తెలుగు రాష్ట్రాల్లోనే ఐకానిక్ థియేటర్ గా పేరున్న సుదర్శన్ 35 ఎంఎంలో దేవర కటవుట్ హఠాత్తుగా మంటల్లో కాలిపోవడం అభిమానులను హతాశులను చేసింది. జూనియర్ ఎన్టీఆర్ నిలువెత్తు ప్రతిరూపం తగలబడిపోవడం చూసి జనం పరుగులు పెట్టగా ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి అగ్ని కీలలను చల్లార్చారు. ఇది సినిమా నచ్చక ఫ్యాన్స్ చేసిన పనని కొందరు అర్థం లేని ప్రచారాన్ని సోషల్ మీడియాలో లేవనెత్తగా అది కాస్తా వైరల్ కావడం మొదలయ్యింది. అసలది నిజం కాదు. షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పు రాజుకుందని, గుర్తించేలోగా పైదాకా వ్యాపించిందని ప్రాధమికంగా అందిన సమాచారం.
మరికొందరు చెబుతున్న వెర్షన్ ప్రకారం ఆకతాయిలు కావాలని చేశారని మాట్లాడుకున్నా అదంతా ఉత్తుత్తిదే. యాంటీ ఫ్యాన్స్ కొందరు ట్వీట్ల రూపంలో లేనిపోని అబద్దాలు ప్రచారంలోకి తేవడం లేనిపోని అనుమానాలకు తావిస్తోంది. టపాసులు పేల్చడం వల్ల పూలకు రవ్వలు అంటుకుని జరిగిందని మరికొందరు అంటున్నారు. నిజానిజాలు తర్వాత బయటికి వస్తాయి కానీ దేవరకు బ్యాడ్ టాక్ రావడంతో అలా చేశారనేది మాత్రం పెద్ద కామెడీ. ఎందుకంటే హెచ్చుతగ్గులు కొన్ని ఉన్నప్పటికీ సినిమా తీవ్రంగా నిరాశ పరచలేదన్నది వాస్తవం. సెకండాఫ్ ఇష్యూస్ ఉన్నాయి కానీ అవి మరీ డ్యామేజ్ అనిపించేంత కాదని ఫ్యాన్స్ అభిప్రాయం.
దశాబ్దాల చరిత్ర కలిగిన సుదర్శన్ లో ఇలా కటవుట్ మొత్తం కాలిపోవడం ఎప్పుడూ చూడలేదని చుట్టుపక్కల వాళ్ళు కామెంట్స్ చేసుకోవడం గమనార్షం. నిన్న రాత్రి తొమ్మిది గంటల నుంచే ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో భారీ ఎత్తున సెలబ్రేషన్లు జరుగుతున్నాయి. డీజేలు, లైటింగులు, బాణాసంచా, డెకరేషన్లు ఒకటా రెండా మాములు రచ్చ జరగడం లేదు. ఒంటి గంట స్పెషల్ షో టికెట్ ధర రెండు వేల రూపాయలకు పైగానే పలికిందంటేనే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీలైనంత త్వరగా కొత్త కటవుట్ పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం అదృష్టం
This post was last modified on September 27, 2024 1:31 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…