దసరా తర్వాత వంద కోట్ల గ్రాస్ సాధించిన నాని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సరిపోదా శనివారం ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంటే 25 అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి వచ్చేస్తుంది.
థియేటర్ రిలీజైన సరిగ్గా ఇరవై ఎనిమిది రోజుల (నాలుగు వారాలు) కు ఇంత పెద్ద హిట్ మూవీ స్మార్ట్ స్క్రీన్ పైకి రావడం విశేషమే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాకు జేక్స్ బెజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఓటిటి, థియేటర్ మధ్య గ్యాప్ గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న టైంలోనే ఇలా కొత్త సినిమాలు వచ్చేస్తుండటం గమనార్హం. అయితే ఇవి షూటింగ్ టైంలోనే చేసుకున్న అగ్రిమెంట్లు కాబట్టి ఇప్పటికిప్పుడు మార్చలేరు కానీ భవిష్యత్తులో రాబోయే కొత్త సినిమాలకు ఏమైనా మార్పులు తీసుకొస్తారేమో చూడాలి.
సలార్, గుంటూరు కారం, టిల్లు స్క్వేర్ లాంటివన్నీ ఇలా 28 రోజులకే డిజిటల్ లో రాగా హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ రెండు నెలల తర్వాత గాని ఓటిటిలో దర్శనం కాలేదు. హిందీలో ఖచ్చితంగా ఎనిమిది వారాల నిబంధన పాటించేలా మల్టీప్లెక్సులు చేసిన ఒత్తిడి అక్కడ మంచి ఫలితాలు ఇచ్చింది.
ఇక సరిపోదా శనివారంకు నెట్ ఫ్లిక్స్ లో మిలియన్ల వ్యూస్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలుగులో భారీగా తమిళంలో చెప్పుకోదగ్గ రెవిన్యూ తెచ్చిన ఈ సినిమాకు హిందీలో ఆదరణ దక్కలేదు. స్త్రీ 2 తాకిడిలో నిలవలేకపోయింది.
అక్కడి ప్రేక్షకులు ఖచ్చితంగా ఓటిటిలో లుక్ వేస్తారు. ముఖ్యంగా నాని, ఎస్జె సూర్యల మధ్య జరిగే క్లాష్ కు మంచి స్పందన ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గత సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా వ్యూస్ సాధించిన తెలుగు సినిమాల్లో హాయ్ నాన్న టాప్ 1గా ఉంది. దసరా సైతం టాప్ 10లో చోటు దక్కించుకుంది. అందుకే నాని సినిమాల మీద ఈ సంస్థకు భారీ నమ్మకం.
This post was last modified on September 21, 2024 11:20 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…