మాములుగా సినిమాలు శతదినోత్సవాలు చేసుకుంటే అభిమానులకు అదో పండగ. ఎన్ని ఎక్కువ సెంటర్లలో ఆడితే అంత గర్వంగా చెప్పుకుంటారు. కానీ శాండల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ మాత్రం జైల్లో ఊచలు లెక్కబెట్టడంలో 100 రోజులు పూర్తి చేసుకోవడం కొత్త సెన్సేషన్. స్వంత అభిమాని రేణుకస్వామి హత్య కేసులో విచారణ ఎదురుకుంటున్న దర్శన్ తో పాటు ఏ1గా ఉన్న అతని ప్రియురాలు పవిత్ర గౌడతో సహా సహ నిందితులందరూ ఈ మైలురాయిని చేరుకున్నారు. కన్నడ సీమలో ఇంత సుదీర్ఘంగా కారాగారంలో ఉన్న హీరోగా దర్శన్ కొత్త రికార్డు సృష్టించాడని యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.
దర్శన్ కు ఇంకా బెయిల్ దొరకలేదు. ఇటీవలే బెంగళూరు హై కోర్టు జ్యుడిషియల్ కస్టడీని సెప్టెంబర్ 30 వరకు పొడిచింది. రాజధాని జైలులో సకల భోగాలు అందుతున్నాయన్న అభియోగం మీద ఇతన్ని బళ్లారికి షిఫ్ట్ చేశారు. అక్కడ మాములు ఖైదీగానే ట్రీట్ చేస్తున్నారు. పోలీసులు బలమైన సాక్ష్యాధారాలు సేకరించడంతో దర్శన్ చుట్టూ బలమైన ఉచ్చు బిగుసుకుంది. డబ్బు పలుకుబడి ఏదీ పనిచేయనంత ఊబిలో ఇరుక్కుపోయాడు. ఇంకోవైపు ఫ్యాన్స్ మాత్రం తమ హీరో దోషినో కాదో తేలేవరకు తప్పుని ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నారు. ఈ మూడు నెలల్లో ఇతని రీ రిలీజ్ సినిమాలు చాలానే వచ్చాయి.
జూన్ 11 జిమ్ చేస్తున్న దర్శన్ ని అరెస్ట్ చేశాక ఇప్పటిదాకా బయటి ప్రపంచంలోకి రాలేదు. నిర్మాణంలో ఉన్న అతని ప్యాన్ ఇండియా మూవీ డెవిల్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీని మీద అప్పటిదాకా పెట్టిన పెట్టుబడి, అడ్వాన్సులు, ఆర్టిస్టుల కాల్ షీట్లు, ప్రొడక్షన్ కాస్ట్ రూపంలో కోట్లలో నష్టపోవాల్సి వస్తోందని నిర్మాత వాపోతున్నారు. గతంలో సంజయ్ దత్ తరహాలో బ్యాలన్స్ ఉన్న షూటింగుల్లో పాల్గొనే అవకాశం ఇచ్చేలా ఏదైనా తీర్పు వస్తుందేమోనన్నీ ఎదురు చూస్తున్నారు. ఏం చేసినా చెల్లుతుందనే అహంకారానికి ఎలాంటి పరిస్థితి వస్తుందో దర్శన్ ఉదంతమే పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది.
This post was last modified on September 19, 2024 2:30 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…