తమిళ కథానాయకుల మీద తెలుగు ప్రేక్షకులు చూపించే అభిమానం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిన్నటితరం లెజెండ్స్ రజినీకాంత్, కమల్ హాసన్లను తెలుగు టాప్ స్టార్లతో సమానంగా ట్రీట్ చేశారు. వారి చిత్రాలకు అద్భుతమైన ఫలితాలను అందించారు. వారి తర్వాత సూర్య, కార్తి, ధనుష్, విజయ్.. ఇలా చాలామంది తమిళ స్టార్లను తెలుగు ప్రేక్షకులను నెత్తిన పెట్టుకున్నారు. వీళ్లందరిలో కార్తి చాలా ప్రత్యేకం అని చెప్పాలి.
సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ఏ రోజూ అన్న ఛాయల్లో ఉండకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఆవారా’ సినిమాతో అతడికి తెలుగులో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ‘యుగానికి ఒక్కడు’ కూడా అప్పట్లో తెలుగులో చాలా బాగా ఆడింది.
ఐతే అనుకోకుండా వచ్చిన ఫాలోయింగ్ను మరింత పెంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడానికి కార్తి పెట్టిన ఎఫర్ట్ అభినందనీయం. కొత్త తరం హీరోల్లో కార్తి అంత బాగా తెలుగులో ఇంకెవ్వరూ మాట్లాడలేరు. ఈ విషయంలో సూర్య కూడా వెనుకబడిపోయాడు.
తెలుగు మీద బాగా పట్టు సాధించి తన ప్రతి చిత్రానికీ అతను తెలుగులోనే డబ్బింగ్ చెబుతున్నాడు. గతంలో కొంత తమిళ వాసన గుప్పుమనేది కానీ.. ఈ మధ్య తన తెలుగు స్పష్టంగా ఉంటోంది. వేరే భాషకు చెందిన హీరో అనే ఫీలింగ్ కలగట్లేదు. కార్తి కొత్త చిత్రం ‘సత్యం సుందరం’లో పాత్రకు తగ్గట్లు గడుసుదనం, అమాయకత్వం చూపిస్తూ ఒక డిఫరెంట్ డిక్షన్తో డైలాగులు చెప్పాడు కార్తి.
సినిమా చూసిన వాళ్లందరూ అతను డబ్బింగ్ మీద పెట్టిన శ్రద్ధను గుర్తిస్తున్నారు. అలాగే సినిమాలో తెలుగు పేర్లు, బోర్డులే ఉండేలా.. తెలుగు ప్రాంతాలు కనిపించేలా పెట్టిన ఎఫర్ట్ కూడా అభినందనీయం. ఇక ‘సత్యం సుందరం’ సినిమాను రిలీజ్కు ముందు, తర్వాత ప్రమోట్ చేస్తున్న తీరు కూడా తెలుగు ప్రేక్షకుల పట్ల అతను చూపించే శ్రద్ధకు నిదర్శనం. అందుకే కార్తి మీద తెలుగు ప్రేక్షకుల ప్రేమ కూడా ప్రత్యేకమైంది. ‘సత్యం సుందరం’ సినిమాకు ఇక్కడ మంచి స్పందనే వస్తోంది.
This post was last modified on October 2, 2024 12:14 pm
ఇప్పుడు కరోనా ఊసే లేదు. జనం థియేటర్లకు రాని పరిస్థితులు లేవు. ఇలాంటి టైంలో కమల్ హాసన్, శంకర్ల క్రేజీ…
కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని దాదాపు…
ఇంకో పంతొమ్మిది రోజుల్లో అక్టోబర్ 23 డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఎలాంటి కానుకలు ఉంటాయనే దాని…
వైసీపీ కీలక నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం గుంటూరు జైల్లో…
కరోనా టైంలో ఓటిటి విప్లవం జనాన్ని ఏ స్థాయిలో తన వైపు తిప్పుకుందో చూస్తున్నాం. వందల కోట్ల రూపాయలను మంచి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు…