సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జైభీమ్ దర్శకుడు టీజె జ్ఞానవేల్ రూపొందించిన వెట్టయన్ అక్టోబర్ 10 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇరవై రోజుల ముందే తమిళంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో రజని యమా హుషారుగా కనిపించారు. అనిరుద్ రవిచందర్ తో కలిసి మనసిలాయో పాటకు డాన్స్ చేయడం వైరలయ్యింది. ప్రీవ్యూ పేరుతో చిన్న టీజర్ రిలీజ్ చేశారు. అమితాబ్, రానా, మంజు వారియర్, ఫాహద్ ఫాసిల్ పాత్రలకు సంబంధించిన లుక్స్ వీడియోలో పొందుపరిచారు. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఇక అసలు టాపిక్ కు వద్దాం.
క్యామియో కాబట్టి లాల్ సలామ్ మినహాయిస్తే జైలర్ తర్వాత రజని చేస్తున్న మూవీగా వెట్టయన్ మీద విపరీతమైన అంచనాలున్నాయి. దాన్ని మించిన హీరోయిజం, ఎలివేషన్లు ఉంటాయని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. నిజానికి ఈ పోలిక చాలా ప్రమాదం. ఎందుకంటే జ్ఞానవేల్ కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక నిజజీవిత ఎన్ కౌంటర్ ఆధారంగా ఈ కథను రాసుకున్నాడు. నలుగురు పోలీస్ ఆఫీసర్లు ఘోరమైన నేరాలు చేసిన వాళ్ళను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తుంటారు. దీంతో సీరియసైన ప్రభుత్వం ఒక కమిటీ వేసి విచారణకు పిలుస్తుంది. ఈ క్రమంలో జరిగే సంఘటనలే వెట్టయన్ కు మూలం.
గతంలో షూటవుట్ అట్ లోఖండ్ వాలా అనే బాలీవుడ్ మూవీ వచ్చింది. ఇప్పుడీ వెట్టయన్ లో దాని షేడ్స్ ఉంటాయని ఇన్ సైడ్ టాక్. వెంకటేష్ ఘర్షణ ఛాయలను కూడా చూడొచ్చని అంటున్నారు. బాషా, నరసింహ, జైలర్ రేంజ్ లో ఏదేదో ఊహించుకోకుండా వస్తే వెట్టయన్ ఆశ్చర్యపరుస్తాడని యూనిట్ అంటోంది. నిన్న రజని తన ప్రసంగంలో చూచాయగా ఇదే చెప్పారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతున్న వెట్టయన్ లో మరోసారి రజని పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. కాకపోతే రిటైర్ అయినట్టు కాకుండా మధ్య వయసుకొచ్చిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా చూపించబోతున్నారు.
This post was last modified on September 21, 2024 10:18 am
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…