నేనే రాజు నేనే మంత్రి లాంటి సక్సెస్ ఫుల్ కాంబోని రిపీట్ చేయాలనే ఉద్దేశంతో రానా దగ్గుబాటి, దర్శకుడు తేజ కొన్ని నెలల క్రితం రాక్షసరాజుని ప్రకటించిన సంగతి తెలిసిందే. అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది కానీ ఆ తర్వాత ఎక్కడ షూటింగ్ వెళ్లిన దాఖలాలు కనిపించలేదు. టైటిల్ బాగుంది. మరోసారి పొలిటికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను ఎంటర్ టైనర్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో ఎలాంటి అప్డేట్ లేకపోవడం నిరాశ కలిగించింది. పైకి చెప్పలేదు కానీ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని, తేజ కొడుకుని లాంచ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడనేది ఓపెన్ సీక్రెట్.
ఇక అసలు విషయానికి వస్తే రాక్షసరాజు కథని విపరీతంగా ఇష్టపడ్డ రానా దాని కథను మాత్రమే తేజ నుంచి తీసుకుని వేరే డెబ్యూ డైరెక్టర్ తో తీయించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. పేరు తదితర వివరాలు బయటికి రాలేదు కానీ స్క్రిప్ట్ పనులు అయితే జరుగుతున్నాయట. నిర్మాతగా అభిరుచిని చాటుకుంటున్న రానా తాను హీరోగా నటించబోయే వాటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దానికి అనుగుణంగానే తేజతో డ్రాప్ అయ్యాడనే టాక్ ఉంది. అహింస రూపంలో తమ్ముడు అభిరాంకు కనీసం డీసెంట్ గా చెప్పుకునే సినిమా కాకుండా డిజాస్టర్ ఇవ్వడం ఒక కారణం కావొచ్చు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత సమయం పడుతుంది. దుర్మార్గులు రాజకీయాల్లోకి రావడం సహజమే కానీ రాక్షస ఆలోచనలున్న వ్యక్తి వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో రూపొందిన రాక్షసరాజు స్టోరీ పరంగా బాగుందని యూనిట్ లీక్. రానా ప్రస్తుతం వెట్టయన్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో మొదటిసారి తెరను పంచుకున్న అనుభూతిని అక్టోబర్ 10 దక్కించుకోబోతున్నాడు. నాని వద్దనుకున్న క్యారెక్టరనే టాక్ ముందు నుంచీ ఉంది. ఆ కోణంలో కూడా ఆసక్తి నెలకొంది. అమితాబ్, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్ ఇతర తారాగణం.
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…