గత రెండు దశాబ్దాల్లో తెలుగులో అత్యధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా దిల్ రాజే నిలుస్తారేమో. దిల్ లాంటి హిట్ మూవీతో నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టిన రాజు.. ఎక్కడా వెనుదిరిగి చూసుకున్నది లేదు. ఎన్నో బ్లాక్బస్టర్లు, క్లాసిక్లతో నిర్మాతగా తిరుగులేని స్థాయిని అందుకున్నారు. అప్పుడప్పుడూ కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నారు. ఓ వైపు భారీ చిత్రాలను నిర్మిస్తూనే ఆయన అప్పుడప్పుడూ కొత్త కాంబినేషన్లలో కొన్ని చిన్న సినిమాలు నిర్మిస్తుంటారు. ఈ కోవలోనే రాజు నుంచి ఒక ఆశ్చర్యకర చిత్రం వస్తోంది. ఆ సినిమా పేరు.. షాదీ ముబారక్.
మొగలి రేకులు సీరియల్తో సూపర్ పాపులారిటీ సంపాదించి.. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో హీరో ఫ్రెండుగా కనిపించి.. ఆ తర్వాత సిద్దార్థ అనే సినిమా కూడా చేసిన ఆర్కే నాయుడు అలియాస్ సాగర్ ఈ చిత్రంలో కథానాయకకుడగా నటిస్తుండటం విశేషం. మలయాళీ అమ్మాయి దృశ్య రఘునాథ్ ఈ చిత్రంతో కథానాయికగా పరిచయం కానుంది. పద్మశ్రీ అనే కొత్త లేడీ డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించింది. సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చగా శ్రీకాంత్ నరోజ్ ఛాయాగ్రాహకుడు. మొత్తంగా ఈ టీంను చూస్తే ఎవరూ పేరు లేని వాళ్లే. చాలా వరకు కొత్తవాళ్లే. ఈ టీంను నమ్మి దిల్ రాజు లాంటి నిర్మాత సినిమాను నిర్మించాడంటే విశేషమే. బుధవారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతోంది. దీని రేంజ్ చూస్తే ఓటీటీ రిలీజ్ టార్గెట్ చేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on September 29, 2020 9:38 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…