సైకో కిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలానే చూస్తాం కానీ కొన్ని ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటే అవి నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసినదని తెలిస్తే పీడకలలుగా మారడం ఖాయం.
తాజాగా నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో పాటు రిలీజైన సెక్టార్ 36 అదే కోవలోకి వస్తుంది. 10త్ ఫెయిల్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాసే ప్రధాన పాత్రలో రూపొందిన ఈ క్రైమ్ డ్రామా మీద భారీ అంచనాలున్నాయి. రెండు గంటల నిడివితో రూపొందిన సెక్టార్ 36 మీద ఇంత బజ్ రావడానికి కారణం ఒకప్పుడు దేశాన్ని భయానికి గురి చేసిన సంఘటనని తీసుకుని రూపొందించడమే.
2006 సంవత్సరం. నోయిడా దగ్గరున్న నిఠారి గ్రామంలో వరసగా చిన్న పిల్లలు కిడ్నాప్ కు గురవుతూ ఉంటారు. టీనేజ్ వయసు కాబట్టి తల్లితండ్రులతో గొడవ పడి వెళ్ళిపోయి ఉంటారని పోలీసులు నిర్లక్ష్యం చేస్తారు. అయితే కొన్నిరోజుల తర్వాత చనిపోయిన పిల్లల శరీర భాగాలు మురికి కాలువలో దొరుకుతాయి.
ఈ హత్యలకు అదే ప్రాంతంలో ఉండే ఒక ధనవంతుడు, అతని పనిమనిషి ప్రేమ్ (విక్రాంత్ మాసే)కు సంబంధం ఉందనేందుకు ఆధారాలు దొరుకుతాయి. దొరికిపోయాక ప్రేమ్ నిర్భయంగా నేరాన్ని అంగీకరిస్తాడు. అసలు ట్విస్టులు, కథ ఇక్కడి నుంచి మొదలవుతుంది. అది సినిమాలోనే చూడాలి.
పిల్లలను చంపి వాళ్ళ శరీర భాగాలతో వ్యాపారం చేయడమనే వివాదం మీద నిఠారి సీరియల్ కిల్లింగ్స్ కేసు ఏళ్ళ తరబడి కోర్టులో నడిచింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ ని సైతం దారుణంగా గొంతు కోసి చంపినట్టు సెక్టార్ 36లో చూపించారు. దీన్ని బట్టే ఎంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ జరిగాయో అర్థం చేసుకోవచ్చు.
నిడివి తక్కువ కాబట్టి చాలా విషయాలను క్లుప్తంగా చూపించారు కానీ అప్పట్లో జరిగిన ఇన్సిడెంట్స్ వెనుక పెద్ద చరిత్ర ఉంది. ఇంత జరిగినా సరైన ఎవిడెన్స్ లేదనే కారణంతో నిందితుల మీద నేరం ఋజువు కాకపోవడం అసలు ట్రాజెడీ. సున్నిత మనస్కులు సెక్టార్ 36కి దూరం ఉండటం బెటర్.
This post was last modified on September 14, 2024 6:25 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…