గత రెండు దశాబ్దాల్లో తెలుగులో అత్యధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా దిల్ రాజే నిలుస్తారేమో. దిల్ లాంటి హిట్ మూవీతో నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టిన రాజు.. ఎక్కడా వెనుదిరిగి చూసుకున్నది లేదు. ఎన్నో బ్లాక్బస్టర్లు, క్లాసిక్లతో నిర్మాతగా తిరుగులేని స్థాయిని అందుకున్నారు. అప్పుడప్పుడూ కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నారు. ఓ వైపు భారీ చిత్రాలను నిర్మిస్తూనే ఆయన అప్పుడప్పుడూ కొత్త కాంబినేషన్లలో కొన్ని చిన్న సినిమాలు నిర్మిస్తుంటారు. ఈ కోవలోనే రాజు నుంచి ఒక ఆశ్చర్యకర చిత్రం వస్తోంది. ఆ సినిమా పేరు.. షాదీ ముబారక్.
మొగలి రేకులు సీరియల్తో సూపర్ పాపులారిటీ సంపాదించి.. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో హీరో ఫ్రెండుగా కనిపించి.. ఆ తర్వాత సిద్దార్థ అనే సినిమా కూడా చేసిన ఆర్కే నాయుడు అలియాస్ సాగర్ ఈ చిత్రంలో కథానాయకకుడగా నటిస్తుండటం విశేషం. మలయాళీ అమ్మాయి దృశ్య రఘునాథ్ ఈ చిత్రంతో కథానాయికగా పరిచయం కానుంది. పద్మశ్రీ అనే కొత్త లేడీ డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించింది. సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చగా శ్రీకాంత్ నరోజ్ ఛాయాగ్రాహకుడు. మొత్తంగా ఈ టీంను చూస్తే ఎవరూ పేరు లేని వాళ్లే. చాలా వరకు కొత్తవాళ్లే. ఈ టీంను నమ్మి దిల్ రాజు లాంటి నిర్మాత సినిమాను నిర్మించాడంటే విశేషమే. బుధవారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతోంది. దీని రేంజ్ చూస్తే ఓటీటీ రిలీజ్ టార్గెట్ చేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on September 29, 2020 9:38 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…