మొదటి వీకెండ్ ని దేవర బ్రహ్మాండంగా ముగించాడు. దాదాపు అన్ని చోట్ల భారీ కలెక్షన్లతో థియేటర్లు కళకళలాడేలా చేశాడు. రెండు ప్రభుత్వాలు భారీ టికెట్ రేట్ల పెంపుకి అనుమతినివ్వడం పెద్ద నెంబర్లు వచ్చేలా చేసింది. ఎంత జూనియర్ ఎన్టీఆర్ హీరో అయినా అంత ధరని ఒప్పుకుని ప్రేక్షకులు సినిమా చూశారంటే కంటెంట్ గురించి చెప్పుకోదగ్గ టాక్ బయటికి వెళ్లడం వల్లే. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ అసలు సవాల్ ఇవాళ సోమవారం నుంచి మొదలవుతుంది. సాధారణంగా ఎంత స్టార్ హీరో అయినా సరే వీక్ డేస్ లో డ్రాప్స్ ఉంటాయి. అది ఎంత శాతం అనే దాన్ని బట్టి బ్లాక్ బస్టర్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది.
ట్రేడ్ నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారం సీడెడ్ లాంటి ప్రాంతాల్లో బలంగా ఉన్న దేవర గోదావరి జిల్లాల్లో నెమ్మదించాడు. ఇది సండే బుకింగ్స్ లోనే కనిపించడంతో సోమవారం నుంచి సాధారణ రేట్లకు టికెట్లు అమ్మాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓవర్సీస్ లో తొలి రెండు రోజులు మహా దూకుడు చూపించిన తారక్ అక్కడా స్లో అయ్యాడు. నైజామ్ సేల్స్ బాగున్నా ఇదే జోరు ఏ మేరకు కొనసాగుతుందనేది వేచి చూడాలి. ఎల్లుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలవు దినం కలెక్షన్ల పరంగా ప్లస్ కానుండగా స్కూళ్ళు, కాలేజీలకు ఈ వారం నుంచే దసరా సెలవులు రావడం చాలా పెద్ద ప్లస్.
కల్కి 2898 ఏడిని చూసుకుంటే పదిహేను రోజులకి పైగా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడింది. బుక్ మై షో టాప్ ట్రెండింగ్ లో దుమ్ము దులిపింది. అలాంటి మద్దతు దేవర కనక ఆడియన్స్ నుంచి అందుకుంటే రికార్డులు చెల్లాచెదురు కావడం ఖాయం. ఒకవేళ సెకండాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగా యునానిమస్ గా బాగుందనే టాక్ తెచ్చుకుని ఉంటే ఇప్పుడీ విశ్లేషణ అవసరం ఉండేది కాదు. కానీ మిక్స్డ్ టాక్ రావడం ప్రభావం చూపిస్తోంది. హైదరాబాద్ లోనే సక్సెస్ మీట్ జరగబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ పరంగా అది బూస్ట్ లాగా పని చేస్తుందని టీమ్ భావిస్తోంది. చూడాలి దేవర స్పీడ్ ఎలా ఉండబోతోందో.
This post was last modified on September 30, 2024 10:09 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…