30 ప్లస్లోకి వచ్చారంటే చాలామంది హీరోయిన్ల కెరీర్ ముగిసిపోతుంటుంది. అప్పటికి సినిమాలు ఉన్నా అంతకుముందున్న స్థాయిలో మాత్రం ఉండవు. హీరోయిన్లు ఆ వయసులో ఒక రేంజ్ మెయింటైన్ చేయడమంటే కష్టమే. కానీ అనుష్క శెట్టి మాత్రం 30 ప్లస్లోనూ భారీ సినిమాలు చేసింది. తిరుగులేని విజయాలందుకుంది.
బాహుబలి, రుద్రమదేవి, భాగమతి లాంటి సినిమాలు అనుష్క నుంచి వచ్చింది 30 ప్లస్లోనే కావడం విశేషం. ఐతే ‘భాగమతి’ తర్వాత అనుష్క కొంత కాలం కనిపించకుండా పోయింది. గ్యాప్ తీసుకుని ‘నిశ్శబ్దం’ సినిమాలో నటించింది. దీని తర్వాత మరే చిత్రానికీ కమిట్మెంట్ ఇచ్చినట్లు అధికారిక సమాచారం అయితే బయటికి రాలేదు. మరి అనుష్క ఇంత స్లో ఎందుకైంది.. ఆమెకు ఆఫర్లు రావట్లేదా.. లేక తనే సినిమాలు వదులుకుందా అన్నది అభిమానులకు అర్థం కాలేదు.
ఐతే తన కొత్త చిత్రం ‘నిశ్శబ్దం’ అమేజాన్ ప్రైమ్లో డిజిటల్ రిలీజ్కు రెడీ అయిన నేపత్యంలో ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క తన కెరీర్లో వచ్చిన గ్యాప్ గురించి, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి మాట్లాడింది. వరుసగా భారీ చిత్రాలు చేయడంతో ‘భాగమతి’ పూర్తయ్యే సమయానికి బాగా అలసిపోయానని.. దీంతో విశ్రాంతి అవసరమని భావించే కొంత కాలం పాటు సినిమాలు చేయలేదని ఆమె తెలిపింది.
ఆ ఖాళీలో, ఆపై షూటింగుల్లేని గత ఆరు నెలల్లో సమయాన్ని ఎంతగానో ఆస్వాదించినట్లు అనుష్క తెలిపింది. ‘నిశ్శబ్దం’ అనుష్క చివరి సినిమా కావచ్చని, ఆమె రిటైర్ కాబోతోందని, వ్యక్తిగత జీవితంలో స్థిరపడబోతోందని కొంత ప్రచారం నడుస్తుండగా.. దాన్ని పరోక్షంగా ఖండించింది అనుష్క. తాను ఈ మధ్య కొత్తగా రెండు సినిమాలు సంతకం చేశానని చెప్పిన అనుష్క.. వాటి గురించి తన కన్నా వాటి నిర్మాతలు చెబితే బాగుంటుందని, కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాలని చెప్పింది.
This post was last modified on September 30, 2020 9:14 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…