హరిహర వీరమల్లు ఏళ్ల తరబడి తీసి చివరికి దర్శకత్వ బాధ్యతను వేరొకరికి అప్పగించాల్సి వచ్చిన క్రిష్ అనుష్కతో తీస్తున్న ఘాటీని పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే తొంభై శాతం దాకా షూటింగ్ పూర్తయ్యిందంటే షాకే. త్వరలోనే చివరి షెడ్యూల్ ని ఒడిశాలో పూర్తి చేయబోతున్నారు. దీంతో గుమ్మడికాయ కొట్టేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతం చేసి, విడుదల తేదీకి ప్రణాళిక వేసుకుంటారు. ఒకవేళ వీరమల్లు కన్నా ముందు ఇది రిలీజైనా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంత పక్కాగా ప్రణాళిక ఉంది కాబట్టే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క ఘాటీకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నిజానికి క్రిష్ స్పీడ్ గురించి తెలిసిందే. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి పీరియాడిక్ డ్రామాని భారీ బడ్జెట్ తో అతి తక్కువ టైంలో తీయడం చూసి ఆ క్వాలిటీని రాజమౌళే మెచ్చుకున్నాడు. అందుకే బాలకృష్ణ కోరిమరీ ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతను అప్పజెప్పారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఘాటీ యాక్షన్ కం రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. మాఫియా టచ్ తో అనుష్కని గతంలో ఎన్నడూ చూడని సరికొత్త పాత్రలో క్రిష్ చూపించబోతున్నాడని వినికిడి. కేవలం సబ్జెక్టు వినే సెట్స్ కు వెళ్ళడానికి ముందే అమెజాన్ ప్రైమ్ ఒప్పందం చేసుకుందంటే కంటెంట్ లో ఎంత బలముందో అర్థం చేసుకోవచ్చు.
ఆఫర్లు ఎన్ని వస్తున్నా మెల్లగా అడుగులు వేస్తున్న అనుష్క మళ్ళీ కొత్త కమిట్ మెంట్ ఎవరికీ ఇవ్వలేదు. భాగమతి 2 గురించి బయట ప్రచారం జరగడమే తప్పించి ఇంకా స్క్రిప్ట్ వగైరా లాక్ కాలేదు. సో ప్రకటన వచ్చే దాకా ఖచ్చితంగా చెప్పలేం. ఓ ప్రోగ్రాంలో తమన్ చూచాయగా చెప్పాడు తప్పించి కన్ఫర్మ్ అనలేదు. ఘాటీని వేసవిలో తీసుకొచ్చే అవకాశాలున్నాయి. తమిళ హీరో విక్రమ్ ప్రభుతో పాటు జగపతి బాబు, చైతన్యరావు, రవీంద్ర విజయ్, విటివి గణేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఘాటీ అనుష్కకి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయమనే టాక్ అంతర్గతంగా వినిపిస్తోంది. ఫ్యాన్స్ కోరుకునేది అదేగా.
This post was last modified on October 1, 2024 10:43 am
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…