నిన్న సాయంత్రం హైదరాబాద్ నోవాటెల్ లో తలెపెట్టిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం ఊహించని పరిమాణం. దాని తాలూకు బాధ తర్వాత వీడియో రిలీజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ మొహంలో స్పష్టంగా కనిపించగా, నిరాశగా వెనుదిరిగిన వేలాది అభిమానులు ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా తారక్ చేస్తున్న సినిమా జ్ఞాపకాన్ని ఇలా చేదుగా మారిపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఒక మేలుకొలుపుగా చూడాల్సిన అవసరం చాలా ఉంది. గరిష్టంగా 5 నుంచి 8 వేల మందికి మాత్రమే వసతి ఇవ్వగల చోట దేవర లాంటి ప్యాన్ ఇండియా మూవీ ఈవెంట్ ని ప్లాన్ చేయకుండా ఉండాల్సింది.
పాసులు పరిమితంగా ఇచ్చినా, లిమిట్ దాటించినా ఫ్యాన్స్ లెక్కకు మించి వస్తారనేది ఓపెన్ సీక్రెట్. గతంలోనూ ఇంత కన్నాభారీ వేడుకలు జరిగాయి. ప్రభాస్ ఈవెంట్లను రామోజీ ఫిలిం సిటీ, తిరుపతి లాంటి ప్రాంతాల్లో జరిపినప్పుడు చిన్న చిన్నవి మినహాయించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కానీ దేవర కేసు వేరు. అభిమానుల ఉద్వేగం పతాక స్థాయిలో ఉంది. అది ఎంత మోతాదులో ఉందనేది గుర్తించి ఉంటే అసలు నోవాటెల్ లో చేయాలనే ఆలోచనే వచ్చేది కాదు. పోనీ ఎల్బి స్టేడియం లాంటిది ఎంచుకున్నా బాగుండేదేమో కానీ వివిధ కారణాల వల్ల చిన్న స్టేజిని ఎంచుకోవడం దీనికి దారి తీసింది.
నాలుగు రోజుల్లో విడుదల ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఇంకో వేడుక సాధ్యపడదు. బియాండ్ ఫెస్ట్ లో స్క్రీనింగ్ కోసం తారక్ విదేశాలకు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక కష్టం. పోనీ ఇప్పటికిప్పుడు మళ్ళీ ప్లాన్ చేయాలన్నా విపరీతమైన ఒత్తిడి మధ్య జరిగే పని కాదు. రిలీజయ్యాక సక్సెస్ మీట్ లాంటిది పెడితే ఫ్యాన్స్ లో అసంతృప్తిని చల్లార్చగలం. అప్పుడు కూడా ఇన్ డోర్ కాకుండా ఏదైనా ఓపెన్ వెన్యూ ఎంచుకుంటే మంచిదనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు తప్పు నిర్మాతలు, ఈవెంట్ ఆర్గనైజర్స్ ది కాదు. ఊహించని స్థాయిలో పరిస్థితులు అలా తిరగబడినప్పుడు ఎవరైనా చేయగలిగింది ఏముంది.
This post was last modified on September 23, 2024 9:23 am
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…