ఎల్లుండి జరగబోయే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో చేస్తున్నది కాకపోయినా వీలైనంత మేరకు ఫ్యాన్స్ ని అనుమతిస్తూనే లైవ్ లో చూసే అవకాశం ఇతర మాధ్యమాల ద్వారా ఇస్తున్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ తదితరులు పంచుకునే విశేషాల కోసం వెయిట్ చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, ప్రశాంత్ నీల్ హాజరుకాబోతున్నారు. దేవర కెప్టెన్ గా కొరటాల శివ ఎలాగూ ఉంటారు. తారక్ గురించి వీళ్ళిచ్చే ఎలివేషన్, ఎమోషన్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.
నిజానికి మహేష్ బాబు లేదా అల్లు అర్జున్ ఎవరో ఒకరు దేవర వేడుకకు రావొచ్చనే ప్రచారం ముందు జరిగింది. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇలాంటి స్టార్ అతిథులు లేకపోవడమే కరెక్ట్. ఎందుకంటే ఒకవేళ మహేష్ వస్తే అటెన్షన్ మొత్తం తన లుక్స్ పైకి వెళ్తుంది. ఎస్ఎస్ఎంబి 29 కోసం పూర్తిగా మేకోవరైన సూపర్ స్టార్ అంత సేపు పబ్లిక్ స్టేజి మీద కనిపిస్తే మీడియా కవరేజ్ సగం దాని మీదే వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఇక బన్నీ వస్తే పుష్ప 2 గురించి ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది. ఎంత బావా అని పిలుచుకునే చనువు ఉన్నా అల్లు అర్జున్ ఉన్న బిజీ, సోషల్ మీడియాలో ఏర్పడుతున్న అభిప్రాయాల దృష్ట్యా దూరం ఉండటం మంచిది.
సో తారక్ తో పని చేసిన పని చేయబోతున్న స్టార్ డైరెక్టర్లను తీసుకురావడమే సరైన నిర్ణయం. ఆదివారం కావడంతో ఈవెంట్ కు సంబంధించిన ఆన్ లైన్ రీచ్ ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ 27 ఎంతో దూరంలో లేదు. ఆరు రోజులు గడిచిపోతే గురువారం అర్ధరాత్రి నుంచే ప్రీమియర్లు మొదలవుతాయి. అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఆరేళ్ళ గ్యాప్ తో జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన ప్యాన్ ఇండియా మూవీ కావడంతో ఫ్యాన్స్ హంగామా ఈసారి మాములుగా ఉండబోదు. పాత సినిమాల రీ రిలీజులకే ఓ రేంజ్ హడావిడి చేస్తున్న ట్రెండ్ లో దేవరకు జరగబోయే రచ్చ ఊహాకందడం కష్టమే.
This post was last modified on September 20, 2024 12:30 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…