నిన్న సాయంత్రం హైదరాబాద్ నోవాటెల్ లో తలెపెట్టిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం ఊహించని పరిమాణం. దాని తాలూకు బాధ తర్వాత వీడియో రిలీజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ మొహంలో స్పష్టంగా కనిపించగా, నిరాశగా వెనుదిరిగిన వేలాది అభిమానులు ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా తారక్ చేస్తున్న సినిమా జ్ఞాపకాన్ని ఇలా చేదుగా మారిపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఒక మేలుకొలుపుగా చూడాల్సిన అవసరం చాలా ఉంది. గరిష్టంగా 5 నుంచి 8 వేల మందికి మాత్రమే వసతి ఇవ్వగల చోట దేవర లాంటి ప్యాన్ ఇండియా మూవీ ఈవెంట్ ని ప్లాన్ చేయకుండా ఉండాల్సింది.
పాసులు పరిమితంగా ఇచ్చినా, లిమిట్ దాటించినా ఫ్యాన్స్ లెక్కకు మించి వస్తారనేది ఓపెన్ సీక్రెట్. గతంలోనూ ఇంత కన్నాభారీ వేడుకలు జరిగాయి. ప్రభాస్ ఈవెంట్లను రామోజీ ఫిలిం సిటీ, తిరుపతి లాంటి ప్రాంతాల్లో జరిపినప్పుడు చిన్న చిన్నవి మినహాయించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కానీ దేవర కేసు వేరు. అభిమానుల ఉద్వేగం పతాక స్థాయిలో ఉంది. అది ఎంత మోతాదులో ఉందనేది గుర్తించి ఉంటే అసలు నోవాటెల్ లో చేయాలనే ఆలోచనే వచ్చేది కాదు. పోనీ ఎల్బి స్టేడియం లాంటిది ఎంచుకున్నా బాగుండేదేమో కానీ వివిధ కారణాల వల్ల చిన్న స్టేజిని ఎంచుకోవడం దీనికి దారి తీసింది.
నాలుగు రోజుల్లో విడుదల ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఇంకో వేడుక సాధ్యపడదు. బియాండ్ ఫెస్ట్ లో స్క్రీనింగ్ కోసం తారక్ విదేశాలకు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక కష్టం. పోనీ ఇప్పటికిప్పుడు మళ్ళీ ప్లాన్ చేయాలన్నా విపరీతమైన ఒత్తిడి మధ్య జరిగే పని కాదు. రిలీజయ్యాక సక్సెస్ మీట్ లాంటిది పెడితే ఫ్యాన్స్ లో అసంతృప్తిని చల్లార్చగలం. అప్పుడు కూడా ఇన్ డోర్ కాకుండా ఏదైనా ఓపెన్ వెన్యూ ఎంచుకుంటే మంచిదనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు తప్పు నిర్మాతలు, ఈవెంట్ ఆర్గనైజర్స్ ది కాదు. ఊహించని స్థాయిలో పరిస్థితులు అలా తిరగబడినప్పుడు ఎవరైనా చేయగలిగింది ఏముంది.
This post was last modified on September 23, 2024 9:23 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…