Movie News

ఒళ్ళు గగుర్పొడిచే హత్యలతో ‘సెక్టార్ 36’

సైకో కిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలానే చూస్తాం కానీ కొన్ని ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటే అవి నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసినదని తెలిస్తే పీడకలలుగా మారడం ఖాయం.

తాజాగా నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో పాటు రిలీజైన సెక్టార్ 36 అదే కోవలోకి వస్తుంది. 10త్ ఫెయిల్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాసే ప్రధాన పాత్రలో రూపొందిన ఈ క్రైమ్ డ్రామా మీద భారీ అంచనాలున్నాయి. రెండు గంటల నిడివితో రూపొందిన సెక్టార్ 36 మీద ఇంత బజ్ రావడానికి కారణం ఒకప్పుడు దేశాన్ని భయానికి గురి చేసిన సంఘటనని తీసుకుని రూపొందించడమే.

2006 సంవత్సరం. నోయిడా దగ్గరున్న నిఠారి గ్రామంలో వరసగా చిన్న పిల్లలు కిడ్నాప్ కు గురవుతూ ఉంటారు. టీనేజ్ వయసు కాబట్టి తల్లితండ్రులతో గొడవ పడి వెళ్ళిపోయి ఉంటారని పోలీసులు నిర్లక్ష్యం చేస్తారు. అయితే కొన్నిరోజుల తర్వాత చనిపోయిన పిల్లల శరీర భాగాలు మురికి కాలువలో దొరుకుతాయి.

ఈ హత్యలకు అదే ప్రాంతంలో ఉండే ఒక ధనవంతుడు, అతని పనిమనిషి ప్రేమ్ (విక్రాంత్ మాసే)కు సంబంధం ఉందనేందుకు ఆధారాలు దొరుకుతాయి. దొరికిపోయాక ప్రేమ్ నిర్భయంగా నేరాన్ని అంగీకరిస్తాడు. అసలు ట్విస్టులు, కథ ఇక్కడి నుంచి మొదలవుతుంది. అది సినిమాలోనే చూడాలి.

పిల్లలను చంపి వాళ్ళ శరీర భాగాలతో వ్యాపారం చేయడమనే వివాదం మీద నిఠారి సీరియల్ కిల్లింగ్స్ కేసు ఏళ్ళ తరబడి కోర్టులో నడిచింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ ని సైతం దారుణంగా గొంతు కోసి చంపినట్టు సెక్టార్ 36లో చూపించారు. దీన్ని బట్టే ఎంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ జరిగాయో అర్థం చేసుకోవచ్చు.

నిడివి తక్కువ కాబట్టి చాలా విషయాలను క్లుప్తంగా చూపించారు కానీ అప్పట్లో జరిగిన ఇన్సిడెంట్స్ వెనుక పెద్ద చరిత్ర ఉంది. ఇంత జరిగినా సరైన ఎవిడెన్స్ లేదనే కారణంతో నిందితుల మీద నేరం ఋజువు కాకపోవడం అసలు ట్రాజెడీ. సున్నిత మనస్కులు సెక్టార్ 36కి దూరం ఉండటం బెటర్.

Satya

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

49 minutes ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

2 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

4 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

5 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

6 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

7 hours ago