Movie News

సూర్య కార్తీ మిస్సయిన రాజమౌళి మూవీ

కొన్ని కాంబోలు అనుకోగానే అయిపోవు. దానికి రాసిపెట్టి ఉండాలి. అన్నం గింజ మీద తినేవాడి పేరు ఉంటుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇది సినిమాలకూ వర్తిస్తుంది. అలాంటి ఒక అరుదైన విశేషాన్ని కార్తీ ఇటీవలే పంచుకున్నాడు. సెప్టెంబర్ 28 విడుదల కాబోతున్న సత్యం సుందరం ప్రమోషన్లలో భాగంగా గౌతమ్ మీనన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇద్దరు అన్నదమ్ములు ఎందుకు కలిసి నటించడం లేదనే దాని గురించి కొంత సేపు మాట్లాడాడు. రోలెక్స్, ఖైదీలు కలిస్తే తెరమీద ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారనే దానికి ఏకీభవిస్తూ ఒక ముచ్చట చెప్పాడు.

చాలా ఏళ్ళ క్రితం సూర్య, కార్తీ కాంబినేషన్ లో రాజమౌళి ఒక కథ చెప్పారు. వినగానే బాగుందనిపించినా ఎందుకో కార్యరూపం దాల్చలేకపోయింది. పేరేంటో చెప్పలేదు కానీ దాదాపుగా ఆది ఆర్ఆర్ఆర్ అయ్యుంటుందని చెప్పొచ్చు. కానీ ఆ బ్రదర్స్ కి కనెక్ట్ కాకపోవడానికి కారణం ఉండొచ్చు. తమిళ ప్రేక్షకులకు అంతగా అవగాహన లేని అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో కనిపిస్తే కోలీవుడ్ ఆడియన్స్ రిసీవ్ చేసుకోరనే సందేహం వచ్చి ఉండొచ్చు. దాంతో ఈ ప్రాజెక్ట్ ప్రాధమిక దశలో ఆగిపోయిందేమో. కార్తీ ఇంత డీటెయిల్డ్ గా చెప్పలేదు కానీ క్లూస్ ని బట్టి చూస్తే ఇదే అనుకోవచ్చు.

ఎంత స్టార్లైనా ఒకే ఇంటి నుంచి వచ్చిన అన్నదమ్ముల మల్టీస్టారర్లు తీయడం అంత సులభం కాదు. క్యామియోలు పక్కనపెడితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసిన ఇప్పటిదాకా స్క్రీన్ పంచుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాంబోని ఎవరూ రాయలేదు. నాగచైతన్య, అఖిల్ తెరపై కలయిక ఇప్పట్లో జరగదేమో. బాబాయ్ అబ్బాయి వెంకటేష్, రానాలు ఫుల్ లెన్త్ మూవీ చేయలేదు. రానా నాయుడు వెబ్ సిరీస్ కాబట్టి పరిగణనలోకి రాదు. ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉదాహరణలు వస్తూనే ఉంటాయి. పైన చెప్పింది నిజమే అయితే ఆర్ఆర్ఆర్ వద్దనుకోవడం వల్లే తారక్, చరణ్ కాంబో మనం చూడగలిగాం.

This post was last modified on September 17, 2024 11:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీ ఎమ్మెల్యే నోట రాజీమానా మాట

ఏపీలో కూటమి పాలన ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సాగడంతో పాటుగా…

41 minutes ago

పెద్ది… పెద్ద మనసు చేసుకుని చెప్పేసెయ్

ఇండస్ట్రీ, ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న క్షణం పెద్ది అనౌన్స్ మెంట్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచం మొత్తం…

47 minutes ago

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం…

6 hours ago

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు…

9 hours ago

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

10 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

14 hours ago