స్టార్ల సినిమాల బడ్జెట్ లు, రెమ్యునరేషన్లు అమాంతం పెరిగిపోవడానికి ఓటిటిలు కారణమంటే వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. ఎలాగో దర్శకుడు వెట్రిమారన్ వివరించారు. ఇటీవలే దేవర ప్రమోషన్ల కోసం చెన్నై వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ ని అక్కడి మీడియా మీరు ఎవరితో పని చేయాలని కోరుకుంటున్నారని అడిగితే ఈ విలక్షణ దర్శకుడి పేరు చెప్పిన సంగతి తెలిసిందే. విడుదల పార్ట్ 1, విచారణ, వడ చెన్నై, అసురన్ (నారప్ప) లాంటి క్లాసిక్స్ తో ఈయన సంపాదించుకున్న అభిమానం అలాంటిది. ఇతర డైరెక్టర్లతో ఒక రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ సందర్భంగా ఒక ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు.
రజనీకాంత్, విజయ్ లాంటి పెద్ద హీరోల సినిమాలకు ఓటిటిలు నిర్మాణం మొదలుకాకుండానే 120 కోట్ల వరకు ఇస్తామంటూ ఆఫర్లు చెబుతాయి. దాంతో డిజిటల్ లోనే అంత డబ్బు వస్తున్నప్పుడు పారితోషికం ఎందుకు పెంచకూడదనే ఆలోచన స్టార్లకు రావడం సహజం. దాంతో అమాంతం నాలుగైదింతలు పెంచేస్తున్నారు. ఎలాగూ డబ్బులు వస్తున్నాయనే ధీమాతో నిర్మాతలు ముందు వెనుకా చూడకుండా అడిగినంత ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఒకవేళ డిజాస్టర్ అయితే తర్వాతి సినిమాకు అంత ఇవ్వలేం అంటూ ఓటిటిలు బేరాలు పెడతాయి. దీంతో ఏర్పాట్లలో ఉన్న ప్రొడ్యూసర్ గుండె గుభేలుమంటుంది.
ఇదంతా వెట్రిమారన్ సవివరంగా ఇచ్చిన విశ్లేషణ. నిజమేగా. కరోనా టైంలో భారీగా హక్కుల కోసం వెచ్చించిన ఓటిటిలు ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలకు చుక్కలు చూపిస్తున్న మాట వాస్తవం. ముందో మాట తర్వాతో మాట మార్చేస్తున్నాయి. కొన్నిసార్లు ఏకంగా థియేటర్ రిలీజ్ డేట్లు నిర్దేశిస్తున్నాయి. మొన్న ఇండిపెండెన్స్ డేకి రిలీజైన ఒక పెద్ద సినిమా కేవలం ఆ ఒత్తిడి కారణంగా హడావిడిగా విడుదల చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి ఉదాహరణలు బోలెడున్నాయి. ఓటిటిలు పరిశ్రమను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో వెట్రిమారన్ ఇంత స్పష్టంగా చెప్పినా పరిస్థితిలో మార్పు రావడం కష్టమే.
This post was last modified on September 24, 2024 5:17 pm
ఇంకో మూడు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘దేవర’ సినిమా. గురువారం అర్ధరాత్రి నుంచే షోలు పడనున్న నేపథ్యంలో వాస్తవానికి…
ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా గేమ్ ఛేంజర్ విడుదల డిసెంబర్ 20 అనేది ఓపెన్ సీక్రెట్.…
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లను కైవసం చేసుకున్న…
మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(MUDA) కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టు భారీ షాకిచ్చింది. ఆ కేసులో సీఎం…
ఆరేళ్ళ క్రితం నాని గ్యాంగ్ లీడర్ తో టాలీవుడ్ డెబ్యూ చేసి ఆ వెంటనే శర్వానంద్ శ్రీకారంలో ఛాన్స్ దక్కించుకున్నప్పటికీ…
తిరుపతి లడ్డూ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ సీఎం జగన్ పై…