దేవర.. జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఆరేళ్ల తర్వాత వస్తున్న సోలో మూవీ. తారక్ సినిమాల ఆడియో వేడుకలు, ప్రి రిలీజ్ ఈవెంట్లు అంటే అభిమానులకు చాలా ప్రత్యేకం. చాలా పెద్ద స్థాయిలో జరుగుతాయి. తారక్ చాలా హార్ట్ఫుల్గా, ఎమోషనల్గా మాట్లాడతాడు. ఈసారి గ్యాప్ చాలా ఎక్కువ వచ్చిన నేపథ్యంలో ‘దేవర’ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా, ఆశగా చూశారు.
తీరా చూస్తే అభిమానులు పరిమితికి మించి రావడంతో నోవాటెల్లో ఆదివారం జరగాల్సిన ఈవెంట్ను రద్దు చేయక తప్పలేదు. ఈవెంట్ మొదలవడానికి కొన్ని గంటల ముందే అనుమతించిన పరిమితికి మించి ఎన్నో రెట్ల సంఖ్యలో వేదిక వద్దకు అభిమానులు వచ్చేశారు. 4 వేల మందికి అనుమతి ఇవ్వగా.. ఈవెంట్ జరగడానికి ముందు లోపల బయట కలిపి 30-35 వేల మంది దాకా ఉన్నట్లు చెబుతున్నారు. అభిమానులను నియంత్రించలేని పరిస్థితుల్లో ఈవెంట్ క్యాన్సిల్ చేయక తప్పలేదు.
ఒక పెద్ద హీరో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఇలా రద్దవడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వేడుకలకు వేదికను ఎంచుకోవడంలో, ఏర్పాట్లు చేయడంలో బెటర్ ప్లానింగ్ ఉండాల్సిన అవసరాన్ని ఇది చాటిచెప్పింది. గతంలో తారక్ సినిమాకు సంబంధించిన ఈవెంట్ దగ్గర ఒక అభిమాని తొక్కిసలాటలో చనిపోవడం, వేరే ఈవెంట్లలో కూడా విషాదాలు చోటు చేసుకోవడం గుర్తుండే ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఇకపై పెద్ద హీరోల సినిమాల ఈవెంట్లను వీలైనంత మేర ఓపెన్ గ్రౌండ్లోనే చేయాలనే చర్చ జరుగుతోంది. ‘పుష్ప-2’ విషయంలోనూ తాము అదే చేయబోతున్నట్లు నిర్మాత రవిశంకర్ ప్రకటించారు. ‘దేవర’ ఈవెంట్కు తాను కూడా హాజరు కావాల్సిందని.. కానీ పరిస్థితి చేయి దాటిపోవడంతో తాము లోపలికి వెళ్లలేని పరిస్థితి తలెత్తిందని రవిశంకర్ చెప్పారు. తారక్ యుఎస్ వెళ్లిపోతున్న నేపథ్యంలో వేరే ఈవెంట్ చేయడానికి అవకాశం లేకపోయిందని చెప్పిన ఆయన.. ‘దేవర’ ఈవెంట్ విషయంలో జరిగింది తమకు ఒక పాఠమని చెప్పారు. అందుకే ‘పుష్ప-2’ ప్రి రిలీజ్ ఈవెంట్ విషయంలో జాగ్రత్త పడతామని.. ఓపెన్ గ్రౌండ్లోనే ఆ వేడుక చేయాలనుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ‘పుష్ప-2’ డిసెంబరు 6న విడుదల కానుండగా.. నవంబరు చివర్లో ప్రి రిలీజ్ ఈవెంట్ ఉండొచ్చు.
This post was last modified on September 24, 2024 6:32 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…