ఎప్పుడో బిచ్చగాడుతో బ్లాక్ బస్టర్ కొట్టిన విజయ్ ఆంటోనీ ఆ తర్వాత మళ్ళీ హిట్టు మొహం చూసింది దాని సీక్వెల్ బిచ్చగాడు 2తోనే. అది కూడా కమర్షియల్ గా సక్సెస్ అనిపించుకుంది తప్పించి మొదటి భాగం లాగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీనికి ముందు వెనుకా ఇతనివి ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. మొన్న తుఫాన్ అంటూ పలకరించాడు. అదొకటి థియేటర్లలో ఉందనే సంగతి గుర్తించేలోపే మాయమైపోయింది. ఓటిటిలో వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. దానికి ముందు హత్యది ఇదే పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు ఉంది.
ఇప్పుడు సెప్టెంబర్ 27 హిట్లర్ గా రాబోతున్నాడు. విశేషం ఏంటంటే దేవర లాంటి ప్యాన్ ఇండియా మూవీతో తలపడేందుకు సిద్ధపడటం. ఆ రోజు క్లాష్ ఎందుకనే ఉద్దేశంతోనే కార్తీ సత్యం సుందరం ఒక రోజు ఆలస్యంగా సెప్టెంబర్ 28న తెలుగు డబ్బింగ్ వస్తోంది. కానీ హిట్లర్ మాత్రం ఫేస్ టు ఫేస్ దేవరని సవాల్ చేస్తోంది. నిజానికి విజయ్ ఆంటోనీ టార్గెట్ ఇప్పుడు టాలీవుడ్ కాదు. తమిళంలో కార్తీ ఒకడే పోటీ ఉన్నాడు కాబట్టి తన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వర్కౌట్ చేసుకోవచ్చనే ఉద్దేశం. పైగా దసరాకి రజినీకాంత్ వెట్టయన్ బరిలో ఉంది కాబట్టి ఆలోపే థియేటర్ రన్ ముగించేసుకుని బయటపడాలి.
ఒక విషయంలో విజయ్ ఆంటోనీని మెచ్చుకోవాలి. ఎన్ని ఫ్లాపులు వస్తున్నా ఘజిని మొహమ్మద్ లాగా దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు. హైదరాబాద్ వచ్చి మరీ ప్రత్యేకంగా ప్రమోషన్లలో పాల్గొంటూనే ఉన్నాడు. పెర్ఫార్మన్స్ పరంగా తన మీద కొన్ని కామెంట్స్ ఉన్నప్పటికి రెగ్యులర్ ఫార్ములాకు భిన్నంగా ఏదో ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు రిలీజవుతున్న హిట్లర్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. ట్రైలర్ కొంచెం ఆసక్తికరంగానే ఉంది. చాలా కాలం తర్వాత ప్రతిఘటన ఫేమ్ చరణ్ రాజ్ ఫుల్ లెన్త్ విలన్ రోల్ పోషించాడు. చిరంజీవి టైటిల్ వాడుకున్నాడు మరి ఫలితం అలాగే వస్తుందేమో చూడాలి.
This post was last modified on September 19, 2024 6:36 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…