నిశ్శబ్ధం చిత్రం ఓటిటి ద్వారా విడుదల అవడం అనుష్కకు అస్సలు ఇష్టం లేదట. తాను చేసిన సినిమాలను జనం మధ్య కూర్చుని థియేటర్లలో చూడడం అలవాటని, ఆ అనుభూతిని మిస్ అవడానికి అసలు మనసు రాలేదని అనుష్క చెప్పింది. ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయడానికి అనుష్క మొదట్లో అభ్యంతరం చెప్పిందనే వార్తలొచ్చాయి. ఇప్పుడు అనుష్క స్టేట్మెంట్ని బట్టి అది నిజమేననిపిస్తోంది. అయితే నిర్మాత శ్రేయస్సు కోరి వారికి ఇది లాభదాయకం అవుతుంది కనుక తప్పడం లేదని, నిశ్శబ్ధం చిత్రం కోసం నటిగా చాలా కష్టపడ్డానని అనుష్క చెప్పింది.
ఈ చిత్రంలో మూగ పాత్ర పోషించిన అనుష్క సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం రెండు నెలల పాటు శిక్షణ తీసుకుందట. సైన్ లాంగ్వేజ్ అంత ఈజీగా అర్థం కాలేదని, చాలా కష్టపడి నేర్చుకుని పాత్రకు న్యాయం చేసాననే భావిస్తున్నానని చెప్పింది. ఈ చిత్రంలో మాధవన్ క్యారెక్టర్ సర్ప్రైజ్ చేస్తుందని, అతనితో నటించడం ఎంజాయ్ చేసానని అనుష్క తెలియజేసింది. అలాగే ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రంలో సీతగా నటిస్తోందనే రూమర్లను అనుష్క కొట్టి పారేసింది. ఆ చిత్రం కోసం తననెవరూ సంప్రదించలేదని, కానీ ఆ చిత్రం తెరపై చూడాలని చాలా మందిలా తాను కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్టు చెప్పింది.
This post was last modified on September 30, 2020 1:34 am
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…