టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోల ప్యాన్ ఇండియా సినిమాలకు విడుదల తేదీ సెట్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారింది. నాగ చైతన్య తండేల్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతూ కొలిక్కి వస్తోంది. ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని మీద తర్జన భర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20 లేదా 25 ఫిక్సవుతోంది కాబట్టి ఆ వారం వదిలేయాల్సిందే. దానికన్నా ముందు ఆరున పుష్ప 2 ఉంటుంది కనక ఆ ఛాన్స్ లేదు. అక్కినేని అభిమానులు ఎలాగూ నాగార్జున పండగ సినిమా లేదు కాబట్టి సంక్రాంతికి తండేల్ ని వదలమని డిమాండ్ చేస్తున్నారు. విశ్వంభరతో తలపడేందుకు అల్లు అరవింద్ ఇష్టపడరు.
ఇక మంచు విష్ణు కన్నప్పది ఇదే సమస్య. ఆ మధ్య పోస్టర్ లో డిసెంబర్ రిలీజన్నారు కానీ డేట్ సంగతి తేల్చలేకపోయారు. అచ్చం చైతు టీమ్ తరహాలోనే వీళ్లూ ఆలోచిస్తున్నారు. దాని వల్లే పూర్తి స్థాయి ప్రమోషన్లు ఇంకా మొదలుకాలేదు. సోలో రిలీజ్ చేసుకుంటే ఎక్కువ రీచ్ ఉంటుందనేది మంచు బృందం ఆలోచన. భక్తి పూర్వక చిత్రం కాబట్టి కమర్షియల్ సినిమాలతో పోటీ పడటం అనవసరమైన రిస్కవుతుంది. అందుకే పుష్ప, గేమ్ ఛేంజర్ ఎవరూ తప్పుకున్నా ఆ స్లాట్ లో రావాలనేది కన్నప్ప ప్లాన్. కానీ ఎవరికి వారు ధీమాగా వాయిదా ప్రసక్తే లేదన్న తరహాలో పలు పబ్లిసిటీ చేసుకుంటున్నారు.
ఈ సస్పెన్స్ అంతా డిసెంబర్, జనవరి మధ్యే తిరుగుతోంది. తండేల్ నిర్మాత బన్నీ వాస్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ సినిమాని ఎక్కువ కాలం హోల్డ్ చేసి పెట్టలేమని తేల్చి చెప్పారు. ఓటిటితో చేసుకున్న ఒప్పందం కూడా కారణం కావొచ్చు. అందుకే ఇవాళ నుంచి పబ్లిసిటీ ప్లాన్ మొదలుపెట్టారు. నాగచైతన్య, సాయిపల్లవి మీద షూట్ చేసిన శివుడి జాతర పాట తాలూకు స్టిల్స్ ని ఫ్యాన్స్ కోసం వదిలారు. ఇక క్రమం తప్పకుండా కన్నప్ప లో నటిస్తున్న క్యారెక్టర్ల పరిచయం జరుగుతోంది కానీ రిలీజ్ మ్యాటర్ తేలడం లేదు. మంచు విష్ణు మాత్రం తొందరపడే ఉద్దేశంతో ఎంత మాత్రం లేడు.
This post was last modified on September 30, 2024 3:35 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…