ఎల్లుండి జరగబోయే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో చేస్తున్నది కాకపోయినా వీలైనంత మేరకు ఫ్యాన్స్ ని అనుమతిస్తూనే లైవ్ లో చూసే అవకాశం ఇతర మాధ్యమాల ద్వారా ఇస్తున్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ తదితరులు పంచుకునే విశేషాల కోసం వెయిట్ చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, ప్రశాంత్ నీల్ హాజరుకాబోతున్నారు. దేవర కెప్టెన్ గా కొరటాల శివ ఎలాగూ ఉంటారు. తారక్ గురించి వీళ్ళిచ్చే ఎలివేషన్, ఎమోషన్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.
నిజానికి మహేష్ బాబు లేదా అల్లు అర్జున్ ఎవరో ఒకరు దేవర వేడుకకు రావొచ్చనే ప్రచారం ముందు జరిగింది. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇలాంటి స్టార్ అతిథులు లేకపోవడమే కరెక్ట్. ఎందుకంటే ఒకవేళ మహేష్ వస్తే అటెన్షన్ మొత్తం తన లుక్స్ పైకి వెళ్తుంది. ఎస్ఎస్ఎంబి 29 కోసం పూర్తిగా మేకోవరైన సూపర్ స్టార్ అంత సేపు పబ్లిక్ స్టేజి మీద కనిపిస్తే మీడియా కవరేజ్ సగం దాని మీదే వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఇక బన్నీ వస్తే పుష్ప 2 గురించి ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది. ఎంత బావా అని పిలుచుకునే చనువు ఉన్నా అల్లు అర్జున్ ఉన్న బిజీ, సోషల్ మీడియాలో ఏర్పడుతున్న అభిప్రాయాల దృష్ట్యా దూరం ఉండటం మంచిది.
సో తారక్ తో పని చేసిన పని చేయబోతున్న స్టార్ డైరెక్టర్లను తీసుకురావడమే సరైన నిర్ణయం. ఆదివారం కావడంతో ఈవెంట్ కు సంబంధించిన ఆన్ లైన్ రీచ్ ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ 27 ఎంతో దూరంలో లేదు. ఆరు రోజులు గడిచిపోతే గురువారం అర్ధరాత్రి నుంచే ప్రీమియర్లు మొదలవుతాయి. అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఆరేళ్ళ గ్యాప్ తో జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన ప్యాన్ ఇండియా మూవీ కావడంతో ఫ్యాన్స్ హంగామా ఈసారి మాములుగా ఉండబోదు. పాత సినిమాల రీ రిలీజులకే ఓ రేంజ్ హడావిడి చేస్తున్న ట్రెండ్ లో దేవరకు జరగబోయే రచ్చ ఊహాకందడం కష్టమే.
This post was last modified on September 20, 2024 12:30 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…