నిన్న సాయంత్రం హైదరాబాద్ నోవాటెల్ లో తలెపెట్టిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం ఊహించని పరిమాణం. దాని తాలూకు బాధ తర్వాత వీడియో రిలీజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ మొహంలో స్పష్టంగా కనిపించగా, నిరాశగా వెనుదిరిగిన వేలాది అభిమానులు ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా తారక్ చేస్తున్న సినిమా జ్ఞాపకాన్ని ఇలా చేదుగా మారిపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఒక మేలుకొలుపుగా చూడాల్సిన అవసరం చాలా ఉంది. గరిష్టంగా 5 నుంచి 8 వేల మందికి మాత్రమే వసతి ఇవ్వగల చోట దేవర లాంటి ప్యాన్ ఇండియా మూవీ ఈవెంట్ ని ప్లాన్ చేయకుండా ఉండాల్సింది.
పాసులు పరిమితంగా ఇచ్చినా, లిమిట్ దాటించినా ఫ్యాన్స్ లెక్కకు మించి వస్తారనేది ఓపెన్ సీక్రెట్. గతంలోనూ ఇంత కన్నాభారీ వేడుకలు జరిగాయి. ప్రభాస్ ఈవెంట్లను రామోజీ ఫిలిం సిటీ, తిరుపతి లాంటి ప్రాంతాల్లో జరిపినప్పుడు చిన్న చిన్నవి మినహాయించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కానీ దేవర కేసు వేరు. అభిమానుల ఉద్వేగం పతాక స్థాయిలో ఉంది. అది ఎంత మోతాదులో ఉందనేది గుర్తించి ఉంటే అసలు నోవాటెల్ లో చేయాలనే ఆలోచనే వచ్చేది కాదు. పోనీ ఎల్బి స్టేడియం లాంటిది ఎంచుకున్నా బాగుండేదేమో కానీ వివిధ కారణాల వల్ల చిన్న స్టేజిని ఎంచుకోవడం దీనికి దారి తీసింది.
నాలుగు రోజుల్లో విడుదల ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఇంకో వేడుక సాధ్యపడదు. బియాండ్ ఫెస్ట్ లో స్క్రీనింగ్ కోసం తారక్ విదేశాలకు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక కష్టం. పోనీ ఇప్పటికిప్పుడు మళ్ళీ ప్లాన్ చేయాలన్నా విపరీతమైన ఒత్తిడి మధ్య జరిగే పని కాదు. రిలీజయ్యాక సక్సెస్ మీట్ లాంటిది పెడితే ఫ్యాన్స్ లో అసంతృప్తిని చల్లార్చగలం. అప్పుడు కూడా ఇన్ డోర్ కాకుండా ఏదైనా ఓపెన్ వెన్యూ ఎంచుకుంటే మంచిదనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు తప్పు నిర్మాతలు, ఈవెంట్ ఆర్గనైజర్స్ ది కాదు. ఊహించని స్థాయిలో పరిస్థితులు అలా తిరగబడినప్పుడు ఎవరైనా చేయగలిగింది ఏముంది.
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…