టాలీవుడ్ అతిలోకసుందరిగా పేరు గాంచిన స్వర్గీయ శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ మీద మన ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమానం ఉంది. శ్రీదేవి ఎన్నో బ్లాక్ బస్టర్స్, క్లాసిక్స్ లో నటించి చెరిగిపోని సంతకం చేయడం పరిశ్రమ ఉన్నంత కాలం గుర్తుండిపోతుంది. అలాంటి దిగ్గజ నటి కూతురంటే సహజంగా అంచనాలు రేకెత్తుతాయి. అందుకే దేవర మీద ఈ విషయంగా సామాన్య జనంలో ఆసక్తి నెలకొంది. వరని ప్రేమించే తంగమ్మగా జాన్వీ నిడివి ఇందులో చాలా పరిమితంగా ఉంది. కాసిన్ని సీన్లు, ఒక పాటతో సర్ధేశారు. తన ఎంట్రీ సెకండాఫ్ లోనే ఉంటుందని కెమెరామెన్ రత్నవేలు ఒక ఇంటర్వ్యూలో ముందే చెప్పేశారు.
పెర్ఫార్మన్స్ పరంగా చూసుకుంటే జాన్వీ కపూర్ కు దక్కిన కొద్దిపాటి స్పేస్ లో ఎక్కువ జడ్జ్ చేసే అవకాశం దక్కలేదు. ఉన్నంతలో చలాకీగా, అందంగా కనిపించడమే కాక హుషారుగా నటించింది. కాకపోతే తంగం క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం సంతృప్తికరంగా అనిపించలేదు. వరతో ప్రేమ వ్యవహారాన్ని దర్శకుడు కొరటాల శివ అంత మెప్పించేలా చేయలేకపోయారు. దృష్టి మొత్తం యాక్షన్, ఎలివేషన్ మీద పెట్టడంతో హీరో హీరోయిన్ ట్రాక్ కి ప్రాధాన్యం ఇవ్వలేదు. గెటప్ శీను, హిమజ, హరితేజ గ్యాంగుతో కాస్త కామెడీ ట్రై చేశారు కానీ వయోలెంట్ మూడ్ లో ఉన్న జనాలకు అది ఎక్కలేదు.
సో జాన్వీ కపూర్ స్వయంగా చెప్పినట్టు తన స్టామినా బయట పాడేది దేవర పార్ట్ 2లోనే. అయితే ఇది ఎప్పుడు వస్తుందనేది మాత్రం ఇప్పట్లో తేలదు. ఎందుకంటే వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ పూర్తి చేసే నాటికి ఇంకో రెండేళ్లు గడిచిపోతాయి. ఒకవేళ మరీ లేట్ అయ్యే పక్షంలో వేరే హీరోతో ఇంకో సినిమా తీసి దేవర 2కి వస్తానని కొరటాల శివ ఇటీవలే చెప్పారు. సో ఈలోగా ఆర్సి 16 అయిపోవచ్చు. అంటే జాన్వీని మరోసారి తారక్ కు జోడీగా చూడటానికన్నా ముందు రామ్ చరణ్ తో జట్టు కట్టడాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూడు హిట్ అయితే తన దశ ఎక్కడికో వెళ్ళిపోతుంది.
This post was last modified on September 27, 2024 12:22 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…