‘బాహుబలి’ సాధించిన అసాధారణ విజయం చూశాక అందరికీ అలాంటి పాన్ ఇండియా సినిమాలు చేయాలని.. మార్కెట్ను విస్తరించాలని కోరిక కలిగింది. కానీ అందరికీ అది సాధ్యపడలేదు. అసలు ప్రభాస్ కూడా పాన్ ఇండియా మార్కెట్ను నిలబెట్టుకుంటాడా అన్న సందేహాలు కూడా కలిగాయి. ‘సాహో’ సినిమా నిరాశపరిచినప్పటికీ ఉత్తరాదిన మంచి వసూళ్లు రాబట్టింది. కానీ రాధేశ్యామ్ ప్రభాస్ మార్కెట్ మీద ప్రతికూల ప్రభావం చూపింది. ‘ఆదిపురుష్’ సైతం కొంత నెగెటివ్ ఎఫెక్ట్ చూపించింది. కానీ సలార్, కల్కి సినిమాలతో ప్రభాస్ తనకు తిరుగులేదని చాటుకున్నాడు.
ఇక టాలీవుడ్ టాప్ హీరోల్లో ఉత్తరాదిన మంచి మార్కెట్ సంపాదించింది అంటే.. అల్లు అర్జునే. అతడి ‘పుష్ఫ’ సినిమా నార్త్ ఇండియాలో సర్ప్రైజ్ హిట్ అయింది. ‘పుష్ప-2’ కోసం అక్కడి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ఉత్తరాదిన మంచి గుర్తింపే సంపాదించినట్లు కనిపించారు. ఐతే వాళ్ల సోలో సినిమాలు వస్తేనే మార్కెట్ ఏమేర క్రియేట్ అయింది అనేది తెలుస్తుందని అంతా భావించారు. ముందుగా తారక్ నుంచి ‘దేవర’ వచ్చింది.
ఈ సినిమాకు రిలీజ్ ముంగిట ఉత్తరాదిన పెద్దగా బజ్ కనిపించలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగానే సాగాయి. కానీ తొలి రోజు ఈ సినిమాకు హిందీలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. శని, ఆదివారాల్లో కూడా సినిమా బలంగా నిలబడింది. వీకెండ్లో రూ.30 కోట్ల గ్రాస్ సాధించి తారక్ నార్త్ స్టామినాను రుజువు చేసింది. సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని కూడా భావిస్తున్నారు. మొత్తానికి ఉత్తరాదిన తారక్ మంచి ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించాన్నది స్పష్టమైంది. హిందీలో నేరుగా ‘వార్-2’ చేస్తున్నాడు కాబట్టి తారక్ మార్కెట్ ఇంకా బలపడడం ఖాయం. అలాగే ప్రశాంత్ నీల్తో సినిమా చేస్తున్నాడు కాబట్టి అక్కడ పెద్ద స్టార్గా అవతరించే అవకాశాలున్నాయి.
This post was last modified on September 30, 2024 9:31 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…