దేవర.. జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఆరేళ్ల తర్వాత వస్తున్న సోలో మూవీ. తారక్ సినిమాల ఆడియో వేడుకలు, ప్రి రిలీజ్ ఈవెంట్లు అంటే అభిమానులకు చాలా ప్రత్యేకం. చాలా పెద్ద స్థాయిలో జరుగుతాయి. తారక్ చాలా హార్ట్ఫుల్గా, ఎమోషనల్గా మాట్లాడతాడు. ఈసారి గ్యాప్ చాలా ఎక్కువ వచ్చిన నేపథ్యంలో ‘దేవర’ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా, ఆశగా చూశారు.
తీరా చూస్తే అభిమానులు పరిమితికి మించి రావడంతో నోవాటెల్లో ఆదివారం జరగాల్సిన ఈవెంట్ను రద్దు చేయక తప్పలేదు. ఈవెంట్ మొదలవడానికి కొన్ని గంటల ముందే అనుమతించిన పరిమితికి మించి ఎన్నో రెట్ల సంఖ్యలో వేదిక వద్దకు అభిమానులు వచ్చేశారు. 4 వేల మందికి అనుమతి ఇవ్వగా.. ఈవెంట్ జరగడానికి ముందు లోపల బయట కలిపి 30-35 వేల మంది దాకా ఉన్నట్లు చెబుతున్నారు. అభిమానులను నియంత్రించలేని పరిస్థితుల్లో ఈవెంట్ క్యాన్సిల్ చేయక తప్పలేదు.
ఒక పెద్ద హీరో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఇలా రద్దవడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వేడుకలకు వేదికను ఎంచుకోవడంలో, ఏర్పాట్లు చేయడంలో బెటర్ ప్లానింగ్ ఉండాల్సిన అవసరాన్ని ఇది చాటిచెప్పింది. గతంలో తారక్ సినిమాకు సంబంధించిన ఈవెంట్ దగ్గర ఒక అభిమాని తొక్కిసలాటలో చనిపోవడం, వేరే ఈవెంట్లలో కూడా విషాదాలు చోటు చేసుకోవడం గుర్తుండే ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఇకపై పెద్ద హీరోల సినిమాల ఈవెంట్లను వీలైనంత మేర ఓపెన్ గ్రౌండ్లోనే చేయాలనే చర్చ జరుగుతోంది. ‘పుష్ప-2’ విషయంలోనూ తాము అదే చేయబోతున్నట్లు నిర్మాత రవిశంకర్ ప్రకటించారు. ‘దేవర’ ఈవెంట్కు తాను కూడా హాజరు కావాల్సిందని.. కానీ పరిస్థితి చేయి దాటిపోవడంతో తాము లోపలికి వెళ్లలేని పరిస్థితి తలెత్తిందని రవిశంకర్ చెప్పారు. తారక్ యుఎస్ వెళ్లిపోతున్న నేపథ్యంలో వేరే ఈవెంట్ చేయడానికి అవకాశం లేకపోయిందని చెప్పిన ఆయన.. ‘దేవర’ ఈవెంట్ విషయంలో జరిగింది తమకు ఒక పాఠమని చెప్పారు. అందుకే ‘పుష్ప-2’ ప్రి రిలీజ్ ఈవెంట్ విషయంలో జాగ్రత్త పడతామని.. ఓపెన్ గ్రౌండ్లోనే ఆ వేడుక చేయాలనుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ‘పుష్ప-2’ డిసెంబరు 6న విడుదల కానుండగా.. నవంబరు చివర్లో ప్రి రిలీజ్ ఈవెంట్ ఉండొచ్చు.
This post was last modified on September 24, 2024 6:32 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…