నేనే రాజు నేనే మంత్రి లాంటి సక్సెస్ ఫుల్ కాంబోని రిపీట్ చేయాలనే ఉద్దేశంతో రానా దగ్గుబాటి, దర్శకుడు తేజ కొన్ని నెలల క్రితం రాక్షసరాజుని ప్రకటించిన సంగతి తెలిసిందే. అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది కానీ ఆ తర్వాత ఎక్కడ షూటింగ్ వెళ్లిన దాఖలాలు కనిపించలేదు. టైటిల్ బాగుంది. మరోసారి పొలిటికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను ఎంటర్ టైనర్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో ఎలాంటి అప్డేట్ లేకపోవడం నిరాశ కలిగించింది. పైకి చెప్పలేదు కానీ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని, తేజ కొడుకుని లాంచ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడనేది ఓపెన్ సీక్రెట్.
ఇక అసలు విషయానికి వస్తే రాక్షసరాజు కథని విపరీతంగా ఇష్టపడ్డ రానా దాని కథను మాత్రమే తేజ నుంచి తీసుకుని వేరే డెబ్యూ డైరెక్టర్ తో తీయించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. పేరు తదితర వివరాలు బయటికి రాలేదు కానీ స్క్రిప్ట్ పనులు అయితే జరుగుతున్నాయట. నిర్మాతగా అభిరుచిని చాటుకుంటున్న రానా తాను హీరోగా నటించబోయే వాటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దానికి అనుగుణంగానే తేజతో డ్రాప్ అయ్యాడనే టాక్ ఉంది. అహింస రూపంలో తమ్ముడు అభిరాంకు కనీసం డీసెంట్ గా చెప్పుకునే సినిమా కాకుండా డిజాస్టర్ ఇవ్వడం ఒక కారణం కావొచ్చు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత సమయం పడుతుంది. దుర్మార్గులు రాజకీయాల్లోకి రావడం సహజమే కానీ రాక్షస ఆలోచనలున్న వ్యక్తి వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో రూపొందిన రాక్షసరాజు స్టోరీ పరంగా బాగుందని యూనిట్ లీక్. రానా ప్రస్తుతం వెట్టయన్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో మొదటిసారి తెరను పంచుకున్న అనుభూతిని అక్టోబర్ 10 దక్కించుకోబోతున్నాడు. నాని వద్దనుకున్న క్యారెక్టరనే టాక్ ముందు నుంచీ ఉంది. ఆ కోణంలో కూడా ఆసక్తి నెలకొంది. అమితాబ్, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్ ఇతర తారాగణం.
This post was last modified on September 19, 2024 6:26 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…