ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా అనిరుధ్ రవిచందర్ పేరు చెప్పేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇండియా లెవెల్లో కూడా అతడిది టాప్ రేంజే. ఇటు తమిళంలో, అటు తెలుగులో అతను భారీ చిత్రాలు చేస్తున్నాడు. ప్రతి సినిమాకూ మ్యూజిక్ పేలిపోతోంది. కొన్ని సినిమాల మ్యూజిక్ విషయం మిశ్రమ స్పందన వచ్చినా.. తన పాటులు అయితే వైరల్ అవుతూనే ఉన్నాయి. ‘దేవర’ విషయంలోనూ అదే జరిగింది.
ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘వేట్టయాన్’ నుంచి ఈ మధ్యే మనసిలాయో అంటూ ఓ పాట లాంచ్ చేస్తే అది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. రజినీకాంత్ అంటే అనిరుధ్కు ఎంత ప్రేమ అన్నది తన సంగీతంలో తెలుస్తుంది. అలాగే స్టేజ్ మీద కూడా తన ప్రేమను బలంగా చాటుతాడు.
రజినీ సినిమాల ఆడియో వేడుకల్లో అతను ఇచ్చే లైవ్ షోలు, రజినీ గురించి మాట్లాడే మాటలు చూస్తే మామ మీద తనది మామూలు ప్రేమ కాదు అనిపిస్తుంది. రజినీ భార్య లతకు సోదరుడి కొడుకే అనిరుధ్. ఐతే మామ అనే కాక నటుడిగా రజినీకి అనిరుధ్ వీరాభిమాని. ఆ విషయాన్ని ఎన్నోసార్లు చాటుకున్నాడు. మాటలతోనే కాక సంగీతంతోనూ అది చూపిస్తుంటాడు. ‘వేట్టయాన్’ ఆడియో వేడుకలో అనిరుధ్ సందడి మామూలుగా లేదు. పాటలతో హోరెత్తించడమే కాక.. స్పీచ్తోనూ అందరి దృష్టినీ ఆకర్షించాడు.
తాను బేసిగ్గా జాలీ టైప్ అని అందరికీ తెలుసని.. కానీ రజినీ సినిమాకు సంగీతం అందిస్తున్నపుడు, ఆయన సినిమాలు చూస్తున్నపుడు ఎమోషనల్ అయిపోతానని అనిరుధ్ చెప్పాడు. ‘జైలర్’ మూవీకి బ్యాగ్రౌండ్ స్కోర్ చేస్తున్నపుడు తాను కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పాడు. ఎప్పటికీ తాను సూపర్ స్టార్కు డైహార్డ్ ఫ్యాన్గానే ఉంటానని.. ఒక అభిమానిగానే ఆయన సినిమాలకు సంగీతం అందిస్తానని అన్నాడు. అనిరుధ్ మీద రజినీ సైతం ప్రత్యేక ప్రేమనే చాటుకున్నాడు ‘వేట్టయాన్’ ఆడియో వేడుకలో. ఈ చిత్రం అక్టోబరు 10న దసరా కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on September 22, 2024 12:22 am
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…