కాస్త పేరున్న హీరో సినిమాలు 50 రోజుల వ్యవధిలో మూడు రిలీజ్ కావడమే అరుదు. ఆ మూడు కూడా ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ కావడం ఇంకా అరుదు. ఈ అన్ వాంటెడ్ రికార్డునే మూటగట్టుకున్నాడు యువ కథానాయకుడు రాజ్ తరుణ్. ఎప్పుడో కెరీర్ ఆరంభంలో ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి మంచి డిమాండ్ తెచ్చుకున్న ఈ కుర్రాడు.. ఆ తర్వాత ఇబ్బడిముబ్బడిగా సినిమాలు చేశాడు.
కానీ ఆ చిత్రాలేవీ అతడికి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఒక దశ దాటాక అతడి ఫ్లాపుల్ని లెక్కగట్టడం కూడా మానేశారు ప్రేక్షకులు. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చిన అతను.. గత 50 రోజుల్లో మూడు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూడు కూడా తీవ్ర నిరాశనే మిగిల్చాయి రాజ్కు.
లావణ్య చౌదరితో వ్యక్తిగత వివాదం కారణంగా రాజ్ పేరు మీడియాలో బాగా నానుతున్న టైంలో జులై 26న అతడి ‘పురుషోత్తముడు’ సినిమాను సడెన్గా థియేటర్లలోకి దించారు. ‘శ్రీమంతుడు’కు నకలులా అనిపించిన ఆ చిత్రం మినిమం ఇంపాక్ట్ వేయకుండా వెళ్లిపోయింది. ఇంకో వారం రోజులకే ‘తిరగబడరా సామీ’ అంటూ మరో సినిమాతో పలకరించాాడు రాజ్. ముందు వచ్చిన సినిమానే కాస్త నయం అనిపించిందీ మూవీ. మరీ దారుణమైన రివ్యూలు, టాక్ రావడంతో సినిమా అడ్రస్ లేకుండా పోయింది.
ఆ తర్వాత 40 రోజులు గ్యాప్ ఇచ్చి లేటెస్ట్గా ‘భలే ఉన్నాడే’ సినిమాతో వచ్చాడు రాజ్. మారుతి ఈ చిత్రానికి కాన్సెప్ట్ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించడం, ట్రైలర్ కొంత ఆకర్షణీయంగా ఉండడంతో ఇదైనా ప్రేక్షకులను మెప్పిస్తుందేమో అనుకున్నారు. ఐతే అడల్ట్ టచ్ ఉన్న ఈ కాన్సెప్ట్ వినడానికి బాగున్నా.. ఎగ్జిక్యూషన్ తేలిపోవడంతో ప్రేక్షకులు చివరి వరకు థియేటర్లో కూర్చోలేని పరిస్థితి తలెత్తుతోంది. రాజ్ గత చిత్రాలతో పోలిస్తే బెటర్ అంటున్నారే తప్ప.. ఇది కూడా శిరోభారం కలిగించే సినిమానే అని తేల్చేస్తున్నారు. దీంతో 50 రోజుల వ్యవధిలో రాజ్ ఖాతాలో మూడు డిజాస్టర్లు పడ్డట్లయింది. ఈ స్థితి నుంచి అతనెలా కోలుకుంటాడో చూడాలి మరి.
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…