2025 సంక్రాంతి రేసులో మహామహులు తలపడుతున్నారని బయ్యర్లు థియేటర్ల సర్దుబాటు గురించి ఇప్పటి నుంచే తలలు పట్టుకోవడం చూస్తున్నాం. చిరంజీవి విశ్వంభర, బాలయ్య 109, వెంకటేష్ – అనిల్ రావిపూడి, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ / విదాముయార్చిలు రావడంలో ఎలాంటి అనుమానాలు లేవు.
చివరి నిమిషంలో ఏదైనా అనూహ్యంగా జరిగితే తప్ప ఈ నాలుగు కన్ఫర్మ్ గా దిగుతున్నాయి. అయితే ఇక్కడితో స్టోరీ అయిపోలేదు. సందీప్ కిషన్ – దర్శకుడు నక్కిన త్రినాధరావు కలయికలో రూపొందుతున్న ఎంటర్ టైనర్ ని సైతం సంక్రాంతికే రిలీజ్ చేయాలని ఫిక్స్ కావడం కొత్త ట్విస్టు.
అంత కాంపిటీషన్ లో రిస్క్ చేయడం ఎందుకనే మతలబు ఆలోచిస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. మజాకా (రిజిస్టర్ చేసిన టైటిల్) కు ట్రేడ్ వర్గాల్లో క్రేజ్ ఉంది. రవితేజ ధమాకా తర్వాత త్రినాధరావు చేసిన మూవీ కావడంతో దానికి మించి ఎంటర్ టైనర్ అవుతుందనే నమ్మకం బయ్యర్లలో ఉంది.
దానికి తోడు ఓటిటి డీల్ సుమారు ఇరవై కోట్లకు పైగా ఆల్రెడీ అయిపోయిందట. అంటే బడ్జెట్ కన్నా ఎక్కువ రికవరీ డిజిటల్ అమ్మకంలోనే అయిపోయింది. థియేట్రికల్ హక్కుల కోసం ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుంటే సులభంగా డబుల్ ట్రిపుల్ మార్జిన్ తో నిర్మాతలు సేఫ్ సైడ్ అయిపోతారు.
అయితే పోటీలోనే ఎందుకు దిగాల్సి వచ్చిందంటే బహుశా ఓటిటి సంస్థకు సంబంధించిన షెడ్యూల్ ఫిబ్రవరి ప్రీమియర్ ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. దానికోసమైనా జనవరి థియేటర్ రిలీజ్ తప్పనిసరి. ఇంకోవైపు ఎంత అగ్ర హీరోలు బరిలో ఉన్నా సరే మీడియం సినిమాలు సక్సెస్ అయిన దాఖలాలు గతంలో ఉన్నాయి.
ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్రశాతకర్ణిలను తట్టుకుని శతమానంభవతి సూపర్ హిట్ అయ్యింది. గుంటూరు కారం, నా సామిరంగా, సైంధవ్ ని ఎదిరించి హనుమాన్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ నమ్మకంతోనే మజాకాని దించుతున్నారేమో. ఎల్లుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రానుంది.
This post was last modified on September 21, 2024 5:46 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…