నిశ్శబ్ధం చిత్రం ఓటిటి ద్వారా విడుదల అవడం అనుష్కకు అస్సలు ఇష్టం లేదట. తాను చేసిన సినిమాలను జనం మధ్య కూర్చుని థియేటర్లలో చూడడం అలవాటని, ఆ అనుభూతిని మిస్ అవడానికి అసలు మనసు రాలేదని అనుష్క చెప్పింది. ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయడానికి అనుష్క మొదట్లో అభ్యంతరం చెప్పిందనే వార్తలొచ్చాయి. ఇప్పుడు అనుష్క స్టేట్మెంట్ని బట్టి అది నిజమేననిపిస్తోంది. అయితే నిర్మాత శ్రేయస్సు కోరి వారికి ఇది లాభదాయకం అవుతుంది కనుక తప్పడం లేదని, నిశ్శబ్ధం చిత్రం కోసం నటిగా చాలా కష్టపడ్డానని అనుష్క చెప్పింది.
ఈ చిత్రంలో మూగ పాత్ర పోషించిన అనుష్క సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం రెండు నెలల పాటు శిక్షణ తీసుకుందట. సైన్ లాంగ్వేజ్ అంత ఈజీగా అర్థం కాలేదని, చాలా కష్టపడి నేర్చుకుని పాత్రకు న్యాయం చేసాననే భావిస్తున్నానని చెప్పింది. ఈ చిత్రంలో మాధవన్ క్యారెక్టర్ సర్ప్రైజ్ చేస్తుందని, అతనితో నటించడం ఎంజాయ్ చేసానని అనుష్క తెలియజేసింది. అలాగే ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రంలో సీతగా నటిస్తోందనే రూమర్లను అనుష్క కొట్టి పారేసింది. ఆ చిత్రం కోసం తననెవరూ సంప్రదించలేదని, కానీ ఆ చిత్రం తెరపై చూడాలని చాలా మందిలా తాను కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్టు చెప్పింది.
This post was last modified on September 30, 2020 1:34 am
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…