దేవర కన్నా ఒక రోజు ఆలస్యంగా విడుదలైన సత్యం సుందరంకు తెలుగులోనూ మంచి పబ్లిక్ టాక్ వచ్చింది. రివ్యూలలో అరుదుగా వచ్చే త్రీ రేటింగ్ సైతం దక్కిందంటే కంటెంట్ ఎంతగా కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అయితే దేవర హోరులో కార్తీ, అరవింద్ స్వామిలు చేస్తున్న సౌండ్ జనాలకు పెద్దగా వినిపించడం లేదు. పంపిణి చేసింది సురేష్ ఏషియన్ సంస్థలే అయినప్పటికీ హైదరాబాద్ లో మంచి రిలీజ్ వచ్చేలా చేసుకున్నారు కానీ చాలా బిసి సెంటర్లలో ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్క్రీన్లే దక్కలేదు. చిన్న కేంద్రాల్లో అసలు రిలీజే కాలేదు. దీంతో ఆడియన్స్ కి దేవర తప్ప మరో ఆప్షన్ కనిపించకుండా పోయింది.
ఇద్దరు వ్యక్తుల మధ్య ఎమోషన్స్ ని హైలైట్ చేస్తూ మూడు గంటల సేపు దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సత్యం సుందరంని నడిపించిన తీరు ఫ్యామిలీ జనాలను బాగా ఆకట్టుకుంటోంది. ఇంత లెన్త్ ఉన్నప్పుడు సహజంగా వచ్చే ల్యాగ్ ఇందులోనూ వచ్చింది కానీ ఫైనల్ గా బయటికి వచ్చేటప్పుడు ఒక మంచి ఫీల్ ఇవ్వడంలో ఫెయిల్ కాలేదు. ముఖ్యంగా కార్తీ పెర్ఫార్మన్స్ అదిరిపోయింది. అవతలివాడు ఏమనుకుంటున్నాడు అనేది పట్టించుకోకుండా గలగలా మాట్లాడే పాత్రలో మాములుగా జీవించలేదు. ఒకపక్క నవ్విస్తూనే ఇంకోవైపు ఎమోషన్లతో ఆడుకుంటూ గుండెలు పిండేలా చేయడం తనకు మాత్రమే చెల్లింది.
పికప్ ఉన్నప్పటికీ ఇంకా మెరుగ్గా ఉండాల్సిన మాట వాస్తవం. సెప్టెంబర్ 28 కాకుండా ఒక వారం ఆలస్యంగా సత్యం సుందరం వచ్చి ఉంటే బాగుండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తమిళ వెర్షన్ ముందే వచ్చినా ఇబ్బంది ఉండేది కాదని అంటున్నారు. గతంలో కాంతార కన్నడలో రిలీజైన రెండు వారాల తర్వాత తెలుగు డబ్బింగ్ తీసుకొచ్చారు. రెస్పాన్స్ లో ఏం తేడా రాలేదు. కలెక్షన్లు హోరెత్తిపోయాయి. సత్యం సుందరంకు అదే స్థాయిలో కాకపోయినా ఇప్పుడున్న దానికన్నా పరిస్థితి బెటర్ గా ఉండేది. అక్టోబర్ 4 శ్రీవిష్ణు స్వాగ్ తప్ప వేరే కొత్త సినిమాలు లేవన్న సంగతిని గుర్తు పెట్టుకోవాల్సింది.
This post was last modified on September 30, 2024 10:10 am
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…