‘దేవర’ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా సరే.. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మేకర్స్ ప్రకటించిన దాని ప్రకారం తొలి రోజు ఈ చిత్రం రూ.172 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టింది. వాస్తవంగా అంత కాకపోయినా 140-150 కోట్ల మధ్య గ్రాస్ వచ్చి ఉంటుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. ఐతే రెండో రోజు వసూళ్లలో అనుకున్నట్లే డ్రాప్ కనిపించింది. వసూళ్లు సగానికి పైగానే తగ్గాయి. ఈ సినిమాను విస్తృత స్థాయిలో రిలీజ్ చేయడం.. అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లోనూ బొమ్మ పడడం.. పైగా రోజుకు ఆరు షోలు నడవడంతో సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్లలో చాలామంది తొలి రోజే చూశారు. టాక్ డివైడ్గా ఉండడంతో సామాన్య ప్రేక్షకుల్లో రెండో రోజుకు ఆసక్తి తగ్గింది. కానీ సినిమా డౌన్ అయితే కాలేదు. కలెక్షన్లు నిలకడగానే ఉన్నాయి. ఆదివారం వసూళ్లు పికప్ అయ్యాయి.
ఐతే మిగతా ఏరియాల సంగతేమో కానీ.. కొన్ని చోట్ల మాత్రం ఈ చిత్రం సూపర్ హిట్ రేంజిని అందుకునేలా ఉంది. అమెరికాలో ‘దేవర’ వసూళ్లు అంచనాలను మించిపోయాయి. వీకెండ్ అయ్యేసరికి 4 మిలియన్ మార్కును టచ్ చేస్తుందని అనుకుంటే.. శనివారమే ఆ మార్కును టచ్ చేసేసింది. ఆదివారానికి వసూళ్లు 5 మిలియన్ మార్కుకు చేరువ కానున్నాయి. వీకెండ్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోబోతోంది. తర్వాత వచ్చేవన్నీ లాభాలే.
ఇక హిందీ వెర్షన్ విషయానికి వస్తే.. తొలి రోజు ఏడున్నర కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు 9 కోట్లకు వసూళ్లను పెంచుకోవడం విశేషం. తొలి రోజు తర్వాత వేరే చోట్ల వసూళ్లు డ్రాప్ అయితే.. హిందీలో మాత్రం ఇంకా మెరుగవడం విశేషం. దీన్ని బట్టి సినిమా హిందీ మాస్ ప్రేక్షకులకు బాగా ఎక్కేస్తోందని అర్థం. నార్త్ ఇండియాలోని సెకండ్ గ్రేట్ సెంటర్లలో సినిమాకు ఫుల్స్ పడుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆదివారం హిందీ వెర్షన్ రూ.15 కోట్ల మేర గ్రాస్ కలెక్ట్ చేస్తుందనే అంచనాలున్నాయి. ఇక్కడ కూడా సినిమా సూపర్ హిట్ రేంజిని అందుకోనున్నట్లే.
This post was last modified on September 29, 2024 9:43 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…