దసరా తర్వాత వంద కోట్ల గ్రాస్ సాధించిన నాని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సరిపోదా శనివారం ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంటే 25 అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి వచ్చేస్తుంది.
థియేటర్ రిలీజైన సరిగ్గా ఇరవై ఎనిమిది రోజుల (నాలుగు వారాలు) కు ఇంత పెద్ద హిట్ మూవీ స్మార్ట్ స్క్రీన్ పైకి రావడం విశేషమే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాకు జేక్స్ బెజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఓటిటి, థియేటర్ మధ్య గ్యాప్ గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న టైంలోనే ఇలా కొత్త సినిమాలు వచ్చేస్తుండటం గమనార్హం. అయితే ఇవి షూటింగ్ టైంలోనే చేసుకున్న అగ్రిమెంట్లు కాబట్టి ఇప్పటికిప్పుడు మార్చలేరు కానీ భవిష్యత్తులో రాబోయే కొత్త సినిమాలకు ఏమైనా మార్పులు తీసుకొస్తారేమో చూడాలి.
సలార్, గుంటూరు కారం, టిల్లు స్క్వేర్ లాంటివన్నీ ఇలా 28 రోజులకే డిజిటల్ లో రాగా హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ రెండు నెలల తర్వాత గాని ఓటిటిలో దర్శనం కాలేదు. హిందీలో ఖచ్చితంగా ఎనిమిది వారాల నిబంధన పాటించేలా మల్టీప్లెక్సులు చేసిన ఒత్తిడి అక్కడ మంచి ఫలితాలు ఇచ్చింది.
ఇక సరిపోదా శనివారంకు నెట్ ఫ్లిక్స్ లో మిలియన్ల వ్యూస్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలుగులో భారీగా తమిళంలో చెప్పుకోదగ్గ రెవిన్యూ తెచ్చిన ఈ సినిమాకు హిందీలో ఆదరణ దక్కలేదు. స్త్రీ 2 తాకిడిలో నిలవలేకపోయింది.
అక్కడి ప్రేక్షకులు ఖచ్చితంగా ఓటిటిలో లుక్ వేస్తారు. ముఖ్యంగా నాని, ఎస్జె సూర్యల మధ్య జరిగే క్లాష్ కు మంచి స్పందన ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గత సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా వ్యూస్ సాధించిన తెలుగు సినిమాల్లో హాయ్ నాన్న టాప్ 1గా ఉంది. దసరా సైతం టాప్ 10లో చోటు దక్కించుకుంది. అందుకే నాని సినిమాల మీద ఈ సంస్థకు భారీ నమ్మకం.
This post was last modified on September 21, 2024 11:20 am
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…