Movie News

శనివారం భామకు ఇంకో సూపర్ ఛాన్స్

ఆరేళ్ళ క్రితం నాని గ్యాంగ్ లీడర్ తో టాలీవుడ్ డెబ్యూ చేసి ఆ వెంటనే శర్వానంద్ శ్రీకారంలో ఛాన్స్ దక్కించుకున్నప్పటికీ ఆ రెండూ సక్సెస్ కాకపోవడంతో హీరోయిన్ ప్రియాంక మోహన్ కు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఎంచక్కా తమిళంలో సెటిలైపోయింది. శివ కార్తికేయన్ తో వరసగా డాక్టర్, డాన్ రూపంలో రెండు హిట్లు, సూర్య లాంటి స్టార్ సరసన ఈటిలో నటించాక కెరీర్ ఊపందుకుంది. కెప్టెన్ మిల్లర్ లో డిఫరెంట్ పాత్ర దక్కింది కానీ తమిళంలోనే ఏవరేజ్ గా నిలిచిన ఈ సినిమా ఇతర భాషల్లో ఫ్లాపయ్యింది. కానీ సరిపోదా శనివారం లెక్కలు మార్చేసింది.

రెండోసారి న్యాచురల్ నానికి జోడి కట్టడం బ్లాక్ బస్టర్ అందించింది. ఏకంగా వంద కోట్ల గ్రాసర్ లో భాగమయ్యేలా చేసింది. ఈ చిత్రం నిర్మించిన డివివి బ్యానరే పవన్ కళ్యాణ్ ఓజి తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోనూ ప్రియాంక మోహనే హీరోయిన్. కాకపోతే ఇది కొంచెం ఆలస్యమయ్యేలా ఉంది. తాజాగా విశ్వక్ సేన్ సరసన నటించేందుకు ఈ శనివారం భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. జాతిరత్నాలు, ప్రిన్స్ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించబోయే మూవీలో తననే ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ దాదాపు కన్ఫర్మట.

ఫామ్ లో ఉన్న హీరోయిన్లను ఎంచుకోవడంలో విశ్వక్ సేన్ పాటిస్తున్న స్ట్రాటజీలో వర్కౌట్ అవుతున్నాయి. మెకానిక్ రాకీలో మీనాక్షి చౌదరి నటిస్తున్న సంగతి తెలిసిందే. లైలాలో ఆకాంక్ష శర్మని ఎంచుకున్నారు. ఇప్పుడు ప్రియాంక మోహన్ ని లాక్ చేసుకునే పనిలో ఉన్నారు. గ్యాంగ్ అఫ్ గోదావరి నిరాశ పరచడంతో విశ్వక్ కొత్త తరహా సబ్జెక్టులను ఎంచుకునే పనిలో పడ్డాడు. లైలాలో ఏకంగా అమ్మాయి గెటప్ లో కనిపించేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటి జనరేషన్ లో పూర్తి నిడివి లేడీ రోల్స్ చేసినవాళ్లు లేరు. ఇక కెవి అనుదీప్ రాసుకున్న స్టోరీ మాత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని టాక్.

This post was last modified on September 24, 2024 5:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ట్రిపుల్ రోల్.. క్లారిటీ వచ్చింది

ఇంకో మూడు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘దేవర’ సినిమా. గురువారం అర్ధరాత్రి నుంచే షోలు పడనున్న నేపథ్యంలో వాస్తవానికి…

39 mins ago

నో ఛేంజ్….ఇది రామ్ చరణ్ మాట

ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా గేమ్ ఛేంజర్ విడుదల డిసెంబర్ 20 అనేది ఓపెన్ సీక్రెట్.…

2 hours ago

నామినేటెడ్ పోస్టుల జాతర..చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లను కైవసం చేసుకున్న…

2 hours ago

సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టు షాక్

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టు భారీ షాకిచ్చింది. ఆ కేసులో సీఎం…

2 hours ago

తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వరా?: చంద్రబాబు

తిరుపతి లడ్డూ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ సీఎం జగన్ పై…

3 hours ago

OTTల అసలు గుట్టు విప్పిన దర్శకుడు

స్టార్ల సినిమాల బడ్జెట్ లు, రెమ్యునరేషన్లు అమాంతం పెరిగిపోవడానికి ఓటిటిలు కారణమంటే వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. ఎలాగో…

4 hours ago