ఇటు హీరో గోపీచంద్కు.. అటు దర్శకుడు శ్రీను వైట్లకు కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. విశ్వం. ఎప్పుడో పదేళ్ల కిందట ‘లౌక్యం’తో సక్సెస్ అందుకున్నాడు గోపీచంద్. తర్వాత తన ప్రతి చిత్రం నిరాశనే మిగిల్చింది. ‘సీటీమార్’ ఒక్కటి ఓ మోస్తరుగా ఆడింది తప్ప.. మిగతావన్నీ డిజాస్టర్లే.
ఇక వైట్ల సంగతి చెప్పాల్సిన పని లేదు. ‘బాద్షా’ యావరేజ్గా ఆడాక అన్నీ డిజాస్టర్లే ఇచ్చాడు. కెరీర్లో చాలా ఏళ్లు గ్యాప్ వచ్చింది. ఎంతో కష్టపడి ‘విశ్వం’ మూవీని లైన్లో పెట్టాడు. షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 11న రిలీజ్ చేస్తున్నట్లు కొన్ని వారాల కిందట ప్రకటించారు. కానీ ఆ అప్డేట్ తర్వాత టీం నుంచి సౌండ్ లేదు. దసరాకు ఫిక్సయిన డబ్బింగ్ మూవీ ‘వేట్టయాన్’తో పాటు స్ట్రెయిట్ మూవీస్ మా నాన్న సూపర్ హీరో, జనక అయితే గనక వాటి స్థాయిలో అవి ప్రమోషన్లు చేసుకుంటున్నాయి. కానీ ‘విశ్వం’ నుంచే సౌండ్ లేదు.
అసలే ఫ్లాప్ల మీద ఉన్న హీరో, డైరెక్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా. బజ్ తక్కువగా ఉంది. అలాంటపుడ పబ్లిసిటీ కొంచెం గట్టిగా చేసి.. ఆసక్తికర ప్రోమోలు రిలీజ్ చేసి బజ్ పెంచే ప్రయత్నం చేయాలి. కానీ టీం మాత్రం సైలెంటుగా ఉంటోంది. ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండి ప్రమోషన్ పట్టించుకోవట్లేదా.. లేక దసరాకు తమ చిత్రాన్ని రిలీజ్ చేసే ఉద్దేశం లేదా అన్నది ఇప్పుడు సందేహంగా మారింది.
దసరాకు రావట్లేదంటే ఆ టైంలో పోటీ ఎక్కువ అని అయినా అనుకుని ఉండాలి లేదా సినిమాను అప్పటికి రెడీ చేయలేక వెనక్కి తగ్గుతుండాలి. మరి ప్రస్తుత సైలెన్స్కు కారణమేంటో చూడాలి. దసరాకు వచ్చేట్లయితే మాత్రం వీలైనంత త్వరగా ప్రమోషన్ మొదలుపెట్టాల్సిందే. ఇంకో రెండు మూడు రోజులు ఇదే సైలెన్స్ కొనసాగితే ‘విశ్వం’ దసరా రేసు నుంచి తప్పుకున్నట్లు భావించాలి. అదే జరిగితే టాలీవుడ్ దసరా మరింతగా కళ తప్పబోతున్నట్లే.
This post was last modified on October 1, 2024 1:26 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…