స్టార్ల సినిమాల బడ్జెట్ లు, రెమ్యునరేషన్లు అమాంతం పెరిగిపోవడానికి ఓటిటిలు కారణమంటే వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. ఎలాగో దర్శకుడు వెట్రిమారన్ వివరించారు. ఇటీవలే దేవర ప్రమోషన్ల కోసం చెన్నై వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ ని అక్కడి మీడియా మీరు ఎవరితో పని చేయాలని కోరుకుంటున్నారని అడిగితే ఈ విలక్షణ దర్శకుడి పేరు చెప్పిన సంగతి తెలిసిందే. విడుదల పార్ట్ 1, విచారణ, వడ చెన్నై, అసురన్ (నారప్ప) లాంటి క్లాసిక్స్ తో ఈయన సంపాదించుకున్న అభిమానం అలాంటిది. ఇతర డైరెక్టర్లతో ఒక రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ సందర్భంగా ఒక ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు.
రజనీకాంత్, విజయ్ లాంటి పెద్ద హీరోల సినిమాలకు ఓటిటిలు నిర్మాణం మొదలుకాకుండానే 120 కోట్ల వరకు ఇస్తామంటూ ఆఫర్లు చెబుతాయి. దాంతో డిజిటల్ లోనే అంత డబ్బు వస్తున్నప్పుడు పారితోషికం ఎందుకు పెంచకూడదనే ఆలోచన స్టార్లకు రావడం సహజం. దాంతో అమాంతం నాలుగైదింతలు పెంచేస్తున్నారు. ఎలాగూ డబ్బులు వస్తున్నాయనే ధీమాతో నిర్మాతలు ముందు వెనుకా చూడకుండా అడిగినంత ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఒకవేళ డిజాస్టర్ అయితే తర్వాతి సినిమాకు అంత ఇవ్వలేం అంటూ ఓటిటిలు బేరాలు పెడతాయి. దీంతో ఏర్పాట్లలో ఉన్న ప్రొడ్యూసర్ గుండె గుభేలుమంటుంది.
ఇదంతా వెట్రిమారన్ సవివరంగా ఇచ్చిన విశ్లేషణ. నిజమేగా. కరోనా టైంలో భారీగా హక్కుల కోసం వెచ్చించిన ఓటిటిలు ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలకు చుక్కలు చూపిస్తున్న మాట వాస్తవం. ముందో మాట తర్వాతో మాట మార్చేస్తున్నాయి. కొన్నిసార్లు ఏకంగా థియేటర్ రిలీజ్ డేట్లు నిర్దేశిస్తున్నాయి. మొన్న ఇండిపెండెన్స్ డేకి రిలీజైన ఒక పెద్ద సినిమా కేవలం ఆ ఒత్తిడి కారణంగా హడావిడిగా విడుదల చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి ఉదాహరణలు బోలెడున్నాయి. ఓటిటిలు పరిశ్రమను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో వెట్రిమారన్ ఇంత స్పష్టంగా చెప్పినా పరిస్థితిలో మార్పు రావడం కష్టమే.
This post was last modified on September 24, 2024 5:17 pm
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…