ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా అనిరుధ్ రవిచందర్ పేరు చెప్పేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇండియా లెవెల్లో కూడా అతడిది టాప్ రేంజే. ఇటు తమిళంలో, అటు తెలుగులో అతను భారీ చిత్రాలు చేస్తున్నాడు. ప్రతి సినిమాకూ మ్యూజిక్ పేలిపోతోంది. కొన్ని సినిమాల మ్యూజిక్ విషయం మిశ్రమ స్పందన వచ్చినా.. తన పాటులు అయితే వైరల్ అవుతూనే ఉన్నాయి. ‘దేవర’ విషయంలోనూ అదే జరిగింది.
ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘వేట్టయాన్’ నుంచి ఈ మధ్యే మనసిలాయో అంటూ ఓ పాట లాంచ్ చేస్తే అది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. రజినీకాంత్ అంటే అనిరుధ్కు ఎంత ప్రేమ అన్నది తన సంగీతంలో తెలుస్తుంది. అలాగే స్టేజ్ మీద కూడా తన ప్రేమను బలంగా చాటుతాడు.
రజినీ సినిమాల ఆడియో వేడుకల్లో అతను ఇచ్చే లైవ్ షోలు, రజినీ గురించి మాట్లాడే మాటలు చూస్తే మామ మీద తనది మామూలు ప్రేమ కాదు అనిపిస్తుంది. రజినీ భార్య లతకు సోదరుడి కొడుకే అనిరుధ్. ఐతే మామ అనే కాక నటుడిగా రజినీకి అనిరుధ్ వీరాభిమాని. ఆ విషయాన్ని ఎన్నోసార్లు చాటుకున్నాడు. మాటలతోనే కాక సంగీతంతోనూ అది చూపిస్తుంటాడు. ‘వేట్టయాన్’ ఆడియో వేడుకలో అనిరుధ్ సందడి మామూలుగా లేదు. పాటలతో హోరెత్తించడమే కాక.. స్పీచ్తోనూ అందరి దృష్టినీ ఆకర్షించాడు.
తాను బేసిగ్గా జాలీ టైప్ అని అందరికీ తెలుసని.. కానీ రజినీ సినిమాకు సంగీతం అందిస్తున్నపుడు, ఆయన సినిమాలు చూస్తున్నపుడు ఎమోషనల్ అయిపోతానని అనిరుధ్ చెప్పాడు. ‘జైలర్’ మూవీకి బ్యాగ్రౌండ్ స్కోర్ చేస్తున్నపుడు తాను కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పాడు. ఎప్పటికీ తాను సూపర్ స్టార్కు డైహార్డ్ ఫ్యాన్గానే ఉంటానని.. ఒక అభిమానిగానే ఆయన సినిమాలకు సంగీతం అందిస్తానని అన్నాడు. అనిరుధ్ మీద రజినీ సైతం ప్రత్యేక ప్రేమనే చాటుకున్నాడు ‘వేట్టయాన్’ ఆడియో వేడుకలో. ఈ చిత్రం అక్టోబరు 10న దసరా కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం విడుదల తేదీకి అఫీషియల్ ముద్ర పడిపోయింది. అక్టోబర్ 2…
హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ సమీప రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం…
అదేంటో గానీ… పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కు ఎటు వెళ్లినా విమర్శల జడివానే తప్పడం లేదు. సాధారణ…
ప్రస్తుత జెన్ జీ, జెన్ ఆల్ఫా వర్గానికి చెందిన యువతలానే నేనూ జెన్ జీని అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు…
డ్రాగన్ విడుదల ఇంకా సంవత్సరం ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కాలం భారంగా గడిచిపోతోంది. ఒకవేళ వార్ 2 బ్లాక్…
అమరావతిలోని ఉండవల్లిలో వైసీపీ నాయకుల పర్యటన ఉద్రిక్తతంగా మారింది. ఆ పర్యటనను రాజధాని రైతులు, టీడీపీ వర్గాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.…