‘బాహుబలి’ సాధించిన అసాధారణ విజయం చూశాక అందరికీ అలాంటి పాన్ ఇండియా సినిమాలు చేయాలని.. మార్కెట్ను విస్తరించాలని కోరిక కలిగింది. కానీ అందరికీ అది సాధ్యపడలేదు. అసలు ప్రభాస్ కూడా పాన్ ఇండియా మార్కెట్ను నిలబెట్టుకుంటాడా అన్న సందేహాలు కూడా కలిగాయి. ‘సాహో’ సినిమా నిరాశపరిచినప్పటికీ ఉత్తరాదిన మంచి వసూళ్లు రాబట్టింది. కానీ రాధేశ్యామ్ ప్రభాస్ మార్కెట్ మీద ప్రతికూల ప్రభావం చూపింది. ‘ఆదిపురుష్’ సైతం కొంత నెగెటివ్ ఎఫెక్ట్ చూపించింది. కానీ సలార్, కల్కి సినిమాలతో ప్రభాస్ తనకు తిరుగులేదని చాటుకున్నాడు.
ఇక టాలీవుడ్ టాప్ హీరోల్లో ఉత్తరాదిన మంచి మార్కెట్ సంపాదించింది అంటే.. అల్లు అర్జునే. అతడి ‘పుష్ఫ’ సినిమా నార్త్ ఇండియాలో సర్ప్రైజ్ హిట్ అయింది. ‘పుష్ప-2’ కోసం అక్కడి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ఉత్తరాదిన మంచి గుర్తింపే సంపాదించినట్లు కనిపించారు. ఐతే వాళ్ల సోలో సినిమాలు వస్తేనే మార్కెట్ ఏమేర క్రియేట్ అయింది అనేది తెలుస్తుందని అంతా భావించారు. ముందుగా తారక్ నుంచి ‘దేవర’ వచ్చింది.
ఈ సినిమాకు రిలీజ్ ముంగిట ఉత్తరాదిన పెద్దగా బజ్ కనిపించలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగానే సాగాయి. కానీ తొలి రోజు ఈ సినిమాకు హిందీలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. శని, ఆదివారాల్లో కూడా సినిమా బలంగా నిలబడింది. వీకెండ్లో రూ.30 కోట్ల గ్రాస్ సాధించి తారక్ నార్త్ స్టామినాను రుజువు చేసింది. సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని కూడా భావిస్తున్నారు. మొత్తానికి ఉత్తరాదిన తారక్ మంచి ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించాన్నది స్పష్టమైంది. హిందీలో నేరుగా ‘వార్-2’ చేస్తున్నాడు కాబట్టి తారక్ మార్కెట్ ఇంకా బలపడడం ఖాయం. అలాగే ప్రశాంత్ నీల్తో సినిమా చేస్తున్నాడు కాబట్టి అక్కడ పెద్ద స్టార్గా అవతరించే అవకాశాలున్నాయి.
This post was last modified on September 30, 2024 9:31 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…