ఎల్లుండి జరగబోయే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో చేస్తున్నది కాకపోయినా వీలైనంత మేరకు ఫ్యాన్స్ ని అనుమతిస్తూనే లైవ్ లో చూసే అవకాశం ఇతర మాధ్యమాల ద్వారా ఇస్తున్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ తదితరులు పంచుకునే విశేషాల కోసం వెయిట్ చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, ప్రశాంత్ నీల్ హాజరుకాబోతున్నారు. దేవర కెప్టెన్ గా కొరటాల శివ ఎలాగూ ఉంటారు. తారక్ గురించి వీళ్ళిచ్చే ఎలివేషన్, ఎమోషన్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.
నిజానికి మహేష్ బాబు లేదా అల్లు అర్జున్ ఎవరో ఒకరు దేవర వేడుకకు రావొచ్చనే ప్రచారం ముందు జరిగింది. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇలాంటి స్టార్ అతిథులు లేకపోవడమే కరెక్ట్. ఎందుకంటే ఒకవేళ మహేష్ వస్తే అటెన్షన్ మొత్తం తన లుక్స్ పైకి వెళ్తుంది. ఎస్ఎస్ఎంబి 29 కోసం పూర్తిగా మేకోవరైన సూపర్ స్టార్ అంత సేపు పబ్లిక్ స్టేజి మీద కనిపిస్తే మీడియా కవరేజ్ సగం దాని మీదే వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఇక బన్నీ వస్తే పుష్ప 2 గురించి ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది. ఎంత బావా అని పిలుచుకునే చనువు ఉన్నా అల్లు అర్జున్ ఉన్న బిజీ, సోషల్ మీడియాలో ఏర్పడుతున్న అభిప్రాయాల దృష్ట్యా దూరం ఉండటం మంచిది.
సో తారక్ తో పని చేసిన పని చేయబోతున్న స్టార్ డైరెక్టర్లను తీసుకురావడమే సరైన నిర్ణయం. ఆదివారం కావడంతో ఈవెంట్ కు సంబంధించిన ఆన్ లైన్ రీచ్ ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ 27 ఎంతో దూరంలో లేదు. ఆరు రోజులు గడిచిపోతే గురువారం అర్ధరాత్రి నుంచే ప్రీమియర్లు మొదలవుతాయి. అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఆరేళ్ళ గ్యాప్ తో జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన ప్యాన్ ఇండియా మూవీ కావడంతో ఫ్యాన్స్ హంగామా ఈసారి మాములుగా ఉండబోదు. పాత సినిమాల రీ రిలీజులకే ఓ రేంజ్ హడావిడి చేస్తున్న ట్రెండ్ లో దేవరకు జరగబోయే రచ్చ ఊహాకందడం కష్టమే.
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…