టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోల ప్యాన్ ఇండియా సినిమాలకు విడుదల తేదీ సెట్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారింది. నాగ చైతన్య తండేల్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతూ కొలిక్కి వస్తోంది. ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని మీద తర్జన భర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20 లేదా 25 ఫిక్సవుతోంది కాబట్టి ఆ వారం వదిలేయాల్సిందే. దానికన్నా ముందు ఆరున పుష్ప 2 ఉంటుంది కనక ఆ ఛాన్స్ లేదు. అక్కినేని అభిమానులు ఎలాగూ నాగార్జున పండగ సినిమా లేదు కాబట్టి సంక్రాంతికి తండేల్ ని వదలమని డిమాండ్ చేస్తున్నారు. విశ్వంభరతో తలపడేందుకు అల్లు అరవింద్ ఇష్టపడరు.
ఇక మంచు విష్ణు కన్నప్పది ఇదే సమస్య. ఆ మధ్య పోస్టర్ లో డిసెంబర్ రిలీజన్నారు కానీ డేట్ సంగతి తేల్చలేకపోయారు. అచ్చం చైతు టీమ్ తరహాలోనే వీళ్లూ ఆలోచిస్తున్నారు. దాని వల్లే పూర్తి స్థాయి ప్రమోషన్లు ఇంకా మొదలుకాలేదు. సోలో రిలీజ్ చేసుకుంటే ఎక్కువ రీచ్ ఉంటుందనేది మంచు బృందం ఆలోచన. భక్తి పూర్వక చిత్రం కాబట్టి కమర్షియల్ సినిమాలతో పోటీ పడటం అనవసరమైన రిస్కవుతుంది. అందుకే పుష్ప, గేమ్ ఛేంజర్ ఎవరూ తప్పుకున్నా ఆ స్లాట్ లో రావాలనేది కన్నప్ప ప్లాన్. కానీ ఎవరికి వారు ధీమాగా వాయిదా ప్రసక్తే లేదన్న తరహాలో పలు పబ్లిసిటీ చేసుకుంటున్నారు.
ఈ సస్పెన్స్ అంతా డిసెంబర్, జనవరి మధ్యే తిరుగుతోంది. తండేల్ నిర్మాత బన్నీ వాస్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ సినిమాని ఎక్కువ కాలం హోల్డ్ చేసి పెట్టలేమని తేల్చి చెప్పారు. ఓటిటితో చేసుకున్న ఒప్పందం కూడా కారణం కావొచ్చు. అందుకే ఇవాళ నుంచి పబ్లిసిటీ ప్లాన్ మొదలుపెట్టారు. నాగచైతన్య, సాయిపల్లవి మీద షూట్ చేసిన శివుడి జాతర పాట తాలూకు స్టిల్స్ ని ఫ్యాన్స్ కోసం వదిలారు. ఇక క్రమం తప్పకుండా కన్నప్ప లో నటిస్తున్న క్యారెక్టర్ల పరిచయం జరుగుతోంది కానీ రిలీజ్ మ్యాటర్ తేలడం లేదు. మంచు విష్ణు మాత్రం తొందరపడే ఉద్దేశంతో ఎంత మాత్రం లేడు.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…