నిశ్శబ్ధం చిత్రం ఓటిటి ద్వారా విడుదల అవడం అనుష్కకు అస్సలు ఇష్టం లేదట. తాను చేసిన సినిమాలను జనం మధ్య కూర్చుని థియేటర్లలో చూడడం అలవాటని, ఆ అనుభూతిని మిస్ అవడానికి అసలు మనసు రాలేదని అనుష్క చెప్పింది. ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయడానికి అనుష్క మొదట్లో అభ్యంతరం చెప్పిందనే వార్తలొచ్చాయి. ఇప్పుడు అనుష్క స్టేట్మెంట్ని బట్టి అది నిజమేననిపిస్తోంది. అయితే నిర్మాత శ్రేయస్సు కోరి వారికి ఇది లాభదాయకం అవుతుంది కనుక తప్పడం లేదని, నిశ్శబ్ధం చిత్రం కోసం నటిగా చాలా కష్టపడ్డానని అనుష్క చెప్పింది.
ఈ చిత్రంలో మూగ పాత్ర పోషించిన అనుష్క సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం రెండు నెలల పాటు శిక్షణ తీసుకుందట. సైన్ లాంగ్వేజ్ అంత ఈజీగా అర్థం కాలేదని, చాలా కష్టపడి నేర్చుకుని పాత్రకు న్యాయం చేసాననే భావిస్తున్నానని చెప్పింది. ఈ చిత్రంలో మాధవన్ క్యారెక్టర్ సర్ప్రైజ్ చేస్తుందని, అతనితో నటించడం ఎంజాయ్ చేసానని అనుష్క తెలియజేసింది. అలాగే ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రంలో సీతగా నటిస్తోందనే రూమర్లను అనుష్క కొట్టి పారేసింది. ఆ చిత్రం కోసం తననెవరూ సంప్రదించలేదని, కానీ ఆ చిత్రం తెరపై చూడాలని చాలా మందిలా తాను కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్టు చెప్పింది.
This post was last modified on September 30, 2020 1:34 am
అభిమానులు భయపడినట్టే జరిగేలా ఉంది. మే 9 హరిహర వీరమల్లు వస్తుందని గంపెడాశలతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి షాక్…
థియేటర్లలో జనాలు లేక అలో లక్ష్మణా అంటూ అల్లాడిపోతున్న బయ్యర్లకు ఊరట కలిగించేందుకు ఈ వారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు…
మెగాస్టార్ ఫాంటసీ మూవీ విశ్వంభర నుంచి ప్రమోషన్ పరంగా ఇప్పటిదాకా రెండు కంటెంట్స్ వచ్చాయి. మొదటిది టీజర్. దీనికొచ్సిన నెగటివిటీ…
మాములుగా సీనియర్ దర్శకులకు వరసగా డిజాస్టర్లు పడితే కంబ్యాక్ కావడం అంత సులభంగా ఉండదు. అసలు వాళ్ళ కథలు వినడానికే…
ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని…
ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి…