స్టార్ల సినిమాల బడ్జెట్ లు, రెమ్యునరేషన్లు అమాంతం పెరిగిపోవడానికి ఓటిటిలు కారణమంటే వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. ఎలాగో దర్శకుడు వెట్రిమారన్ వివరించారు. ఇటీవలే దేవర ప్రమోషన్ల కోసం చెన్నై వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ ని అక్కడి మీడియా మీరు ఎవరితో పని చేయాలని కోరుకుంటున్నారని అడిగితే ఈ విలక్షణ దర్శకుడి పేరు చెప్పిన సంగతి తెలిసిందే. విడుదల పార్ట్ 1, విచారణ, వడ చెన్నై, అసురన్ (నారప్ప) లాంటి క్లాసిక్స్ తో ఈయన సంపాదించుకున్న అభిమానం అలాంటిది. ఇతర డైరెక్టర్లతో ఒక రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ సందర్భంగా ఒక ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు.
రజనీకాంత్, విజయ్ లాంటి పెద్ద హీరోల సినిమాలకు ఓటిటిలు నిర్మాణం మొదలుకాకుండానే 120 కోట్ల వరకు ఇస్తామంటూ ఆఫర్లు చెబుతాయి. దాంతో డిజిటల్ లోనే అంత డబ్బు వస్తున్నప్పుడు పారితోషికం ఎందుకు పెంచకూడదనే ఆలోచన స్టార్లకు రావడం సహజం. దాంతో అమాంతం నాలుగైదింతలు పెంచేస్తున్నారు. ఎలాగూ డబ్బులు వస్తున్నాయనే ధీమాతో నిర్మాతలు ముందు వెనుకా చూడకుండా అడిగినంత ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఒకవేళ డిజాస్టర్ అయితే తర్వాతి సినిమాకు అంత ఇవ్వలేం అంటూ ఓటిటిలు బేరాలు పెడతాయి. దీంతో ఏర్పాట్లలో ఉన్న ప్రొడ్యూసర్ గుండె గుభేలుమంటుంది.
ఇదంతా వెట్రిమారన్ సవివరంగా ఇచ్చిన విశ్లేషణ. నిజమేగా. కరోనా టైంలో భారీగా హక్కుల కోసం వెచ్చించిన ఓటిటిలు ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలకు చుక్కలు చూపిస్తున్న మాట వాస్తవం. ముందో మాట తర్వాతో మాట మార్చేస్తున్నాయి. కొన్నిసార్లు ఏకంగా థియేటర్ రిలీజ్ డేట్లు నిర్దేశిస్తున్నాయి. మొన్న ఇండిపెండెన్స్ డేకి రిలీజైన ఒక పెద్ద సినిమా కేవలం ఆ ఒత్తిడి కారణంగా హడావిడిగా విడుదల చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి ఉదాహరణలు బోలెడున్నాయి. ఓటిటిలు పరిశ్రమను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో వెట్రిమారన్ ఇంత స్పష్టంగా చెప్పినా పరిస్థితిలో మార్పు రావడం కష్టమే.
This post was last modified on September 24, 2024 5:17 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…