జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ‘దేవర’ సినిమా ఎట్టకేలకు గత శుక్రవారం రిలీజైపోయింది. ట్రైలర్ చూశాక సినిమా ఫలితం మీద చాలా సందేహాలు కలిగాయి కానీ.. ఉన్నంతలో ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితమే సాధించేలా ఉంది. సినిమాకు గొప్ప టాక్ రాలేదు.
అదే సమయంలో బాలేదు అనే టాక్ కూడా వినిపించలేదు. రిలీజ్కు ముందు ఉన్న హైప్, బాక్సాఫీస్ దగ్గర అనుకూల పరిస్థితులు కలిసొచ్చి ఈ చిత్రం వీకెండ్లో భారీ వసూళ్లు రాబట్టింది. వీకెండ్ అయ్యాక వసూళ్లు కొంచెం ఎక్కువగానే డ్రాప్ అయినప్పటికీ.. గాంధీ జయంతి, దసరా సెలవులు కలిసి రానుండడంతో బాక్సాఫీస్ గండాన్ని గట్టెక్కేస్తుందనే అనుకుంటున్నారు.
సినిమా బ్రేక్ ఈవెన్ కావచ్చు. లేదా బయ్యర్లు స్వల్ప నష్టాలతో బయటపడవచ్చు. మొత్తానికి ‘దేవర’ రిలీజైంది. సానుకూల ఫలితాన్నే అందుకుంటోంది. మరి ‘దేవర-2’ సంగతేంటి? అదెప్పుడు వస్తుంది? అసలు వస్తుందా రాదా అనే చర్చ జరుగుతోందిప్పుడు.
ఏదైనా సినిమాను రెండు భాగాలుగా తీయాలి అనుకున్నపుడు కొందరు రెండో పార్ట్ కూడా కొంత చిత్రీకరణ చేస్తారు. కొందరు తర్వాత చూసుకుందాం అనుకుంటారు. కొందరేమో ముందే రెండో భాగం కూడా తీసేస్తారు. ‘దేవర’ విషయంలో రెండో భాగం చిత్రీకరణ మొదలే కాలేదని సమాచారం.
పార్ట్-1 కోసం తీసిన సన్నివేశాలనే కొంత ఎడిట్ చేసి రెండో భాగం పెట్టుకున్నారట కానీ.. కొత్తగా ఇంకో సినిమా తీసినట్లే అన్నీ చేసుకోవాల్సి ఉంది. ఐతే తారక్ ప్రస్తుతం వార్-2, ప్రశాంత్ నీల్ చిత్రాలు చేయాల్సి ఉంది. ‘వార్-2’ ఆల్రెడీ కొంత చిత్రీకరణ జరుపుకుంది. నీల్ మూవీ త్వరలోనే మొదలవుతుంది.
ఇవి కాకుండా ‘దేవర-2’కు డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ‘దేవర-1’ రిలీజ్ తర్వాత రిజల్ట్ సహా అన్నీ చూసుకునే పార్ట్-2 చేయాలని టీం భావించింది. రిజల్ట్ తేడా కొడితే రెండో భాగం ఆపేసేవారేమో. కానీ ఇప్పుడు పార్ట్-2 చేయడానికి తగ్గ ఫలితమే వచ్చేలా ఉంది. తారక్ ఖాళీ లేడు కాబట్టి మధ్యలో కొరటాల వేరే సినిమా ఒకటి చేసి.. 2026లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టే అవకాశముంది. 2027 లేదా 2028లో ఈ చిత్రం విడుదల కావచ్చు.
This post was last modified on October 2, 2024 12:13 pm
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…