Movie News

తమిళోళ్ళు పడిపోయారు.. ఇక మనోళ్ళే

బాలీవుడ్ హీరోయిన్లు దక్షిణాది సినిమాల్లో నటించిన సందర్భాల్లో ఆయా చిత్రాల ప్రమోషనల్ ఈవెంట్లకు వస్తే.. పొడి పొడిగా లోకల్ భాషలో రెండు ముక్కలు మాట్లాడడం చూస్తుంటాం. ఆ రెండు మూడు ముక్కలు మాట్లాడ్డమే గొప్ప అని ఫీలవుతుంటారు. దక్షిణాది మూలాలున్న వాళ్లు కూడా ఇక్కడి భాషలు మాట్లాడే ప్రయత్నం పెద్దగా చేయరు. కానీ తాను ఆ కోవకు చెందనని చాటుతోంది జాన్వి కపూర్.

తెలుగమ్మాయి అయిన శ్రీదేవి తనయురాలు అయిన జాన్వి.. తన మూలాలను మరిచిపోలేదని అనిపిస్తోంది. ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న జాన్వి.. ఈ చిత్రాన్ని తమిళంలో ప్రమోట్ చేయడానికి చెన్నైకి వెళ్ళింది. అక్కడ స్పష్టమైన తమిళంలో మాట్లాడి తమిళులను పడేసింది. తన ప్రసంగాన్ని ఇంగ్లిష్‌లోనే మొదలుపెట్టినప్పటికీ.. ఎక్కువ గ్యాప్ లేకుండా తమిళంలోకి వెళ్లిపోయింది.

తమిళంలో మాట్లాడ్డం మొదలుపెట్టగానే ఏవో రెండు మూడు మాటలు బట్టీ కొట్టుకుని వచ్చి ఉంటుందని అనుకున్నారు విలేకరులు. కానీ ఆమె స్పష్టంగా తమిళంలోనే ఒక్కో వాక్యం పూర్తి చేస్తూ వెళ్లింది. తనకు చెన్నై ఎంత స్పెషలో ఆమె వివరించింది. చిన్నతనంలో తన తల్లితో ఉన్న మంచి జ్ఞాపకాలన్నీ చెన్నైతో ముడిపడినవే అని.. తనకిప్పుడు ఇంటికి తిరిగొచ్చినట్లు అనిపిస్తోందని.. ఆమెకు ఈ ప్రాంతం చాలా స్పెషల్ అని జాన్వి చెప్పుకొచ్చింది. తన తల్లిని ఇక్కడి వాళ్లు ఎంతో ఆదరించారని.. తనకు కూడా అలాంటి ప్రేమనే పంచాలని ఆమె కోరింది. చాలా వినమ్రంగా, ఏ తడబాటూ లేకుండా చక్కటి తమిళంలో జాన్వి మాట్లాడడంతో భాషాభిమానం ఎక్కువగా ఉండే తమిళ జనాలు ఫిదా అయిపోయారు.

శ్రీదేవి తెలుగమ్మాయే అయినా ఆమె చాలా ఏళ్లు చెన్నైలోనే ఉంది. అందుకే పిల్లలకు కూడా తమిళం నేర్పినట్లుంది. ఆమె తెలుగు కూడా ఆటోమేటిగ్గా బాగానే నేర్పి ఉంటుంది. కాబట్టి ‘దేవర’ తెలుగు వెర్షన్ ప్రి రిలీజ్ ఈవెంట్లో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడి ఇక్కడి వాళ్లను కూడా పడేయడం ఖాయమేమో.

This post was last modified on September 18, 2024 9:48 am

Share

Recent Posts

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

42 minutes ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

2 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

2 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

3 hours ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

7 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

8 hours ago