ఏదో దసరాకు మంచి డేట్ దొరికిందని అక్టోబర్ 10 లాక్ చేసుకుంటే రజనీకాంత్ వెట్టయన్ ఇచ్చిన షాక్ కి వాయిదా వేసుకున్న కంగువ బృందం ఇంకా విడుదల తేదీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నవంబర్ వైపు చూస్తోంది కానీ అంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి అది సరైన సీజన్ కాదనే అనుమానంతో విడుదల తేదీని ప్రకటించడంలో జాప్యం చేస్తోంది. ఒకవేళ చివరి నిమిషం ఒత్తిళ్ల వల్ల పుష్ప 2 కనక డిసెంబర్ నుంచి తప్పుకుంటే ఆ అవకాశాన్ని వాడుకోవడం మంచి ఆలోచనే కానీ సుకుమార్, అల్లు అర్జున్ ఎట్టి పరిస్థితుల్లో వేరొకరికి ఆ ఛాన్స్ ఇచ్చే సూచనలు క్రమంగా తగ్గిపోతున్నాయి.
కంగువ ఇంతగా మీనమేషాలు లెక్కబెట్టడానికి కారణం లేకపోలేదు, దీని మీద భారీ పెట్టుబడులు జరిగాయి. తెలుగు థియేట్రికల్ హక్కుల నుంచి సుమారు 45 కోట్లు ఆశిస్తుండగా ఇంకా ఒప్పందాలు కొలిక్కి రాలేదు. హిందీ డబ్బింగ్ ఏకంగా 100 కోట్ల ధర చెబుతుండటం వల్ల రికవరీ అంత సులభంగా ఉండదు. కేవలం తమిళ వెర్షన్ ని మాత్రమే చూసుకుంటే 200 కోట్ల దాకా బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓవర్సీస్ సైతం 50 కోట్ల దాకా టార్గెట్ ఉందట. ఇక డిజిటల్, ఆడియో హక్కులు వేరే. ఇదంతా వెనక్కు రావాలంటే కనీసం మూడు వందల కోట్లకు పైగా షేర్ వస్తేనే సాధ్యమవుతుంది.
సో ఎలాంటి పోటీ లేకుండా రావడం కంగువకు చాలా అవసరం. డిసెంబర్, జనవరిలో ఛాన్స్ లేదు కాబట్టి నవంబర్ 15 ఒక ఆప్షన్ గా పెట్టుకున్నట్టు చెబుతున్నారు. క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు ఆగి చూడాల్సిందే. యువి క్రియేషన్స్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న కంగువ మీద నిర్మాత జ్ఞానవేల్ రాజా ఉన్నదంతా పెట్టారనే టాక్ చెన్నై వర్గాల్లో ఉంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారట. టీజర్ కి మంచి స్పందన వచ్చినప్పటికీ అమాంతం హైప్ పెరిగేలా లేకపోవడంతో ఇంకో ట్రైలర్ కట్ సిద్ధం చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న కంగువలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది.
This post was last modified on September 17, 2024 7:15 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…