉంటోంది. వేరే భాషకు చెందిన హీరో అనే ఫీలింగ్ కలగట్లేదు. కార్తి కొత్త చిత్రం ‘సత్యం సుందరం’లో పాత్రకు తగ్గట్లు గడుసుదనం, అమాయకత్వం చూపిస్తూ ఒక డిఫరెంట్ డిక్షన్తో డైలాగులు చెప్పాడు కార్తి.
సినిమా చూసిన వాళ్లందరూ అతను డబ్బింగ్ మీద పెట్టిన శ్రద్ధను గుర్తిస్తున్నారు. అలాగే సినిమాలో తెలుగు పేర్లు, బోర్డులే ఉండేలా.. తెలుగు ప్రాంతాలు కనిపించేలా పెట్టిన ఎఫర్ట్ కూడా అభినందనీయం. ఇక ‘సత్యం సుందరం’ సినిమాను రిలీజ్కు ముందు, తర్వాత ప్రమోట్ చేస్తున్న తీరు కూడా తెలుగు ప్రేక్షకుల పట్ల అతను చూపించే శ్రద్ధకు నిదర్శనం. అందుకే కార్తి మీద తెలుగు ప్రేక్షకుల ప్రేమ కూడా ప్రత్యేకమైంది. ‘సత్యం సుందరం’ సినిమాకు ఇక్కడ మంచి స్పందనే వస్తోంది.
This post was last modified on October 2, 2024 12:14 pm
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…
సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ కొట్టాక ఏడాదిన్నరగా వెంకటేష్ ని సోలో హీరోగా దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న…