ఊహించినదాని కన్నా ఎక్కువగా ఏపీలో దేవరకు టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇచ్చేశారు. ఆ మేరకు అధికారిక జిఓ విడుదల కావడంతో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నాగవంశీ తదితరులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్లు పెట్టారు.
ప్రతి టికెట్ పై సింగల్ స్క్రీన్లకు 110, మల్టీప్లెక్సులకు 135 రూపాయలు పెంచుకుని తొమ్మిది రోజుల పాటు అమలు చేసుకోవచ్చు. మొదటిరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచే షోలు వేసుకునే వెసులుబాటు ఇవ్వగా రెండో రోజు నుంచి రోజుకు 5 షోలు వేసుకునేలా పర్మిషన్లు వచ్చాయి. చెప్పాలంటే కల్కి 2898 ఏడి కంటే ఎక్కువ హైక్ రావడం గమనించాల్సిన విషయం.
సో రికార్డులకు గ్రౌండ్ సెట్ అయ్యింది. పాజిటివ్ టాక్ రావడం ఆలస్యం నెంబర్లు భారీగా ఉండబోతున్నాయి. మిడ్ నైట్ షోలు కాబట్టి తెల్లవారేలోపు సినిమా ఎలా ఉందనే దాని మీద మీడియా, సామజిక మాధ్యమాలు హోరెత్తిపోతాయి. ఏదైనా సరే నిమిషాల్లో వైరల్ కావడం ఖాయం.
దేవర టీమ్ నమ్మకానికి తగినట్టే డిస్ట్రిబ్యూటర్లు స్పెషల్ షోలను ప్లాన్ చేస్తున్నారు. అరవింద సమేత వీరరాఘవ తర్వాత సోలో హీరోగా తారక్ కి ఇంత గ్యాప్ రావడం కెరీర్ లోనే మొదటిసారి. పలు కేంద్రాల్లో ఊళ్ళో ఉన్న అన్ని స్క్రీన్లలో దేవరనే ప్రదర్శించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారంటే హైప్ అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు మిగిలింది ప్రేక్షకుల అంచనాలు అందుకోవడమే. గత డిజాస్టర్ నుంచి దర్శకుడు కొరటాల శివ పూర్తిగా కోలుకుని కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు. పాజిటివ్ వైబ్స్ చూపిస్తున్నారు. తిరుమల వెళ్లి ఏడుకొండల వాడి దర్శనం చేసుకున్నారు.
ఎలాంటి టెన్షన్ లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ త్వరగా పూర్తి చేసుకోవడంతో కంటెంట్ డెలివరీ వేగంగా జరిగిపోతోంది. ఓవర్సీస్ షోలలో ఒక్క క్షణం ఆలస్యం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ చూస్తూనే ఉన్నాం. తెలంగాణ జిఓ సైతం ఏ క్షణమైనా రావొచ్చు. ఎప్పుడు ఇచ్చే పెంపు తప్ప ప్రత్యేకంగా ఉండకపోవచ్చు.
This post was last modified on September 21, 2024 4:15 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…