తమిళ కథానాయకుల మీద తెలుగు ప్రేక్షకులు చూపించే అభిమానం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిన్నటితరం లెజెండ్స్ రజినీకాంత్, కమల్ హాసన్లను తెలుగు టాప్ స్టార్లతో సమానంగా ట్రీట్ చేశారు. వారి చిత్రాలకు అద్భుతమైన ఫలితాలను అందించారు. వారి తర్వాత సూర్య, కార్తి, ధనుష్, విజయ్.. ఇలా చాలామంది తమిళ స్టార్లను తెలుగు ప్రేక్షకులను నెత్తిన పెట్టుకున్నారు. వీళ్లందరిలో కార్తి చాలా ప్రత్యేకం అని చెప్పాలి.
సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ఏ రోజూ అన్న ఛాయల్లో ఉండకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఆవారా’ సినిమాతో అతడికి తెలుగులో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ‘యుగానికి ఒక్కడు’ కూడా అప్పట్లో తెలుగులో చాలా బాగా ఆడింది.
ఐతే అనుకోకుండా వచ్చిన ఫాలోయింగ్ను మరింత పెంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడానికి కార్తి పెట్టిన ఎఫర్ట్ అభినందనీయం. కొత్త తరం హీరోల్లో కార్తి అంత బాగా తెలుగులో ఇంకెవ్వరూ మాట్లాడలేరు. ఈ విషయంలో సూర్య కూడా వెనుకబడిపోయాడు.
తెలుగు మీద బాగా పట్టు సాధించి తన ప్రతి చిత్రానికీ అతను తెలుగులోనే డబ్బింగ్ చెబుతున్నాడు. గతంలో కొంత తమిళ వాసన గుప్పుమనేది కానీ.. ఈ మధ్య తన తెలుగు స్పష్టంగా ఉంటోంది. వేరే భాషకు చెందిన హీరో అనే ఫీలింగ్ కలగట్లేదు. కార్తి కొత్త చిత్రం ‘సత్యం సుందరం’లో పాత్రకు తగ్గట్లు గడుసుదనం, అమాయకత్వం చూపిస్తూ ఒక డిఫరెంట్ డిక్షన్తో డైలాగులు చెప్పాడు కార్తి.
సినిమా చూసిన వాళ్లందరూ అతను డబ్బింగ్ మీద పెట్టిన శ్రద్ధను గుర్తిస్తున్నారు. అలాగే సినిమాలో తెలుగు పేర్లు, బోర్డులే ఉండేలా.. తెలుగు ప్రాంతాలు కనిపించేలా పెట్టిన ఎఫర్ట్ కూడా అభినందనీయం. ఇక ‘సత్యం సుందరం’ సినిమాను రిలీజ్కు ముందు, తర్వాత ప్రమోట్ చేస్తున్న తీరు కూడా తెలుగు ప్రేక్షకుల పట్ల అతను చూపించే శ్రద్ధకు నిదర్శనం. అందుకే కార్తి మీద తెలుగు ప్రేక్షకుల ప్రేమ కూడా ప్రత్యేకమైంది. ‘సత్యం సుందరం’ సినిమాకు ఇక్కడ మంచి స్పందనే వస్తోంది.
This post was last modified on October 2, 2024 12:14 pm
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…