పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు మూడున్నా అభిమానులు మాకు ఒకటే ఉందన్న తీరులో ఎక్కడ చూసినా ఓజి జపంతో వేదికలను హోరెత్తిస్తున్నారు. ఇంకా బ్యాలన్స్ ఉన్నప్పటికీ, ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేనప్పటికీ దానికి ఏ స్థాయి ఓపెనింగ్స్ దక్కుతాయో ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరించేలా హంగామా చేస్తున్నారు. కానీ దీనికన్నా ముందు హరిహర వీరమల్లు పార్ట్ 1 రిలీజయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే సంవత్సరాల తరబడి విలువైన కాలాన్ని, బడ్జెట్ ని ఖర్చు పెట్టారు. దర్శకత్వ బాధ్యతలు క్రిష్ నుంచి జ్యోతికృష్ణకు వచ్చాయి.
ఈ నెలాఖరు లేదా అక్టోబర్ లో పెండింగ్ ఉన్న భాగాన్ని పవన్ కు అనుకూలంగా ఉండే చోట సెట్లు వేసి పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విపరీతమైన ఆలస్యం జరగడం వల్ల ఫ్యాన్స్ లో హరిహరవీరమల్లు మీద ఆసక్తి తగ్గిపోయింది. నిజానికి పవర్ స్టార్ కెరీర్ లో అత్యంత ఖరీదైన చిత్రంగా దీని మీదే హైప్ నెలకొనాలి. కానీ రివర్స్ జరుగుతోంది. క్రమంగా ఓజి నుంచి అభిమానుల దృష్టి వీరమల్లు మీదకు రావాలంటే ఒక ప్లాన్ ప్రకారం ప్రమోషన్లు మొదలుపెట్టాలి. ఇప్పటిదాకా వచ్చిన టీజర్, పోస్టర్లు ఆ పని చేయలేకపోయాయి. పబ్లిసిటీ నిపుణులను రంగంలోకి దించితేనే పనవుతుంది.
ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందించడం లాంటి ఆకర్షణలు హరిహరవీరమల్లులో బోలెడున్నాయి. బాబీ డియోల్ ఔరంగజేబుగా కీలక పాత్ర పోషించాడు. నిధి అగర్వాల్ గ్లామర్ మరో అట్రాక్షన్. అన్నింటిని మించి కళ్ళు చెదిరే సెట్లు, పవన్ చేసే సాహసోపేత విన్యాసాలు చాలానే ఉండబోతున్నాయి. ఇవన్నీ ఆడియన్స్ కన్నా ముందు ఫ్యాన్స్ లోకి తీసుకెళ్లగలిగితే కాసేపు ఓజికి బ్రేక్ ఇచ్చి వీరమల్లు మేనియాకు వస్తారు. ఇలాంటి పీరియాడిక్ డ్రామాలు నార్త్ లోనూ బాగా ఆడుతున్న నేపథ్యంలో హిందీ మార్కెట్ మీద రత్నం ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. 2025 వేసవి రిలీజ్ ఉండొచ్చని సమాచారం.
This post was last modified on September 17, 2024 3:19 pm
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…