30 ప్లస్లోకి వచ్చారంటే చాలామంది హీరోయిన్ల కెరీర్ ముగిసిపోతుంటుంది. అప్పటికి సినిమాలు ఉన్నా అంతకుముందున్న స్థాయిలో మాత్రం ఉండవు. హీరోయిన్లు ఆ వయసులో ఒక రేంజ్ మెయింటైన్ చేయడమంటే కష్టమే. కానీ అనుష్క శెట్టి మాత్రం 30 ప్లస్లోనూ భారీ సినిమాలు చేసింది. తిరుగులేని విజయాలందుకుంది.
బాహుబలి, రుద్రమదేవి, భాగమతి లాంటి సినిమాలు అనుష్క నుంచి వచ్చింది 30 ప్లస్లోనే కావడం విశేషం. ఐతే ‘భాగమతి’ తర్వాత అనుష్క కొంత కాలం కనిపించకుండా పోయింది. గ్యాప్ తీసుకుని ‘నిశ్శబ్దం’ సినిమాలో నటించింది. దీని తర్వాత మరే చిత్రానికీ కమిట్మెంట్ ఇచ్చినట్లు అధికారిక సమాచారం అయితే బయటికి రాలేదు. మరి అనుష్క ఇంత స్లో ఎందుకైంది.. ఆమెకు ఆఫర్లు రావట్లేదా.. లేక తనే సినిమాలు వదులుకుందా అన్నది అభిమానులకు అర్థం కాలేదు.
ఐతే తన కొత్త చిత్రం ‘నిశ్శబ్దం’ అమేజాన్ ప్రైమ్లో డిజిటల్ రిలీజ్కు రెడీ అయిన నేపత్యంలో ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క తన కెరీర్లో వచ్చిన గ్యాప్ గురించి, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి మాట్లాడింది. వరుసగా భారీ చిత్రాలు చేయడంతో ‘భాగమతి’ పూర్తయ్యే సమయానికి బాగా అలసిపోయానని.. దీంతో విశ్రాంతి అవసరమని భావించే కొంత కాలం పాటు సినిమాలు చేయలేదని ఆమె తెలిపింది.
ఆ ఖాళీలో, ఆపై షూటింగుల్లేని గత ఆరు నెలల్లో సమయాన్ని ఎంతగానో ఆస్వాదించినట్లు అనుష్క తెలిపింది. ‘నిశ్శబ్దం’ అనుష్క చివరి సినిమా కావచ్చని, ఆమె రిటైర్ కాబోతోందని, వ్యక్తిగత జీవితంలో స్థిరపడబోతోందని కొంత ప్రచారం నడుస్తుండగా.. దాన్ని పరోక్షంగా ఖండించింది అనుష్క. తాను ఈ మధ్య కొత్తగా రెండు సినిమాలు సంతకం చేశానని చెప్పిన అనుష్క.. వాటి గురించి తన కన్నా వాటి నిర్మాతలు చెబితే బాగుంటుందని, కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాలని చెప్పింది.
This post was last modified on September 30, 2020 9:14 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…