‘బాహుబలి’ సాధించిన అసాధారణ విజయం చూశాక అందరికీ అలాంటి పాన్ ఇండియా సినిమాలు చేయాలని.. మార్కెట్ను విస్తరించాలని కోరిక కలిగింది. కానీ అందరికీ అది సాధ్యపడలేదు. అసలు ప్రభాస్ కూడా పాన్ ఇండియా మార్కెట్ను నిలబెట్టుకుంటాడా అన్న సందేహాలు కూడా కలిగాయి. ‘సాహో’ సినిమా నిరాశపరిచినప్పటికీ ఉత్తరాదిన మంచి వసూళ్లు రాబట్టింది. కానీ రాధేశ్యామ్ ప్రభాస్ మార్కెట్ మీద ప్రతికూల ప్రభావం చూపింది. ‘ఆదిపురుష్’ సైతం కొంత నెగెటివ్ ఎఫెక్ట్ చూపించింది. కానీ సలార్, కల్కి సినిమాలతో ప్రభాస్ తనకు తిరుగులేదని చాటుకున్నాడు.
ఇక టాలీవుడ్ టాప్ హీరోల్లో ఉత్తరాదిన మంచి మార్కెట్ సంపాదించింది అంటే.. అల్లు అర్జునే. అతడి ‘పుష్ఫ’ సినిమా నార్త్ ఇండియాలో సర్ప్రైజ్ హిట్ అయింది. ‘పుష్ప-2’ కోసం అక్కడి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ఉత్తరాదిన మంచి గుర్తింపే సంపాదించినట్లు కనిపించారు. ఐతే వాళ్ల సోలో సినిమాలు వస్తేనే మార్కెట్ ఏమేర క్రియేట్ అయింది అనేది తెలుస్తుందని అంతా భావించారు. ముందుగా తారక్ నుంచి ‘దేవర’ వచ్చింది.
ఈ సినిమాకు రిలీజ్ ముంగిట ఉత్తరాదిన పెద్దగా బజ్ కనిపించలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగానే సాగాయి. కానీ తొలి రోజు ఈ సినిమాకు హిందీలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. శని, ఆదివారాల్లో కూడా సినిమా బలంగా నిలబడింది. వీకెండ్లో రూ.30 కోట్ల గ్రాస్ సాధించి తారక్ నార్త్ స్టామినాను రుజువు చేసింది. సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని కూడా భావిస్తున్నారు. మొత్తానికి ఉత్తరాదిన తారక్ మంచి ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించాన్నది స్పష్టమైంది. హిందీలో నేరుగా ‘వార్-2’ చేస్తున్నాడు కాబట్టి తారక్ మార్కెట్ ఇంకా బలపడడం ఖాయం. అలాగే ప్రశాంత్ నీల్తో సినిమా చేస్తున్నాడు కాబట్టి అక్కడ పెద్ద స్టార్గా అవతరించే అవకాశాలున్నాయి.
This post was last modified on September 30, 2024 9:31 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…