ఆరెక్స్ 100తో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఆ తర్వాత మహా సముద్రంతో అంచనాలు అందుకోలేనప్పటికీ మంగళవారం తనలో అసలైన టెక్నీషియన్ ని మరోసారి బయటికి తీసుకొచ్చింది. ఆస్కార్ నామినేషన్లకు పంపాల్సిన లిస్టులో చోటు దక్కించుకోవడం బట్టే విమర్శకులను ఎంతగా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. సీక్వెల్ తీస్తానని అప్పట్లోనే చెప్పిన అజయ్ భూపతి దాని స్క్రిప్ట్ తాలూకు పనులు జరుగుతుండగానే మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు ఫిలిం నగర్ టాక్. అది కూడా ఏకంగా కోలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చే విధంగా దక్కడం విశేషం.
చియాన్ విక్రమ్ కొడుకు హీరోగా అజయ్ భూపతి డైరెక్షన్ ఒక భారీ బడ్జెట్ మూవీని లాక్ చేసినట్టు చెన్నై అప్డేట్. కొన్ని నెలల క్రితమే కథ చెప్పి ఒప్పించిన ఈ విలక్షణ దర్శకుడు ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని సమాచారం. మొన్న ధృవ్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటన రావాల్సింది కానీ చివరి దశ చర్చలు జరుగుతున్న కారణంగా కొంచెం ఆలస్యమవుతోందని వినికిడి. ఇటీవలి కాలంలో టాలీవుడ్ దర్శకులకు అక్కడ మంచి అవకాశాలు దక్కుతున్నాయి. వంశీ పైడిపల్లి ఏకంగా విజయ్ తో వారసుడు చేయగా, కెవి అనుదీప్ కు పిలిచి మరీ ప్రిన్స్ ఇచ్చాడు శివ కార్తికేయన్.
ప్రస్తుతం ధృవ్ విక్రమ్ కు మంచి మార్కెట్ ఉంది. వేగంగా సినిమాలు చేయకపోయినా తండ్రి చూపించిన బాటలో వెరైటీ కథలను ఎంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. అందులో భాగంగానే అజయ్ భూపతికి ఎస్ చెప్పి ఉండొచ్చు. సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ కనక అక్కడ డెబ్యూతో ఋజువు చేసుకుంటే స్టార్ హీరోల నుంచి పిలుపు అందుకోవచ్చు. ధృవ్ కోసం ఆరెక్స్ 100 లాంటి కల్ట్ లవ్ స్టోరీ కాకుండా మంచి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కథను రాసుకున్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు, హీరోయిన్, టెక్నికల్ టీమ్ తదితర వివరాలు తెలియాల్సి ఉంది.
This post was last modified on September 25, 2024 2:54 pm
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…