Movie News

వీరమల్లు వైపుకి దృష్టి మళ్లించాలి

పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు మూడున్నా అభిమానులు మాకు ఒకటే ఉందన్న తీరులో ఎక్కడ చూసినా ఓజి జపంతో వేదికలను హోరెత్తిస్తున్నారు. ఇంకా బ్యాలన్స్ ఉన్నప్పటికీ, ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేనప్పటికీ దానికి ఏ స్థాయి ఓపెనింగ్స్ దక్కుతాయో ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరించేలా హంగామా చేస్తున్నారు. కానీ దీనికన్నా ముందు హరిహర వీరమల్లు పార్ట్ 1 రిలీజయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే సంవత్సరాల తరబడి విలువైన కాలాన్ని, బడ్జెట్ ని ఖర్చు పెట్టారు. దర్శకత్వ బాధ్యతలు క్రిష్ నుంచి జ్యోతికృష్ణకు వచ్చాయి.

ఈ నెలాఖరు లేదా అక్టోబర్ లో పెండింగ్ ఉన్న భాగాన్ని పవన్ కు అనుకూలంగా ఉండే చోట సెట్లు వేసి పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విపరీతమైన ఆలస్యం జరగడం వల్ల ఫ్యాన్స్ లో హరిహరవీరమల్లు మీద ఆసక్తి తగ్గిపోయింది. నిజానికి పవర్ స్టార్ కెరీర్ లో అత్యంత ఖరీదైన చిత్రంగా దీని మీదే హైప్ నెలకొనాలి. కానీ రివర్స్ జరుగుతోంది. క్రమంగా ఓజి నుంచి అభిమానుల దృష్టి వీరమల్లు మీదకు రావాలంటే ఒక ప్లాన్ ప్రకారం ప్రమోషన్లు మొదలుపెట్టాలి. ఇప్పటిదాకా వచ్చిన టీజర్, పోస్టర్లు ఆ పని చేయలేకపోయాయి. పబ్లిసిటీ నిపుణులను రంగంలోకి దించితేనే పనవుతుంది.

ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందించడం లాంటి ఆకర్షణలు హరిహరవీరమల్లులో బోలెడున్నాయి. బాబీ డియోల్ ఔరంగజేబుగా కీలక పాత్ర పోషించాడు. నిధి అగర్వాల్ గ్లామర్ మరో అట్రాక్షన్. అన్నింటిని మించి కళ్ళు చెదిరే సెట్లు, పవన్ చేసే సాహసోపేత విన్యాసాలు చాలానే ఉండబోతున్నాయి. ఇవన్నీ ఆడియన్స్ కన్నా ముందు ఫ్యాన్స్ లోకి తీసుకెళ్లగలిగితే కాసేపు ఓజికి బ్రేక్ ఇచ్చి వీరమల్లు మేనియాకు వస్తారు. ఇలాంటి పీరియాడిక్ డ్రామాలు నార్త్ లోనూ బాగా ఆడుతున్న నేపథ్యంలో హిందీ మార్కెట్ మీద రత్నం ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. 2025 వేసవి రిలీజ్ ఉండొచ్చని సమాచారం.

This post was last modified on September 17, 2024 3:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అపార్టుమెంట్ పార్కింగ్ ఇష్యూ సుప్రీం వరకు వెళ్లింది

ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…

3 mins ago

స్పిరిట్ కోసం క్రేజీ విలన్ జంట ?

దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…

20 mins ago

`10 టు 10`.. ఇదీ ఏపీ లిక్క‌ర్ పాల‌సీ!

ఏపీలో చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నూత‌న మ‌ద్యం విధానాన్ని తీసుకువ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ…

2 hours ago

‘శ్రీవారి ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు క‌లిపారు’

అనేక వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చి.. తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునే భ‌క్తుల‌ను వైసీపీ ప్ర‌భుత్వం నిలువునా మోసం చేసింద‌ని ఏపీ సీఎం…

2 hours ago

నిర్మాతలకు పవన్ క్షమాపణ చెప్పిన వేళ

కారణాలు ఎన్నున్నా హీరోలు వ్యక్తిగతంగా నిర్మాతలకు సారీ చెప్పే సందర్భాలు బహు అరుదుగా ఉంటాయి. స్క్రీన్ మీదే కాదు బయట…

2 hours ago

జానీ మాస్టర్ కు దిమ్మ తిరిగే షాక్.. పోక్స్ కేసు నమోదు

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషాకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇప్పటివరకు ఆయన మీద ఆరోపణలు…

3 hours ago