నేనే రాజు నేనే మంత్రి లాంటి సక్సెస్ ఫుల్ కాంబోని రిపీట్ చేయాలనే ఉద్దేశంతో రానా దగ్గుబాటి, దర్శకుడు తేజ కొన్ని నెలల క్రితం రాక్షసరాజుని ప్రకటించిన సంగతి తెలిసిందే. అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది కానీ ఆ తర్వాత ఎక్కడ షూటింగ్ వెళ్లిన దాఖలాలు కనిపించలేదు. టైటిల్ బాగుంది. మరోసారి పొలిటికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను ఎంటర్ టైనర్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో ఎలాంటి అప్డేట్ లేకపోవడం నిరాశ కలిగించింది. పైకి చెప్పలేదు కానీ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని, తేజ కొడుకుని లాంచ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడనేది ఓపెన్ సీక్రెట్.
ఇక అసలు విషయానికి వస్తే రాక్షసరాజు కథని విపరీతంగా ఇష్టపడ్డ రానా దాని కథను మాత్రమే తేజ నుంచి తీసుకుని వేరే డెబ్యూ డైరెక్టర్ తో తీయించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. పేరు తదితర వివరాలు బయటికి రాలేదు కానీ స్క్రిప్ట్ పనులు అయితే జరుగుతున్నాయట. నిర్మాతగా అభిరుచిని చాటుకుంటున్న రానా తాను హీరోగా నటించబోయే వాటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దానికి అనుగుణంగానే తేజతో డ్రాప్ అయ్యాడనే టాక్ ఉంది. అహింస రూపంలో తమ్ముడు అభిరాంకు కనీసం డీసెంట్ గా చెప్పుకునే సినిమా కాకుండా డిజాస్టర్ ఇవ్వడం ఒక కారణం కావొచ్చు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత సమయం పడుతుంది. దుర్మార్గులు రాజకీయాల్లోకి రావడం సహజమే కానీ రాక్షస ఆలోచనలున్న వ్యక్తి వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో రూపొందిన రాక్షసరాజు స్టోరీ పరంగా బాగుందని యూనిట్ లీక్. రానా ప్రస్తుతం వెట్టయన్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో మొదటిసారి తెరను పంచుకున్న అనుభూతిని అక్టోబర్ 10 దక్కించుకోబోతున్నాడు. నాని వద్దనుకున్న క్యారెక్టరనే టాక్ ముందు నుంచీ ఉంది. ఆ కోణంలో కూడా ఆసక్తి నెలకొంది. అమితాబ్, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్ ఇతర తారాగణం.
This post was last modified on September 19, 2024 6:26 pm
కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…
మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…
భారత్-పాకిస్థాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా యుద్ధానికి దారితీయొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతు న్న సమయంలో…