గత రెండు దశాబ్దాల్లో తెలుగులో అత్యధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా దిల్ రాజే నిలుస్తారేమో. దిల్ లాంటి హిట్ మూవీతో నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టిన రాజు.. ఎక్కడా వెనుదిరిగి చూసుకున్నది లేదు. ఎన్నో బ్లాక్బస్టర్లు, క్లాసిక్లతో నిర్మాతగా తిరుగులేని స్థాయిని అందుకున్నారు. అప్పుడప్పుడూ కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నారు. ఓ వైపు భారీ చిత్రాలను నిర్మిస్తూనే ఆయన అప్పుడప్పుడూ కొత్త కాంబినేషన్లలో కొన్ని చిన్న సినిమాలు నిర్మిస్తుంటారు. ఈ కోవలోనే రాజు నుంచి ఒక ఆశ్చర్యకర చిత్రం వస్తోంది. ఆ సినిమా పేరు.. షాదీ ముబారక్.
మొగలి రేకులు సీరియల్తో సూపర్ పాపులారిటీ సంపాదించి.. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో హీరో ఫ్రెండుగా కనిపించి.. ఆ తర్వాత సిద్దార్థ అనే సినిమా కూడా చేసిన ఆర్కే నాయుడు అలియాస్ సాగర్ ఈ చిత్రంలో కథానాయకకుడగా నటిస్తుండటం విశేషం. మలయాళీ అమ్మాయి దృశ్య రఘునాథ్ ఈ చిత్రంతో కథానాయికగా పరిచయం కానుంది. పద్మశ్రీ అనే కొత్త లేడీ డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించింది. సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చగా శ్రీకాంత్ నరోజ్ ఛాయాగ్రాహకుడు. మొత్తంగా ఈ టీంను చూస్తే ఎవరూ పేరు లేని వాళ్లే. చాలా వరకు కొత్తవాళ్లే. ఈ టీంను నమ్మి దిల్ రాజు లాంటి నిర్మాత సినిమాను నిర్మించాడంటే విశేషమే. బుధవారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతోంది. దీని రేంజ్ చూస్తే ఓటీటీ రిలీజ్ టార్గెట్ చేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on September 29, 2020 9:38 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…