దేవర.. జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఆరేళ్ల తర్వాత వస్తున్న సోలో మూవీ. తారక్ సినిమాల ఆడియో వేడుకలు, ప్రి రిలీజ్ ఈవెంట్లు అంటే అభిమానులకు చాలా ప్రత్యేకం. చాలా పెద్ద స్థాయిలో జరుగుతాయి. తారక్ చాలా హార్ట్ఫుల్గా, ఎమోషనల్గా మాట్లాడతాడు. ఈసారి గ్యాప్ చాలా ఎక్కువ వచ్చిన నేపథ్యంలో ‘దేవర’ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా, ఆశగా చూశారు.
తీరా చూస్తే అభిమానులు పరిమితికి మించి రావడంతో నోవాటెల్లో ఆదివారం జరగాల్సిన ఈవెంట్ను రద్దు చేయక తప్పలేదు. ఈవెంట్ మొదలవడానికి కొన్ని గంటల ముందే అనుమతించిన పరిమితికి మించి ఎన్నో రెట్ల సంఖ్యలో వేదిక వద్దకు అభిమానులు వచ్చేశారు. 4 వేల మందికి అనుమతి ఇవ్వగా.. ఈవెంట్ జరగడానికి ముందు లోపల బయట కలిపి 30-35 వేల మంది దాకా ఉన్నట్లు చెబుతున్నారు. అభిమానులను నియంత్రించలేని పరిస్థితుల్లో ఈవెంట్ క్యాన్సిల్ చేయక తప్పలేదు.
ఒక పెద్ద హీరో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఇలా రద్దవడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వేడుకలకు వేదికను ఎంచుకోవడంలో, ఏర్పాట్లు చేయడంలో బెటర్ ప్లానింగ్ ఉండాల్సిన అవసరాన్ని ఇది చాటిచెప్పింది. గతంలో తారక్ సినిమాకు సంబంధించిన ఈవెంట్ దగ్గర ఒక అభిమాని తొక్కిసలాటలో చనిపోవడం, వేరే ఈవెంట్లలో కూడా విషాదాలు చోటు చేసుకోవడం గుర్తుండే ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఇకపై పెద్ద హీరోల సినిమాల ఈవెంట్లను వీలైనంత మేర ఓపెన్ గ్రౌండ్లోనే చేయాలనే చర్చ జరుగుతోంది. ‘పుష్ప-2’ విషయంలోనూ తాము అదే చేయబోతున్నట్లు నిర్మాత రవిశంకర్ ప్రకటించారు. ‘దేవర’ ఈవెంట్కు తాను కూడా హాజరు కావాల్సిందని.. కానీ పరిస్థితి చేయి దాటిపోవడంతో తాము లోపలికి వెళ్లలేని పరిస్థితి తలెత్తిందని రవిశంకర్ చెప్పారు. తారక్ యుఎస్ వెళ్లిపోతున్న నేపథ్యంలో వేరే ఈవెంట్ చేయడానికి అవకాశం లేకపోయిందని చెప్పిన ఆయన.. ‘దేవర’ ఈవెంట్ విషయంలో జరిగింది తమకు ఒక పాఠమని చెప్పారు. అందుకే ‘పుష్ప-2’ ప్రి రిలీజ్ ఈవెంట్ విషయంలో జాగ్రత్త పడతామని.. ఓపెన్ గ్రౌండ్లోనే ఆ వేడుక చేయాలనుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ‘పుష్ప-2’ డిసెంబరు 6న విడుదల కానుండగా.. నవంబరు చివర్లో ప్రి రిలీజ్ ఈవెంట్ ఉండొచ్చు.
This post was last modified on September 24, 2024 6:32 pm
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…