గత రెండు దశాబ్దాల్లో తెలుగులో అత్యధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా దిల్ రాజే నిలుస్తారేమో. దిల్ లాంటి హిట్ మూవీతో నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టిన రాజు.. ఎక్కడా వెనుదిరిగి చూసుకున్నది లేదు. ఎన్నో బ్లాక్బస్టర్లు, క్లాసిక్లతో నిర్మాతగా తిరుగులేని స్థాయిని అందుకున్నారు. అప్పుడప్పుడూ కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నారు. ఓ వైపు భారీ చిత్రాలను నిర్మిస్తూనే ఆయన అప్పుడప్పుడూ కొత్త కాంబినేషన్లలో కొన్ని చిన్న సినిమాలు నిర్మిస్తుంటారు. ఈ కోవలోనే రాజు నుంచి ఒక ఆశ్చర్యకర చిత్రం వస్తోంది. ఆ సినిమా పేరు.. షాదీ ముబారక్.
మొగలి రేకులు సీరియల్తో సూపర్ పాపులారిటీ సంపాదించి.. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో హీరో ఫ్రెండుగా కనిపించి.. ఆ తర్వాత సిద్దార్థ అనే సినిమా కూడా చేసిన ఆర్కే నాయుడు అలియాస్ సాగర్ ఈ చిత్రంలో కథానాయకకుడగా నటిస్తుండటం విశేషం. మలయాళీ అమ్మాయి దృశ్య రఘునాథ్ ఈ చిత్రంతో కథానాయికగా పరిచయం కానుంది. పద్మశ్రీ అనే కొత్త లేడీ డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించింది. సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చగా శ్రీకాంత్ నరోజ్ ఛాయాగ్రాహకుడు. మొత్తంగా ఈ టీంను చూస్తే ఎవరూ పేరు లేని వాళ్లే. చాలా వరకు కొత్తవాళ్లే. ఈ టీంను నమ్మి దిల్ రాజు లాంటి నిర్మాత సినిమాను నిర్మించాడంటే విశేషమే. బుధవారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతోంది. దీని రేంజ్ చూస్తే ఓటీటీ రిలీజ్ టార్గెట్ చేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on September 29, 2020 9:38 pm
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యవహారం చూస్తుంటే...…
సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో…
గేమ్ ఛేంజర్ పాటల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ఒక కంపోజర్ గా తాను పాతిక నుంచి ముప్పై…
టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా...…
నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే…
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్…